Jagannath Rath Yatra 2025: జగన్నాథ రథ యాత్రలో బంగారు చీపురుతో ఎందుకు శుభ్రం చేస్తారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథ రథయాత్ర ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్ల పక్ష రెండవ రోజున ప్రారంభమవుతుంది. ఈ యాత్ర ఈరోజు అంటే జూన్ 27న ప్రారంభమవుతుంది. ఈ మహా యాత్ర జూలై 8 వరకు కొనసాగుతుంది. 12 రోజుల పాటు జరిగే ఈ యాత్రలో జగన్నాథుడు, అతని సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర పూరి ఆలయం నుంచి గుండిచా ఆలయానికి వారి వారి రథాలపై ఊరేగుతారు. ఈ మహా యాత్ర సందర్భంగా.. జగన్నాథ ఆలయంలో ‘ఛేరా పహారా’ అనే ప్రత్యేకమైన సంప్రదాయం నిర్వహిస్తారు. ఈ సంప్రదాయంలో భాగంగా యాత్ర ప్రారంభమయ్యే ముందు, ఆ మార్గాన్ని బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు. అసలు బంగారు చీపురుతో ఎందుకు శుభ్రం చేస్తారు? అనే సందేహం అందరికీ వచ్చే ఉంటుంది. ఈ సంప్రదాయం వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకుందాం.
READ MORE: Maargan Review: మార్గన్ రివ్యూ
Also Read
- Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని డబ్బు!
- Chanakya Niti: బంధువులైనా సరే.. ఈ విషయాలు మాత్రం చెప్పొద్దంటున్న చాణక్యుడు! ఇంతకీ ఏ విషయాలో తెలుసా?
- Brahma Muhurat: "బ్రహ్మ ముహూర్తం"లో రామాయణ ట్రైలర్.. ఈ ముహూర్తం విశిష్టత ఏమిటి.?
- Horoscope : ఆగస్టులో కన్యారాశిలో శుక్రుడి సంచారం.. ఈ 6 రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే.!
పూరి జగన్నాథ ఆలయంలో నిర్వహించే ఈ ప్రత్యేకమైన ‘ఛెరా పహారా’ ఆచారం వెనుక బలమైన విశ్వాసం ఉంది. రాజుల వారసులు మాత్రమే ఈ ప్రత్యేక ఆచారంలో పాల్గొంటారు. పౌరాణిక నమ్మకం ప్రకారం.. బంగారాన్ని విలువైన, అత్యంత పవిత్రమైన లోహంగా పరిగణిస్తారు. రథం వెళ్లే మార్గాన్ని శుభ్రం చేయడానికి బంగారంతో చేసిన చీపురును ఉపయోగించడం శుభానికి చిహ్నంగా పరిగణిస్తారు. రథయాత్ర ప్రారంభమయ్యే ముందు, మూడు రథాల మార్గాన్ని బంగారు చీపురుతో శుభ్రం చేసి, వేద మంత్రాలు జపిస్తారు. భగవంతుడిని స్వాగతించడానికి సన్నాహానికి చిహ్నంగా భావిస్తారు. అంటే భగవంతుడిని ఆహ్వానిస్తారన్న మాట. అలాగే.. రథయాత్ర విజయవంతంగా సాగాలని కోరుకునే సంకేతంగా భావిస్తారు.
READ MORE: Asus Chromebook CX14: ఆసుస్ కొత్త ల్యాప్టాప్ విడుదల.. స్మార్ట్ ఫోన్ ధరకన్న తక్కువకే!
మతపరమైన ప్రాముఖ్యత..
బంగారు చీపురుతో శుభ్రం చేయడానికి మతపరమైన కారణం ఏమిటంటే.. బంగారాన్ని శుభం, స్వచ్ఛతకు చిహ్నంగా భావిస్తారు. ఆలయ మార్గాన్ని శుభ్రం చేయడానికి దీనిని ఉపయోగించడం దేవుని పట్ల గౌరవం, భక్తికి చిహ్నంగా భావిస్తారు. ఈ ఆచారం భక్తుల భక్తి, అంకితభావాన్ని వ్యక్తపరుస్తుంది. బంగారు చీపురుతో శుభ్రం చేసుకోవడం వల్ల ఆ ప్రాంతంలో సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుందని నమ్మిక. బంగారం అదృష్టం, శ్రేయస్సుకు చిహ్నం, కాబట్టి ఇలా చేయడం వల్ల యాత్రలో స్వచ్ఛత, సానుకూలత కొనసాగుతుందని భావిస్తారు. ఇది మతపరంగా మాత్రమే కాకుండా సాంస్కృతిక దృక్కోణం నుండి కూడా చాలా ముఖ్యమైనది.
తాజావార్తలు
-
Moto Pad 70 Groove: 10,200mAh బ్యాటరీ, 9 JBL స్పీకర్లతో మోటరోలా కొత్త ట్యాబ్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
The Hundred: వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు.! అయినా హ్యాట్రిక్ కాదు.. ఎందుకంటే.?
-
Rega Kantha Rao: “కేసు కొట్టేయండి”.. హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు..
-
August 2026 Horoscope: ఆగస్టులో ఈ 4 రాశులకు ఆర్థికంగా కలిసొచ్చే అవకాశం.. ఆకస్మిక ధనలాభాలు?
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!
-
200MP కెమెరా, 9,000mAh బ్యాటరీతో ఆగస్టు 11న ఎంట్రీ ఇవ్వనున్న Redmi K100 Pro Max.!
-
505Km రేంజ్, AI క్యాబిన్, 25 స్పీకర్లతో ఫ్యామిలీల కోసం Xiaomi SkyNomad Series ఎలక్ట్రిక్ SUVలు లాంచ్..!