Mandakrishna Madiga: ఏపీలో ఎస్సీ వర్గీకరణ అమలు వేగవంతం చేయాలి..
- ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అమలు వేగవంతం చేయాలి- మందకృష్ణ మాదిగ
- నవంబర్ మొదటి వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుంది అని మంత్రి లోకేష్ చెప్పారు
- ఎస్సీ వర్గీకరణ ప్రారంభం అయ్యేవరకు ఎటువంటి జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వకూడదు- మందకృష్ణ మాదిగ.
ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అమలు వేగవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నవంబర్ మొదటి వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుంది అని మంత్రి లోకేష్ చెప్పారు.. ఎస్సీ వర్గీకరణ ప్రారంభం అయ్యేవరకు ఎటువంటి జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వకూడదని అన్నారు. తమ విజ్ఞప్తికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. షెడ్యూల్ కులాల వర్గీకరణ ఆగష్టు 1న సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చింది.. ఎస్సీ వర్గీకరణ చట్టం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు చంద్రబాబు నాయుడు తీసుకు వచ్చారని మందకృష్ణ పేర్కొన్నారు.
Read Also: Double Ismart: టీవీలోకి డబుల్ ఇస్మార్ట్.. ఎప్పుడు? ఎక్కడ చూడాలంటే?
Also Read
- SRM University Harassment Case: ఎస్ఆర్ఎం వర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం.. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిర్యాదుతో..
- Ambati Rambabu Hunger Strike: నిరాహార దీక్ష చేపట్టిన అంబటి.. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి తేలుస్తా..!
- Ambati Rambabu: పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు.. న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా..
- Divyang Shakti Scheme: దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. వారికోసం మరింత ఆలోచన చేస్తాం..
2006లో ఎస్సీ వర్గీకరణ చట్టం తెచ్చింది పంజాబ్లోనని మందకృష్ణ మాదిగ అన్నారు. 2009లో తమిళనాడు ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా చట్టం తెచ్చారు.. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టులో లాయర్ను నియమించలేదన్నారు. రాష్ట్రంలో ఇంత వరకు ఎస్సీ వర్గీకరణ ప్రారంభం కాలేదు.. మిగతా రెండు రాష్ట్రాల్లో అమలులో ఉందని చెప్పారు. మరో మూడు రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణకు ముందుకు వచ్చాయని అన్నారు. వర్గీకరణ లేని రాష్ట్రల్లో హర్యానా, మహారాష్ట్ర, తెలంగాణలో కూడా ఎస్సీ వర్గీకరణ ముందుకు సాగుతుందని తెలిపారు.
Read Also: Vizag Honey Trap Case: హనీట్రాప్ కేసు.. కీలక ఆధారాలు స్వాధీనం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు అయ్యే వరకు ఎటువంటి నోటిఫికేషన్లు ఇవ్వమని తెలిపిందని మందకృష్ణ మాదిగ అన్నారు. జగన్ ప్రభుత్వం అప్పట్లో ఎస్సీ వర్గీకరణ జరగకముందే నోటిఫికేషన్లు ఇచ్చారు.. గత జగన్ పాలనలో ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్లో కూడా ఎస్సీ వర్గీకరణ వర్తింప చేయాలని కోరారు. ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడానికి మాదిగలు శక్తి వంచన లేకుండా పని చేసారని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
-
OnePlus Realme Merger: విలీనం కానున్న వన్ప్లస్, రియల్మీ..!?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!