Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandyala District: నంద్యాల జిల్లా అవుకు మండలం రామాపురంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. గాలేరు నగరి కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. కాలువలో పారే నీటి ప్రవాహాన్ని చూసేందుకు వెళ్లిన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదవశాత్తు ఎనిమిదేళ్ల బాలుడు ఆరుష్ అదుపుతప్పి నీటిలో పడిపోగా, అతడిని కాపాడేందుకు తండ్రి అప్రోజ్ (36), అలాగే ఆయన బామ్మర్ది ఆషీక్ (32) తీవ్రంగా ప్రయత్నించారు.
అయితే కాలువలో సుమారు 3,200 క్యూసెక్కుల మేర నీటి ప్రవాహం అత్యంత వేగంగా ఉండటంతో, బాలుడిని రక్షించబోయిన తండ్రి, బామ్మర్ది ఇద్దరూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. గల్లంతైన అప్రోజ్ ఒక నాపరాతి ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తుండగా, ఆయన బామ్మర్ది ఆషీక్ బేతంచెర్ల అయ్యలూరులోని నాపరాతి ఫ్యాక్టరీలో కార్మికుడిగా జీవనం సాగిస్తున్నారు. కాలువలో కొట్టుకుపోయిన ఈ ముగ్గురి (అప్రోజ్, ఆరుష్, ఆషీక్) కోసం స్థానికులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కళ్లముందే నీటి ప్రవాహంలో గల్లంతు కావడంతో ఆ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోగా, రామాపురం గ్రామంలో తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి.
Also Read
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్లో సంచలన నిజాలు..
- YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
- Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
తాజావార్తలు
-
Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
-
India Squads: పంత్కు షాక్.. నితీశ్కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
-
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
-
CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
-
Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!