Ambati Rambabu: రేపు గుంటూరు మిర్చి యార్డ్కు వైఎస్ జగన్.. కీలక వ్యాఖ్యలు చేసిన అంబటి
- రేపు గుంటూరుకు వైఎస్ జగన్..
- మిర్చి యార్డును సందర్శించనున్న వైసీపీ అధినేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. రేపు గుంటూరులో పర్యటించనున్నారు.. గుంటూరు మిర్చి యార్డును సందర్శించనున్న ఆయన.. రైతులతో మాట్లాడనున్నారు.. మిర్చి పండించడానికి పడిన కష్టాలు.. ప్రస్తుతం మిర్చి అమ్మేందుకు పడుతోన్న బాధలను తెలుసుకోనున్నారు.. వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనపై కీలక వ్యాఖ్యలు మాజీ మంత్రి అంబటి రాంబాబు.. రేపు గుంటూరు మిర్చి యార్డు లో మాజీ సీఎం జగన్ పర్యటిస్తారు… రేటు లేక అవస్థలు పడుతున్న ,రైతుల గోడు వినడానికి జగన్ వస్తున్నారని తెలిపారు.. ఆసియాలోనే అతి పెద్ద మిర్చి యార్డు రైతులకు కన్నీళ్లు మిగుల్చుతుంది… యార్డులో, మిర్చి రైతులు దగా పడుతున్నారు.. వరికి, పత్తికి రేటు లేక రైతులు విలవిలలాడి పోతున్నారు.. గతంలో తొమ్మిది వేలు పలికిన పత్తి ఇప్పుడు నాలుగు వేలకు కొనేవాడు లేడు.. గతంలో ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే రైతు దగ్గర ధాన్యాన్ని, కొనుగోలు చేశాం… రైతాంగానికి భరోసా ఇచ్చాం.. ఇప్పుడు మిర్చి పరిస్థితి ,మిర్చి రైతు పరిస్థితి దారుణంగా ఉందన్నారు..
Read Also: Thummala Nageswara Rao: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. పంటల రక్షణ కోసం కొత్త స్కీం..!
Also Read
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
ఇప్పుడు తేజ రకం మిర్చి రూ. 12 వేలు పలుకుతుంది.. వైసీపీ ప్రభుత్వంలో ఇదే రకం మిర్చి 23 వేల రూపాయలు పలికిందన్నారు అంబటి.. మిర్చి రైతుల కష్టం పై ప్రభుత్వం నుండి సుయ్ లేదు, సయ్ లేదు… అందుకే రైతులను ఓదార్చేందుకు, ఈ ప్రభుత్వానికి రైతుల సమస్యలు తెలిపేందుకు మాజీ సీఎం జగన్ వస్తున్నారు… రైతుల గోడు జగన్ విన్నాక , పరామర్శించిన తర్వాత ఈ ప్రభుత్వం కళ్లు తెరిపిస్తాం అన్నారు.. ఇప్పటి వరకు ప్రభుత్వానికి టైం ఇచ్చాం.. ఇకపై రైతుల పక్షాన పోరాడతాం.. రైతుల తరపున వకాల్తా పుచ్చుకుంటాం అన్నారు.. మరోవైపు, మిర్చి రైతుల పరామర్శకు ఎన్నికల కోడ్ కి సంబంధం లేదన్నారు అంబటి.. మేం పబ్లిక్ మీటింగ్ లు పెట్టడం లేదు.. రైతుల సమస్య మాత్రమే వింటాం.. రైతులకు అండగా ఉంటాం అన్నారు.. ఇక, చంద్రబాబు కి వయసు వచ్చింది కానీ సిగ్గు రాలేదు.. అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. సంపద ఎలా సృష్టించాలో చంద్రబాబు కి తెలియదట… జగన్ వస్తున్నారు అని తెలియగానే సీఎంలో కదలిక వచ్చినట్లు ఉంది.. అర్జంట్ గా , రైతుల సమస్య గుర్తుకు వచ్చింది.. సమీక్షలు పెడుతున్నారు.. జగన్ వచ్చి వెళ్లాక ఐయినా రైతులకు మంచి చేస్తే మంచిదే అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు..
తాజావార్తలు
-
Bank Holidays: జూలైలో బ్యాంక్లకు ఏకంగా 12 రోజులు హాలిడేస్.. ఏ ఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో క్లియర్గా తెలుసుకోండి!
-
Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
-
Stock market: 4 రోజులు.. రూ.88,000 కోట్ల ప్రాఫిట్! స్టాక్ మార్కెట్ను షేక్ చేసిన ఆరు టాప్ కంపెనీలు ఇవే..
-
Nitin Nabin : తెలంగాణలో త్వరలోనే ‘కమలం’ వికసిస్తుంది.. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు
-
Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!