CM Chandrababu: సీబీఎన్ సీఎంగా ఉన్నంతవరకూ అరాచకవాదులకు స్థానం లేదు..
- సీబీఎన్ సీఎంగా ఉన్నంతవరకూ అరాచకవాదులకు స్థానం లేదు..
- రౌడీమూలకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్..
CM Chandrababu: చంద్రబాబు సీఎంగా ఉన్నంతవరకూ అరాచకవాదులకు రాష్ట్రంలో స్థానం లేదని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. గుంటూరులోని ఆర్వీఆర్ జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీసు ఏఐ హ్యాకథాన్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టెక్నాలజీని పోలీసులు ఏ విధంగా ఉపయోగించుకోవాలనేదానిపై ఏఐ హ్యాక్ థాన్ కార్యక్రమం ఏర్పాటు చెయ్యడం అభినందనీయం అన్నారు.. లా అండ్ ఆర్డర్ పై ఎప్పుడూ దృష్టిపెడతాను. చంద్రబాబు సీఎంగా ఉన్నంతవరకూ అరాచకవాదులకు రాష్ట్రంలో స్థానం లేదని స్పష్టం చేశారు.. టెక్నాలజీని అందరూ ఉపయోగించుకోవాలని సూచించిన ఆయన.. అప్పట్లో బిల్ క్లింటన్, వాజ్ పేయి హయాంలో సైబర్ సిటీ, హైటెక్ సిటీ ప్రారంభించాం. 25 ఏళ్లలో ఐటీవల్ల ఎక్కువ ఆదాయం హైదరాబాద్కు వస్తుందని తెలిపారు.. క్వాంటం వ్యాలీకింద ఏఐకి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా తెలుగువారి సత్తా ప్రపంచానికి చాటిచెప్పబోతున్నాం. మీ పిల్లలను బాగా చదివించండి… మీరు పెట్టిన ఖర్చుకు అనేకరెట్లు సంపాదిస్తారు. ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా తెలుగువారు ఉంటారని తెలిపారు.
Read Also: Jagannath Rath Yatra 2025: జగన్నాథ రథ యాత్రలో బంగారు చీపురుతో ఎందుకు శుభ్రం చేస్తారు..?
Also Read
- Ambati Rambabu Hunger Strike: నిరాహార దీక్ష చేపట్టిన అంబటి.. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి తేలుస్తా..!
- Ambati Rambabu: పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు.. న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా..
- Divyang Shakti Scheme: దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. వారికోసం మరింత ఆలోచన చేస్తాం..
- Vegetable Market: మరోసారి తెరపైకి కూరగాయల హోల్ సేల్ మార్కెట్ వివాదం
ప్రపంచంలో హయ్యస్ట్ పర్ కాపిటా సంపాదించేవారిలో 35శాతం తెలుగువారు ఉన్నారు.. రేపు ఏదైనా విపత్తు వస్తే నేరుగా వారికి డ్రోన్ ద్వారా సాయం అందించే పరిస్థితి వస్తుంది. వాట్సప్ గవర్నెన్స్ అందరూ ఉపయోగించుకోండి అని సూచించారు సీఎం చంద్రాబు.. .విద్యార్థులు సర్డిఫికెట్లకోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఆగష్టు15 నుంచి వాట్సప్ గవర్నెన్స్ ద్వారా మీకు అందుతాయి. మేధోశక్తితో పనిచెయ్యాలి. హార్డ్ వర్క్ కాదు… స్మార్ట్ వర్క్ చెయ్యాలి. డేటా క్లౌడ్ లో ఉంటుంది. స్పేస్ సిటీకింద ప్రైవేట్ సంస్థలు కూడా శాటిలైట్ ప్రయోగించే అవకాశాలు కల్పిస్తాం. రౌడీయిజం చేసేవారిని చొక్కా పట్డుకునే పరిస్థితి తీసుకొస్తా. ఏం జరిగినా నేరుగా మీ ఇంటికి నోటీసులు వస్తాయి. దేశంలో మొదటిసారిగా క్వాంటం వ్యాలీకి శ్రీకారం చుట్టామని వెల్లడించారు..
Read Also: YS Jagan: వైఎస్ జగన్కు ఊరట.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
ప్రపంచానికి భారతదేశమే ఏఐకి నాయకత్వం ఇస్తుంది. థింక్ గ్లోబల్లీ… యాక్ట్ గ్లోబల్లీ అని సూచించారు సీఎం చంద్రబాబు.. ఐటీ మన జీవితంలో భాగమైపోయింది.. సెల్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచంలో ఎక్కడికైనా పోవచ్చు.. తెలుగువారు నెంబర్వన్ గా ఉండాలనేది నా ఆకాంక్ష.. ర్యాపిడో వ్యవస్థాపకుడు ఈ జిల్లాకు చెందిన వ్యక్తి.. ఐదారేళ్లో బిలియన్ డాలర్ల కంపెనీగా మారింది. ఇన్నోవేటివ్ గా ఆలోచించాలని సూచించారు సీఎం చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
Tamil Nadu Election: 9 గంటలకే తమిళనాడులో భారీ పోలింగ్.. కారణమిదేనా?
-
8-Week OTT: ఓటీటీ రిలీజ్ గ్యాప్పై సౌత్ నిర్మాతల సంచలన నిర్ణయం..
-
Tamilanadu Elections Special : తమిళనాడు ఎన్నికలో ఎవరి బలం ఎంత.. అధికారం ఎవరిది.. గ్రౌండ్ రిపోర్ట్
-
Mohsin Khan: “మెయిడెన్ ఓవర్.. ఆపై వికెట్”.. వైభవ్ జోరుకు బ్రేక్ వేసిన లక్నో పేసర్.. మునుపెన్నడూ జరగలే!
-
Raaka: అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి దీపికా అవుట్.. క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..!
ట్రెండింగ్
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?