Ambati Rambabu: సహన తల్లిదండ్రులకు జగన్ భరోసా.. రూ.10 లక్షల చెక్కు అందించిన అంబటి..
- గుంటూరు జిల్లా తెనాలిలో సహన కుటుంబ సభ్యులకు పరామర్శ..
- గతంలో రూ10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన వైఎస్ జగన్..
- ఆ కుటుంబానికి చెక్క్ ను అందజేసిన అంబటి రాంబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: గుంటూరు జిల్లా తెనాలిలో రౌడీషీటర్ నవీన్ దాడితో బ్రెయిన్డెడ్ కు గురై చికిత్స పొందుతూ మృతి చెందిన మధిర సహన కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆ కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంగా ప్రకటించిన రూ.10 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును ఈ రోజు.. ఆ కుటుంబానికి అందజేశారు గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై హత్యలు, అత్యాచారాలు దారుణంగా పెరిగిపోయాయని విమర్శించారు.. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు అన్యాయం జరిగిందని గొంతు చించుకున్న మహానుభావులు ఒక్కరు కూడా ఇప్పుడు ఎందుకు స్పందించరని ఆయన ప్రశ్నించారు.
Read Also: CM Chandrababu: రోడ్ల మరమ్మతులకు సీఎం శ్రీకారం.. జనవరి కల్లా రోడ్లపై గుంతలన్నీ పూడ్చేయాలి..
Also Read
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Ambati Rambabu: ఏఐ వీడియో వివాదంలో అంబటి రాంబాబు.. కేసు నమోదు..
- Mudragada Padmanabham సంతాప సభలో ఆసక్తికర దృశ్యం.. ఆలింగనం చేసుకున్న బోండా ఉమ, అంబటి రాంబాబు.!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
గుంటూరు జిల్లా తెనాలిలో రౌడీషీటర్ నవీన్ దాడి చేయడంతో బ్రెయిన్డెడ్ కు గురై చికిత్స పొందుతూ మృతి చెందిన మధిర సహన కుటుంబ సభ్యులను అంబటి రాంబాబు పరామర్శించారు. ఐతానగర్లోని సహన నివాసం వద్దకు వెళ్లిన అంబటి రాంబాబు.. మృతురాలి తల్లిదండ్రులను పరామర్శించి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన 10 లక్షల రూపాలయ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ, సహన తల్లిదండ్రులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా కల్పించారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు 10 లక్షల రూపాయలు తల్లిదండ్రులకు అందిస్తున్నామని చెప్పారు. ఇది చాలా దారుణమైన సంఘటన అని.. దళిత మహిళని అత్యంత దారుణంగా హత్య చేశారని పేర్కొన్నారు. సహనకు ఆసుపత్రిలో సకాలంలో వైద్యం అందించటంలో కూడా విఫలం అయ్యారని విమర్శించారు. తన బిడ్డ సహన మృతికి ముగ్గురు కారణం అని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారని.. అయితే ఒక్కరే సరండర్ అయ్యారని మిగతా ఇద్దరిని అధికార పార్టీ నేతలు కాపాడుతున్నారని తమకు సమాచారం అందుతుందని ఆరోపించారు అంబటి రాంబాబు..
తాజావార్తలు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!