Ram Gopal Varma: సీఐడీ విచారణకు వర్మ డుమ్మా.. ఆర్జీవీ తరఫు న్యాయవాది కీలక వ్యాఖ్యలు..
- గుంటూరులో సీఐడీ విచారణకు వర్మ డుమ్మా..
- సీఐడీ పోలీసులకు సమాచారం ఇచ్చిన వర్మ తరఫు లాయర్..
- గుంటూరులో సీఐడీ కార్యాలయానికి వెళ్లిన వర్మ న్యాయవాది..
- విచారణకు 8 వారాల సమయం కోరిన వర్మ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Gopal Varma: గుంటూరులో సీఐడీ పోలీసులు ఇచ్చిన నోటీసుల ప్రకారం.. సినీ దర్శకుడు రాం గోపాల్ వర్మ ఈ రోజు విచారణకు హాజరుకావాల్సి ఉంది.. అయితే, సారీ మూవీ ప్రమోషన్ లో ఉన్న కారణంగా హాజరు కాలేను అని.. ఈ నెల 28న సినిమా రిలీజ్ ఉండటంతో బిజీగా ఉన్నానని.. 8 వారాల సమయం కావాలని.. ఆ 8 వారాల తర్వాత డేట్ ఇస్తే విచారణకు హాజరు అవుతామని సీఐడీకి సమాచారం ఇచ్చారు ఆర్జీవీ.. తనకు నోటీసులు అందజేసిన.. సీఐడీ ఇన్స్పెక్టర్ తిరుమల రావుకి వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చారు.. సీఐడీ చీఫ్ రవి శంకర్ కు వాట్సాప్ ద్వారా సమాచారం అందించారు వర్మ.. అయితే, సీఐడీ విచారణకు ఆర్జీవీ హాజరుకాలేకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన తరఫు న్యాయవాది నాని బాబు..
Read Also: BoycottLaila: ‘లైలా’కి బాయ్ కాట్ టెన్షన్.. కొంప ముంచిన పృథ్వి!
Also Read
- Ambati Rambabu: పోలీసులను రాజకీయ కక్షకు వాడుతున్నారు.. అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
అనారోగ్య కారణాలతో.. గుంటూరులో సీఐడీ విచారణకు వర్మ హాజరు కాలేరని ఆయన తరపు న్యాయవాది నాని బాబు.. సీఐడీ పోలీసులకు సమాచారం ఇచ్చారు.. నేడు గుంటూరులో సీఐడీ కార్యాలయానికి వెళ్లిన వర్మ తరపు అడ్వకేట్.. సీఐడీ విచారణకు రావడానికి రామ్ గోపాల్ వర్మ కు 8 వారాల సమయం కావాలని కోరారు.. అనారోగ్య కారణాలతో ఆయన విచారణకు హాజరు కాలే పోతున్నారని, వర్మ తరపు న్యాయవాది పోలీసులకు సమాచారం ఇచ్చారు.. సామాజిక మధ్యమాలలో పెట్టిన పోస్టుల కారణంగా వర్మ మీద కేసు నమోదు అయిందని, ఈ నేపథ్యంలో గుంటూరు సీఐడీ కార్యాలయానికి రావాలని సీఐడీ పోలీసులు వర్మకి నోటీసులు ఇచ్చారని ఆయన తరపు న్యాయవాది అంటున్నారు. 8 వారాల సమయం కోరాం, పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి అంటూన్నారు వర్మ తరుపున న్యాయవాది..
Read Also: Gold Rate Today: మగువలకు భారీ షాక్.. రూ.87 వేలు దాటిన బంగారం ధర!
కాగా, ఈ మధ్యే ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో ఆర్జీవీని దాదాపు 9 గంటల పాటు ప్రశ్నించారు పోలీసులు.. అయితే, ఇదే సమయంలో.. మరో కేసులో ఏపీ సీఐడీ పోలీసుల నుంచి నోటీసులు అందుకోవాల్సి వచ్చింది వర్మ.. డైరెక్టర్ రాంగోపాల్ వర్మకి నోటీసు జారీ చేశారు గుంటూరు సీఐడీ సీఐ తిరుమలరావు. ఈ నెల 10వ తేదీన గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకి హాజరు కావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.. 2019లో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా తీశారు ఆర్జీవీ.. అయితే, తమ మనో భావాలు దెబ్బ తీసేవిధంగా సినిమా తీశాడంటూ గత ఏడాది నవంబర్ 29వ తేదీన సీఐడీ కార్యాలయంలో ఫిర్యాదు చేవారు తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ.. దీంతో.. ఈ నెల 9వ తేదీన ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో వర్మకి సీఐడీ సీఐ తిరుమలరావు నోటీసులు ఇచ్చిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!