Shamshabad-Vizag Train: ప్రయాణికులకు శుభవార్త.. 4 గంటల్లోనే శంషాబాద్ టూ వైజాగ్
- శంషాబాద్- వైజాగ్ మధ్య సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్..
- గంటకు 220 కి.మీ. వేగంతో ట్రైన్ ప్రయాణం..
- విశాఖపట్నం- సూర్యాపేట- కర్నూలు మధ్య మరో కారిడార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shamshabad-Vizag Train: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల మధ్య రైలు ప్రయాణ సమయాన్ని తగ్గించే ప్రాజెక్టు ప్రణాళిక కీలక దశకు చేరుకుంది. శంషాబాద్- వైజాగ్ మధ్య సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ ఎలైన్మెంట్ ఫిక్స్ అయింది. సూర్యాపేట, విజయవాడ మీదుగా ఈ మార్గాన్ని రూపొందించారు. ఇందులో భాగంగా విశాఖపట్నం నుంచి విజయవాడ, సూర్యాపేటల మీదుగా కర్నూలుకు మరో కారిడార్ను నిర్మించబోతున్నారు. ఇది విశాఖ నుంచి ప్రారంభమై.. సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్ కర్నూల్ మీదుగా కర్నూలుకు చేరుకుంటుంది. వీటి ప్రిలిమినరీ ఇంజినీరింగ్, ట్రాఫిక్ సర్వే చివరి దశకు చేరకుంది. ఈ సర్వే నివేదికను నవంబరులో రైల్వేబోర్డుకు సమర్పించనున్నట్లు తెలుస్తుంది.
Read Also: Tamilnadu : తమిళనాడు రాష్ట్ర గీతంపై మళ్లీ వివాదం.. డిప్యూటీ సీఎం కార్యక్రమంపై ప్రశ్నలు
Also Read
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
ఇక, తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి సెమీ హైస్పీడ్ కారిడార్ ఇదే. ఈ మార్గంలో శంషాబాద్, రాజమండ్రి ఎయిర్ పోర్టులను అనుసంధానించేలా ప్రణాళిక రూపొందిస్తుండటం మరో విశేషం. విమాన ప్రయాణికులు సెమీ హైస్పీడ్ రైళ్లలో స్వస్థలాలకు త్వరగా చేరుకునేలా రైల్వేశాఖ ప్లాన్ చేస్తుంది. గంటకు 220 కిలో మీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించేలా సెమీ హైస్పీడ్ కారిడార్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తైతే.. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి విశాఖకు కేవలం నాలుగు గంటల్లోపే చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య రైలు ప్రయాణానికి సుమారు 12 గంటల సమయం పడుతుంది. అలాగే, వందే భారత్ 8 గంటల 30 నిమిషాల్లో చేరుకుంటోంది.
Read Also: Telangana Cabinet: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
అయితే, సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి ప్రస్తుతం రెండు మార్గాల్లో ట్రైన్స్ నడుస్తున్నాయి. మొదటిది వరంగల్, ఖమ్మం, విజయవాడ మార్గంలో ఉండగా.. రెండోది నల్గొండ, గుంటూరు, విజయవాడ మార్గాల్లో వెళ్తుంది.. ఈ రూట్స్ లో వెళ్లే రైళ్ల గరిష్ఠ వేగం గంటకు 110-130 కిలో మీటర్లు మాత్రమే ఉంది. ఈ రెండింటితో పోలిస్తే కొత్తగా వచ్చే శంషాబాద్- వైజాగ్ మార్గం దగ్గరవుతుంది. వేగం దాదాపు రెట్టింపై కావడంతో.. ప్రయాణ సమయం సగానికి తగ్గిపోతుంది.
తాజావార్తలు
-
Beijing: బీజింగ్లో ఎత్తైన భవనాన్ని ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్
-
Bhatti Vikramarka : డ్రగ్స్పై భట్టి వార్నింగ్.. ఎంతటి వారైనా వదిలేదే లేదు.!
-
Red Chili Test: వంటగదిలో వాడే ఎండు మిర్చి కారం నకిలీదా..? అసలుదా..? సింపుల్గా తెలుసుకోండిలా..
-
Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
-
NBK 112: కొరటాల సినిమా కోసం రూల్స్ బ్రేక్ చేసిన బాలయ్య
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!