IMD Yellow Bulletin: వాయుగుండం అప్ డేట్.. ఎల్లో బులిటిన్ కంటిన్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. వాయువ్య దిశగా గంటకు 5 కి.మీ వేగంతో కదులుతూ చెన్నెకి సమీపిస్తున్న వాయుగుండం. చెన్నైకి తూర్పున 140, నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 225కి.మీ.దూరంలో కొనసాగుతుంది ఈ వాయుగుండం. తీరానికి సమీపించే కొద్దీ బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని ఐ ఎండీ అంచనా వేస్తోంది. వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి బలంగా వీస్తున్నాయి గాలులు. ప్రకాశం,నెల్లూరు,రాయలసీమ జిల్లాలలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లో బులెటిన్ వార్నింగ్ కొనసాగిస్తుంది ఐఎండీ.
రాబోయే 48 గంటల్లో.. తమిళనాడు, ఏపీ తీరానికి దగ్గరగా రానుందని తెలిపిన అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వైయస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. అందువల్ల చేపలు పట్టేవారు.. సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం వుంది.
Also Read
Read ALso: Foot Ball: సినిమాల్లో దుమ్మురేపిన ‘ఫుట్ బాల్’!
బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా వర్షాలు పడుతున్నాయి. చెన్నై నగరంలో భారీ వర్షం కురిసింది. నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన చిన్న చిన్న అల్పపీడనాలన్నీ కలిసి వాయుగుండంగా మారాయి. ఇది చెన్నైకు 670 కి.మీ, కారైక్కాల్ ప్రాంతానికి 630 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర వైపు రానున్న 48 గంటల్లో పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్లో ఒకటి రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సోమవారం వర్షం పడింది. జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల వర్షం పడింది. వర్షంతో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు వద్ద ఇబ్బందులు పడుతున్నారు రైతులు.
విల్లుపురం, కడలూరు, తిరువణ్ణామలై, కాంచీపురం, రాణిపేట, తిరువళ్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఉత్తర తమిళనాడులో మంగళవారం భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ వాయుగుండం ప్రభావం కారణంగా చెన్నై నగరంలో భారీ వర్షం కురుస్తుందని, అప్రమత్తంగా వుండాలని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. అంతేకాకుండా, కోస్తాంధ్ర తీరం, తమిళనాడు-పుదుచ్చేరి తీరప్రాంతం, శ్రీలంక తీరం, నైరుతి బంగాళాఖాతం, దానిని అనుకుని ఉన్న ప్రాంతాల్లో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, అందువల్ల వచ్చే 24 గంటల పాటు జాలర్లు సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళవద్దని వాతావారణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత పెరిగింది.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
తాజావార్తలు
-
Earthquake: భూకంపాల దెబ్బకు ఉలిక్కిపడ్డ రెండు దేశాలు.. జపాన్, వెనిజులాలో కలకలం
-
Vastu Tips: ఇంట్లో ఎప్పుడూ భారంగా అనిపిస్తుందా? వాస్తు ప్రకారం ఈ చిన్న విషయాలు కారణమా?
-
Story Board : నాలుగోసారి గెలవడానికి.. మోడీ దగ్గరున్న త్రిశూల వ్యూహాలేంటి..?
-
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
-
T20 World Cup: ఆమె భర్త కోసం ప్రాక్టీస్ ఎగ్గొట్టింది.. చివరకు డ్రెస్సింగ్ రూమ్లో పరువు పోయింది..
ట్రెండింగ్
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!