Chandrababu On Rains: భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమైంది.. సహయక చర్యలు కొనసాగుతున్నాయి..
- వర్షాల కారణంగా 9మంది మృతి చెందారు..
- జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేశాం..
- సహాయక చర్యల్లో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలి..
- ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu On Rains: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలను వరద నీరు ముంచెత్తింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఏపీ విపత్తు నిర్వహణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఇక, ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. భారీ వర్షాల వల్ల రాష్ట్రం అతలాకుతలమైంది.. కొన్ని చోట్ల ఎప్పుడూ పడనంత వర్షం పడింది.. 14 నియోజకవర్గాల్లో 20 సెంటి మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది అని ఆయన తెలిపారు. వత్సవాయి, జగ్గయ్యపేట వంటి ప్రాంతాల్లో 30 శాతం వర్షపాతం నమోదైంది.. జాతీయ రహాదారులు స్థంభించిపోయాయి.. రోడ్ల మీదకు నీరొచ్చేసింది.. నాలుగు సార్లు టెలీకాన్ఫరెన్సులు నిర్వహించా.. ప్రభుత్వం రెగ్యులర్ మానిటరింగ్ చేయడం వల్ల ప్రాణ నష్టం తక్కువగా ఉంది.. కానీ 9 మరణాలు సంభవించాయి.. దురదృష్టకరం అని సీఎం చంద్రబాబు అన్నారు.
Read Also: Vande Bharat Sleeper: అదిరిపోయే “వందే భారత్ స్లీపర్ ట్రైన్” ఫీచర్లు.. మీరు ఓ లుక్కేయండి..
Also Read
- Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
- AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. ఉద్యోగుల బదిలీలపై నిషేధం పొడిగింపు..
- Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
ఇక, రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నీటితో నిండిపోయాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 1-2 లక్షల క్యూసెక్కుల నీరు వాగుల్లో ద్వారా వచ్చే ప్రమాదముంది.. ప్రకాశం బ్యారేజీకి వరద పొటెత్తుతోంది.. రేపటికల్లా ప్రకాశం బ్యారేజీకి 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చే సూచనలున్నాయి.. దిగువ ప్రాంతాల్లో సహయక చర్యలు తీసుకుంటున్నాం.. బండ్స్ పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బుడమేరుకు పెద్ధ ఎత్తున వరద వస్తోంది.. 1.50 లక్షల హెక్టార్లల్లో వరి పంట, ఉద్యాన పంటలూ నష్టపోయాయని ఆయన అన్నారు. ఇప్పటికే 17 వేల మందిని క్యాంపుల్లోకి తరలించాం.. 8 బూట్లు, రెండు ఛాపర్లు అత్యవసర పరిస్థితుల కోసం సిద్దంగా ఉంచాం.. రెస్క్యూ చేయగలిగామన్నారు. అలాగే, 25 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులు ఒక్కొక్క కిలో చొప్పున బాధితులకు ఇస్తున్నామని పేర్కొన్నారు. మత్స్యకారులు, చేనేతలకు అదనంగా 50 కేజీల బియ్యం ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : తెలంగాణకు బ్యాటరీ బూస్ట్.. క్వాంటమ్స్కేప్కు భట్టి ఆహ్వానం..!
-
CRS Portal : హైదరాబాద్లో గుడ్న్యూస్.. ఇక ఇంటి నుంచే బర్త్, డెత్ సర్టిఫికెట్లు
-
JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
-
KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
-
Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!