NTR District: చెల్లెలి కోసం ఎడ్లబండిపై హస్తినకు అన్న.. స్పందించిన హెచ్ఆర్సీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్తుల కోసం తోబుట్టువులను దూరం చేసుకుంటున్న ఈ రోజుల్లో ఓ అన్న తన చెల్లెలి కోసం చేస్తున్న పోరాటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన దుర్గారావు తన చెల్లి కోసం హస్తిన బాట పట్టాడు. తన సోదరి నవ్యతను చందాపురం గ్రామానికి చెందిన కొంగర నరేంద్రనాథ్ కిచ్చి 2018లో పెళ్లి చేశాడు. కట్నంగా 23 లక్షల డబ్బు బంగారం, మూడు ఎకరాల పొలం ఇచ్చాడు. కానీ అత్తింటివారి ధనదాహం తీరలేదు. తరచూ డబ్బు ఇవ్వాలంటూ చెల్లెలికి వేధింపులు తప్పలేదు. దీంతో దుర్గారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాళ్లు కూడా అంతగా పట్టించుకోలేదు. దీంతో ఢిల్లీ వెళ్లి సుప్రీంకోర్టు తలుపు తట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఈనెల 23న ముప్పాళ్ల నుంచి తల్లితో కలిసి ఎడ్లబండి మీద హస్తినకు బయల్దేరాడు.
Interesting Facts: అన్నవరం ప్రసాదం రుచి వెనుక రహస్యమేంటి?
Also Read
- AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
- Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్లో సంచలన నిజాలు..
తన చెల్లెలి అత్తమామల ఫ్లెక్సీలను ఎడ్లబండికి ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేస్తుంటే రూ.50 లక్షలకు పరువు నష్టం దావా వేసి నోటీసులు ఇస్తామని బెదిరింపులు కూడా వచ్చాయి. ఈ విషయాలపై మీడియాలో కథనాలు రావడంతో హెచ్ఆర్సీ స్పందించింది. కేసు సుమోటోగా స్వీకరించి అధికారులకు నోటీసులు జారీ చేసింది. HRC జ్యుడిషియల్ సభ్యుడు దండే సుబ్రమణ్యం… అధికారులతో పాటు నవ్యత ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అలాగే కేసును సుమోటోగా స్వీకరించిన హెచ్చార్సీ విచారణ స్వీకరించి జూన్ 13కు వాయిదా వేసింది. హెచ్ఆర్సీ నోటీసులతో అలర్ట్ అయిన అధికారులు దుర్గారావుకు సమాచారం అందించి అతడి ప్రయాణం ఆపించారు. ఎలాగైనా న్యాయం జరిగేలా చూస్తామని దుర్గారావుకు అధికారులు హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!