Yanamala: ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై తెచ్చిన ఆర్డినెన్స్ చట్ట విరుద్ధం ఎలా అవుతుంది..?
- ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్పై వైసీపీ నేతలకు అవగాహన లేదు..
- శాసనసభ నియమాలకు లోబడి ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై ఆర్డినెన్స్ జారీ చేశాం..
- వైసీపీ నేతలు అవగాహనా రాహిత్యంతో విమర్శలు చేస్తున్నారు: యనమల రామకృష్ణుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yanamala: వైఎస్ జగన్ రెడ్డి ఖాళీ చేసిన ప్రజల జేబులను నింపేలా కూటమి పాలన ఉంది అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్పై వైసీపీ నేతలకు అవగాహన లేదు.. రాజ్యాంగం ప్రకారం శాసనసభ నియమాలకు లోబడి ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై తెచ్చిన ఆర్డినెన్స్ చట్ట విరుద్ధం ఎలా అవుతుంది అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు అవగాహనా రాహిత్యంతో విమర్శలు చేస్తున్నారు.. ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన ఆర్థిక అరాచకత్వం వల్లనే ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొంది అని మండిపడ్డారు. 2019 నుంచి 2024 మధ్య వైసీపీ ప్రభుత్వం పన్నులు, ఛార్జీల రూపంలో ఒక్కో కుటుంబంపై రూ.7 లక్షల మేర భారం విధించి ప్రజల రక్తాన్ని పీల్చారు.. జగన్ ముఠా లక్షల కోట్లు స్వంత ఆదాయం పెంచుకున్నారు.. రూ.35 వేల కోట్ల విలువైన 1.75 లక్షల ఎకరాలను కబ్జా చేశారు అంటూ యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: National Girlfriends Day 2024: జాతీయ గర్ల్ఫ్రెండ్స్ దినోత్సవం.. ప్రత్యేకత ఏంటంటే?
Also Read
- YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
- YS Jagan: చంద్రబాబు చెప్పిన ప్రకారం పెట్రోల్, డీజిల్పై రూ.8 తగ్గించాలి కదా..? జగన్ డిమాండ్
- TDP Politburo Meeting: నేడు టీడీపీ పొలిట్బ్యూరో కీలక భేటీ.. మహానాడు ఏర్పాట్లపై ప్రధాన చర్చ
- Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
అలాగే, ఇసుక, ఖనిజ సంపద లూటీ చేసి రూ.19 వేల కోట్లు స్వాహా చేశారు అని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. నేడు కూటమి ప్రభుత్వం ప్రజలపై ఎటువంటి భారాలు లేకుండా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విషం చిమ్మేందుకు కుట్రలు చేస్తున్నారు.. ఇప్పటికి తేలిన లెక్కల ప్రకారం రూ.10 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు.. ఇంకా తేలాల్సిన అప్పులు వున్నవి.. ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసి కూడా అయిదేళ్లలో జగన్ ప్రభుత్వం ఒక్క సాగు నీటి ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు అని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రజల సొంత ఇంటి కలను తీర్చేందుకు రూ.4 లక్షలతో గృహ నిర్మాణానికి సాయం చేస్తోంది.. ఇచ్చిన మాట ప్రకారం 16, 347 డీఎస్సీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులకు అండగా నిలిచాం.. పింఛన్ను రూ.4 వేలకు పెంచడంతో పాటు అన్న క్యాంటీన్లను, రద్దు చేసిన పథకాలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు వెల్లడించారు.
తాజావార్తలు
-
Sai Sudharsan: చిన్నప్పుడు రోడ్డుపై ఆ జట్టును చూసేవాడిని.. ఇప్పుడు అదే జట్టుపై రికార్డులు: సాయి సుదర్శన్
-
Karnataka: త్వరలో కాంగ్రెస్ హైకమాండ్ భేటీ.. తేల్చేయనున్న కర్ణాటక పంచాయితీ!
-
Virat Kohli: ఈ ముగ్గురు బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం.. నా వల్ల కాదు: విరాట్ కోహ్లీ
-
Ebola outbreak: ఎబోలా వైరస్పై భారత్ అప్రమత్తం.. ఇండో-ఆఫ్రికా సదస్సు రద్దు..
-
Viral: వైద్యుడి నిర్లక్ష్యానికి ప్రాణం బలి.. కుడి కిడ్నీకి బదులు ఎడమ కిడ్నీ తొలగింపు.. రూ. 2 కోట్ల పరిహారం విధించిన NCDRC..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!