Teachers Behaviour: ఆ విద్యార్థిని పట్ల టీచర్, పీఈటీల అనుచిత ప్రవర్తన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిగ్గు… సిగ్గు.. సభ్య సమాజం తలదించుకునే ఘటన ఇది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు పూర్తయింది. ఎంతో సంబరంగా వజ్రోత్సవాలు జరుపుకుంటున్నాం. కానీ విద్యనేర్పి, సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన వారు అత్యంత హేయంగా ప్రవర్తించారు. ఏపీలోని అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ దారుణం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. విద్యా బుద్ధులు నేర్పే గురువు బుద్ధి గడ్డి తింది. పాతికేళ్ల క్రితం చదివిన స్కూల్ లో స్టడీ సర్టిఫికేట్ కోసం వచ్చిన పూర్వ విద్యార్థికి షాక్ తగిలింది.
Read Also: National Anthem: జాతీయ గీతం పాడుతూ మధ్యలో మరిచిపోయిన ఎంపీ.. వైరల్ అవుతున్న వీడియో
Also Read
- Rythu Shankaravam: 'రైతు శంఖారావం'కు అనుమతి నిరాకరణ.. ఎక్కడికక్కడే వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు!
- YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
ఆ పూర్వ విద్యార్ధిని పట్ల స్కూల్ హెడ్మాస్టర్, పీఈటీ అసభ్యంగా ప్రవర్తించారు. భోజన విరామ సమయంలో వచ్చిన ఆ పూర్వ విద్యార్ధినిని భోజనం చేసి వద్దామని చెప్పి కారులో హోటల్ కు తీసుకువెళ్లి అక్కడ భోజనం పార్శిల్ తీసుకొని మళ్ళీ కారులో ఎక్కించుకున్నారు. ఈ ఇద్దరు టీచర్లు పట్టణ శివారు ప్రాంతంలోకి వెళ్లి అక్కడ మద్యం సేవించి తమ వెంట తీసుకెళ్లిన గిరిజన మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఆ పూర్వ విద్యార్థిని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విస్మయం కలిగిస్తున్న ఈ ఘటనలో ఇద్దరు టీచర్ల పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది.
స్టడీ సర్టిఫికెట్ కోసం వెళ్లిన పూర్వ విద్యార్థిని (28 ఏళ్ల మహిళ) పై అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్, పీఈటీ జనార్దన్ రెడ్డి అసభ్యకరంగా ప్రవర్తించారు.. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రాయచోటి అర్భన్ సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. రాయచోటి పట్టణం బంగ్లా సర్కిల్ సమీపంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 16 ఏళ్ల కిందట 10వ తరగతి పూర్తి చేసిన ఓ పూర్వ విద్యార్థిని ఈ నెల 8వ తేదీ పాఠశాలకు వెళ్లి స్టడీ సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరారన్నారు. పత్రాలు ఇవ్వకుండా మధ్యాహ్నం అయిందని, భోజనం చేసి వద్దామంటూ విద్యార్థినిని కారులో తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించారని సదరు విద్యార్థిని పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశారన్నారు. ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్, పీఈటీ జనార్ధన్ రెడ్డిలపై అసభ్య ప్రవర్తన, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు రాయచోటి అర్భన్ సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆ ఇద్దరు ప్రబుద్ధుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
annamayya district, andhrapradesh, Crime, SC ST Case, Old Student, Mis behaviour, rayachoti bangla, CI Sudhakarreddy
తాజావార్తలు
-
Raaz Actress: అప్పుడు దెయ్యంగా భయపెట్టిన నటి.. ఇప్పుడు ఫామ్స్టే నడుపుతూ ప్రశాంత జీవితం..
-
India Missile Test: సాహో భారత్.. శత్రు దేశాలకు వార్నింగ్ సిగ్నల్! అడ్వాన్స్డ్ అగ్ని సిరీస్లో కీలక టెస్ట్..
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Hardik Pandya Injury: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మరోసారి గాయం.. ఈ గాయాల గోలేందిరా బాబూ!
-
Bigg Boss 10 Telugu: బోల్డ్ పర్సనాలిటీ.. భారీ ఫాలోయింగ్.. హౌస్లోకి ఈమె ఎంట్రీ ఇస్తే కుర్రాళ్లు చూపు తిప్పుకోలేరు!
ట్రెండింగ్
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!