Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Ap High Court Grants Interim Relief To Ys Jagan In Rentapalla Death Case Questions Basis Of Fir

YS Jagan: వైఎస్‌ జగన్‌కు ఊరట.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

Published Date :June 27, 2025 , 5:40 pm
By Sudhakar Ravula
  • ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో వైఎస్ జగన్ కు ఊరట..
  • గుంటూరు జిల్లా జగన్ పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి మృతి..
  • కేసు నమోదుపై హైకోర్టులో జగన్ క్వాష్ పిటిషన్..
  • ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు..
  • తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా..
YS Jagan: వైఎస్‌ జగన్‌కు ఊరట.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కు ఊరట లభించింది. గుంటూరు జిల్లా జగన్ పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందటంతో నమోదైన కేసులో జగన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ జరిపిన న్యాయస్థానం ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇక, తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్ సహా వైసీపీ నేతలు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ లు మీద ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. జగన్ ఈ కేసులో ఏ2గా ఉన్నారు. జగన్ తో పాటు కారులో ప్రయాణించిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి జగన్ పీఏ, మాజీ మంత్రి పేర్ని నాని, విడదల రజినిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఐదుగురు కూడా క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషనర్లపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని వచ్చే మంగళవారానికి తదుపరి విచారణ వాయిదా వేసింది.

Read Also: Viral Video: ఇది కాకి కాదు మేధావి.. ఈ వీడియో చూశాక దీని తెలివితేటలకు సలాం కొట్టాల్సిందే..!

Also Read

  • YS Jagan: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ మద్దతు తగ్గుతోంది.. జగన్‌ ఆవేదన..
  • CM Chandrababu: నేను దక్షిణాది రాష్ట్రాల వైపే మాట్లాడుతున్నా.. అందుకే ప్రధాని మోడీకి పూర్తి మద్దతు..
  • AP Ministers Singapore Tour: సింగపూర్ చేరుకున్న ఏపీ మంత్రుల బృందం.. 7 రోజుల టూర్..
  • Andhra Pradesh: వ్యవసాయ విద్యుత్ సరఫరా వ్యవస్థలో కీలక మార్పులు.. కొత్త కార్పొరేషన్‌ ఏర్పాటు..

ఇక, పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కారు ప్రమాదం జరిగితే కారు డ్రైవర్ కాకుండా ప్రయాణికులకు ఏం సంబంధం అని హైకోర్టు ప్రశ్నించింది. పర్మిషన్ సందర్భంగా కొన్ని కండిషన్స్ పాటించాలని చెప్పినా.. జగన్ పాటించలేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. చాలా జాగ్రత్తలు తీసుకున్నా కుంభ మేళాలో ప్రమాదం జరిగింది కదా? అని న్యాయస్థానం పేర్కొంది. ప్రమాదానికి ప్రయాణికులు ఎలా బాధ్యత వహిస్తారనీ న్యాయస్థానం వ్యాఖ్యానించింది. సింగయ్య మృతి కేసులో జగన్ పర్యటనకు ఇచ్చిన పర్మిషన్ నిబంధనలకు ఉల్లంఘించినట్టు కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. విచారణలో పోలీసులు సేకరించిన ఆధారాలు కోర్టుకు అందజేయానికి సమయం కావాలని ప్రభుత్వం కోరింది. సింగయ్య ప్రమాదానికి గురైన సమయంలో అంబులెన్స్ కి, పోలీసులకు సమాచారం ఇవ్వలేదని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది.

Read Also: Kolkata: గ్యాంగ్ రేప్‌ కేసులో సంచలన విషయాలు.. విద్యార్థిని 7 గంటలకు కాలేజీకి ఎందుకు వచ్చింది..?

ఘటన జరిగినపుడు ఒక కారుగా చెప్పిన పోలీసులు తర్వాత ఎస్పీ వచ్చిన తర్వాత జగన్ ప్రయాణిస్తున్న కారు అని చెప్పి సెక్షన్లు మార్చినట్టు కోర్టుకు జగన్ న్యాయవాదులు తెలిపారు. కేవలం రాజకీయ కక్ష సాధింపుతో ఈ కేసు నమోదు చేశారనీ జగన్ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. జగన్ కు సరైన బందోబస్తు ఇవ్వటం లేదని ఈ అంశంపై దాఖలైన 2 పిటిషన్లు హైకోర్టులో విచారణ దశలో ఉన్నాయని జగన్ న్యాయవాదులు కోర్టుకు చెప్పారు. జగన్ పర్యటనలో 3 కార్లు, 100 మందికి అనుమతి ఇస్తే వందల కార్లు, వేలమందితో పర్యటన జరిపారని ప్రభుత్వం కోర్టు దృష్టికి తెచ్చింది. జగన్ పర్యటనలో ముగ్గురు చనిపోయారని కానీ సింగయ్య మృతిపై మాత్రమే తాము కేసు నమోదు చేశామని కక్ష సాధింపు అయితే ముగ్గురు మృతికి సంబంధించి కేసు నమోదు చేసే వాళ్ళమని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP High Court
  • FIR
  • Interim Relief
  • Rentapalla Death Case

తాజావార్తలు

  • Talasani Srinivas Yadav: మీరు ధైర్యంగా పోరాటం చేయండి.. మీ వెనుక కేసీఆర్ ఉన్నారు..

  • Bengal Election: బెంగాల్‌లోనూ భారీ పోలింగ్.. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటర్లు

  • Vijay Varma: తమన్నా చాప్టర్ క్లోజ్.. ఆలియా తో విజయ్ వర్మ డేటింగ్?

  • Gujarat: సూరత్‌లో ప్రముఖ పారిశ్రామికవేత్త కోడలు ఆత్మహత్య.. 2 నెలల క్రితమే పెళ్లి

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

ట్రెండింగ్‌

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions