IMD Yellow Bulletin: వాయుగుండం అప్ డేట్.. ఎల్లో బులిటిన్ కంటిన్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. వాయువ్య దిశగా గంటకు 5 కి.మీ వేగంతో కదులుతూ చెన్నెకి సమీపిస్తున్న వాయుగుండం. చెన్నైకి తూర్పున 140, నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 225కి.మీ.దూరంలో కొనసాగుతుంది ఈ వాయుగుండం. తీరానికి సమీపించే కొద్దీ బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని ఐ ఎండీ అంచనా వేస్తోంది. వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి బలంగా వీస్తున్నాయి గాలులు. ప్రకాశం,నెల్లూరు,రాయలసీమ జిల్లాలలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లో బులెటిన్ వార్నింగ్ కొనసాగిస్తుంది ఐఎండీ.
రాబోయే 48 గంటల్లో.. తమిళనాడు, ఏపీ తీరానికి దగ్గరగా రానుందని తెలిపిన అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వైయస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. అందువల్ల చేపలు పట్టేవారు.. సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం వుంది.
Also Read
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. రూ.32లకే కిలో ఉల్లిపాయలు..
- YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్లో యూట్యూబర్ రమా నందన విచారణ..
- Are Shyamala: కులాలు, మతాలు మార్చేశారా?.. డీఎస్సీపై ఆరె శ్యామల సంచలన వ్యాఖ్యలు
- Kurnool Ganesh Immersion: వినాయక నిమజ్జనంపై మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన.. కర్నూలులో ఎక్కడంటే?
Read ALso: Foot Ball: సినిమాల్లో దుమ్మురేపిన ‘ఫుట్ బాల్’!
బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా వర్షాలు పడుతున్నాయి. చెన్నై నగరంలో భారీ వర్షం కురిసింది. నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన చిన్న చిన్న అల్పపీడనాలన్నీ కలిసి వాయుగుండంగా మారాయి. ఇది చెన్నైకు 670 కి.మీ, కారైక్కాల్ ప్రాంతానికి 630 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర వైపు రానున్న 48 గంటల్లో పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్లో ఒకటి రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సోమవారం వర్షం పడింది. జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల వర్షం పడింది. వర్షంతో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు వద్ద ఇబ్బందులు పడుతున్నారు రైతులు.
విల్లుపురం, కడలూరు, తిరువణ్ణామలై, కాంచీపురం, రాణిపేట, తిరువళ్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఉత్తర తమిళనాడులో మంగళవారం భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ వాయుగుండం ప్రభావం కారణంగా చెన్నై నగరంలో భారీ వర్షం కురుస్తుందని, అప్రమత్తంగా వుండాలని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. అంతేకాకుండా, కోస్తాంధ్ర తీరం, తమిళనాడు-పుదుచ్చేరి తీరప్రాంతం, శ్రీలంక తీరం, నైరుతి బంగాళాఖాతం, దానిని అనుకుని ఉన్న ప్రాంతాల్లో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, అందువల్ల వచ్చే 24 గంటల పాటు జాలర్లు సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళవద్దని వాతావారణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత పెరిగింది.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
తాజావార్తలు
-
Harish Rao : 1000 రోజులు.. హామీలు ఎక్కడ? హరీశ్ రావు బిగ్ కౌంటర్!
-
Putin: బ్రిక్స్కు ముందే ఢిల్లీకి వస్తున్న పుతిన్.. కారణమిదే!
-
Tollywood vs Kollywood: తెలుగు గడ్డపై తమిళ హీరోల జోరు.. మరి కోలీవుడ్లో తెలుగు సినిమాల పరిస్థితి దారుణమా?
-
PM Modi: మోడీ ముంబై టూర్లో కలకలం.. ఇద్దరు అనుమానితుల నుంచి నకిలీ ID, తుపాకీ స్వాధీనం!
-
Supreme Court: ‘మా మనసులో ఒక ఆలోచన ఉంది’.. హాస్టళ్ల భద్రతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!