Ambati Rambabu: సహన తల్లిదండ్రులకు జగన్ భరోసా.. రూ.10 లక్షల చెక్కు అందించిన అంబటి..
- గుంటూరు జిల్లా తెనాలిలో సహన కుటుంబ సభ్యులకు పరామర్శ..
- గతంలో రూ10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన వైఎస్ జగన్..
- ఆ కుటుంబానికి చెక్క్ ను అందజేసిన అంబటి రాంబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: గుంటూరు జిల్లా తెనాలిలో రౌడీషీటర్ నవీన్ దాడితో బ్రెయిన్డెడ్ కు గురై చికిత్స పొందుతూ మృతి చెందిన మధిర సహన కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆ కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంగా ప్రకటించిన రూ.10 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును ఈ రోజు.. ఆ కుటుంబానికి అందజేశారు గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై హత్యలు, అత్యాచారాలు దారుణంగా పెరిగిపోయాయని విమర్శించారు.. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు అన్యాయం జరిగిందని గొంతు చించుకున్న మహానుభావులు ఒక్కరు కూడా ఇప్పుడు ఎందుకు స్పందించరని ఆయన ప్రశ్నించారు.
Read Also: CM Chandrababu: రోడ్ల మరమ్మతులకు సీఎం శ్రీకారం.. జనవరి కల్లా రోడ్లపై గుంతలన్నీ పూడ్చేయాలి..
Also Read
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
- SRM University Harassment Case: ఎస్ఆర్ఎం వర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం.. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిర్యాదుతో..
- Ambati Rambabu Hunger Strike: నిరాహార దీక్ష చేపట్టిన అంబటి.. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి తేలుస్తా..!
గుంటూరు జిల్లా తెనాలిలో రౌడీషీటర్ నవీన్ దాడి చేయడంతో బ్రెయిన్డెడ్ కు గురై చికిత్స పొందుతూ మృతి చెందిన మధిర సహన కుటుంబ సభ్యులను అంబటి రాంబాబు పరామర్శించారు. ఐతానగర్లోని సహన నివాసం వద్దకు వెళ్లిన అంబటి రాంబాబు.. మృతురాలి తల్లిదండ్రులను పరామర్శించి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన 10 లక్షల రూపాలయ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ, సహన తల్లిదండ్రులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా కల్పించారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు 10 లక్షల రూపాయలు తల్లిదండ్రులకు అందిస్తున్నామని చెప్పారు. ఇది చాలా దారుణమైన సంఘటన అని.. దళిత మహిళని అత్యంత దారుణంగా హత్య చేశారని పేర్కొన్నారు. సహనకు ఆసుపత్రిలో సకాలంలో వైద్యం అందించటంలో కూడా విఫలం అయ్యారని విమర్శించారు. తన బిడ్డ సహన మృతికి ముగ్గురు కారణం అని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారని.. అయితే ఒక్కరే సరండర్ అయ్యారని మిగతా ఇద్దరిని అధికార పార్టీ నేతలు కాపాడుతున్నారని తమకు సమాచారం అందుతుందని ఆరోపించారు అంబటి రాంబాబు..
తాజావార్తలు
-
CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!