Vasireddy Padma Resign to YSRCP: వైసీపీకి మరో షాక్.. పార్టీకి కీలక నేత గుడ్బై..?
- వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైన మరో కీలక నేత..
- నేడు వైసీపీకి రాజీనామా చేయనున్న వాసిరెడ్డి పద్మ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vasireddy Padma Resign to YSRCP: ఆంధ్రప్రదేశ్లో అధికారం చేజారిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి.. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు.. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు.. ఇలా పార్టీని వీడారు.. అంతేకాదు.. మరికొంతమంది చూపు.. టీడీపీ, జనసేన, బీజేపీ వైపు ఉందనే చర్చ సాగుతోంది.. అయితే, ఈ తరుణంలో మరో కీలక నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పేందుకు సిద్ధమయ్యారు.. వైసీపీకి ఇవాళ రాజీనామా చేయనున్నారు వాసిరెడ్డి పద్మ.. గత ఎన్నికల్లో జగ్గయ్యపేట సీటు ఆశించారు వాసిరెడ్డి పద్మ.. అయితే, ఇటీవల తన్నీరు నాగేశ్వరరావును జగ్గయ్యపేట ఇంఛార్జ్ గా నియమించింది వైసీపీ అధిష్టానం.. ఇక, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సీటు ఇచ్చే అవకాశం లేకపోవడంతో వాసిరెడ్డి పద్మ ఈ నిర్ణయానికి వచ్చారనే చర్చ సాగుతోంది..
Read Also: Cyclone Dana: దానా తుఫాన్ ప్రభావం.. ఏపీ సహా మరో మూడు రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
Also Read
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
కాగా, గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో.. మనస్థాపానికి గురైన వాసిరెడ్డి పద్మ.. ఏపీ మహిళ కమిషన్ ఛైర్పర్సన్ పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే.. పార్టీలో యాక్టివ్గా పనిచేసేందుకు తాను రాజీనామా చేశానని ప్రకటించిన ఆమె.. ఆ ఎపిసోడ్ తర్వాత వైసీపీలో ఉన్నప్పటికీ యాక్టివ్గా కనిపించడంలేదు. ఇక, ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా ఉన్న సమయంలోతో పాటు.. అంతకుముందు వైసీపీ తరపున తన గొంతును వినిపిస్తూ వచ్చిన వాసిరెడ్డి పద్మ.. ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కడా.. ఏ ఇష్యూపైనా పెద్దగా స్పందించింది లేదు.. ప్రస్తుతం ఏపీలో మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా.. ఇప్పుడు వైసీపీకి గుడ్బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చారట.. అయితే, తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రజారాజ్యం పార్టీలో ప్రారంభించిన వాసిరెడ్డి పద్మ.. ఆ పార్టీ అధికారప్రతినిధిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్లో ప్రజారాజ్యం విలీనం.. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడంతో.. వైసీపీలో చేరారు.. ఆ పార్టీలో అధికార ప్రతినిధిగా పనిచేశారు. ఇక, గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీ మహిళ కమిషన్ ఛైర్పర్సన్గా సేవలందించారు.. ఎన్నికల ముంగిట ఆ పదవికి రాజీనామా చేసిన ఆమె.. ఇప్పుడు పార్టీకి గుడ్బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.. మరి వాసిరెడ్డి పద్మ అడుగులు ఏ పార్టీ వైపు పడతాయో చూడాలి..
తాజావార్తలు
-
Hardik Pandya-CSK: సీఎస్కేలోకి హార్దిక్ పాండ్యా.. క్లారిటీ ఇచ్చిన చెన్నై సీఈఓ!
-
Best Crime Thriller Movies: కేతన్ అగర్వాల్ కేసును గుర్తు చేసే థ్రిల్లర్లు.. ఈ సినిమాల ట్విస్టులు చూస్తే షాక్ అవుతారు!
-
Jananayagan Censor : జననాయగన్ కు సెన్సార్ షాక్
-
WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
-
Daycare Abuse: మీకు మనసెలా వచ్చిందమ్మా.. టాయిలెట్ జెట్తో నీళ్లు చల్లి, వాషింగ్ మెషీన్లో బంధించి చిన్నారిపై చిత్రహింసలు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?