Ambati Rambabu: సహన తల్లిదండ్రులకు జగన్ భరోసా.. రూ.10 లక్షల చెక్కు అందించిన అంబటి..
- గుంటూరు జిల్లా తెనాలిలో సహన కుటుంబ సభ్యులకు పరామర్శ..
- గతంలో రూ10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన వైఎస్ జగన్..
- ఆ కుటుంబానికి చెక్క్ ను అందజేసిన అంబటి రాంబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: గుంటూరు జిల్లా తెనాలిలో రౌడీషీటర్ నవీన్ దాడితో బ్రెయిన్డెడ్ కు గురై చికిత్స పొందుతూ మృతి చెందిన మధిర సహన కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆ కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంగా ప్రకటించిన రూ.10 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును ఈ రోజు.. ఆ కుటుంబానికి అందజేశారు గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై హత్యలు, అత్యాచారాలు దారుణంగా పెరిగిపోయాయని విమర్శించారు.. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు అన్యాయం జరిగిందని గొంతు చించుకున్న మహానుభావులు ఒక్కరు కూడా ఇప్పుడు ఎందుకు స్పందించరని ఆయన ప్రశ్నించారు.
Read Also: CM Chandrababu: రోడ్ల మరమ్మతులకు సీఎం శ్రీకారం.. జనవరి కల్లా రోడ్లపై గుంతలన్నీ పూడ్చేయాలి..
Also Read
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
గుంటూరు జిల్లా తెనాలిలో రౌడీషీటర్ నవీన్ దాడి చేయడంతో బ్రెయిన్డెడ్ కు గురై చికిత్స పొందుతూ మృతి చెందిన మధిర సహన కుటుంబ సభ్యులను అంబటి రాంబాబు పరామర్శించారు. ఐతానగర్లోని సహన నివాసం వద్దకు వెళ్లిన అంబటి రాంబాబు.. మృతురాలి తల్లిదండ్రులను పరామర్శించి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన 10 లక్షల రూపాలయ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ, సహన తల్లిదండ్రులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా కల్పించారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు 10 లక్షల రూపాయలు తల్లిదండ్రులకు అందిస్తున్నామని చెప్పారు. ఇది చాలా దారుణమైన సంఘటన అని.. దళిత మహిళని అత్యంత దారుణంగా హత్య చేశారని పేర్కొన్నారు. సహనకు ఆసుపత్రిలో సకాలంలో వైద్యం అందించటంలో కూడా విఫలం అయ్యారని విమర్శించారు. తన బిడ్డ సహన మృతికి ముగ్గురు కారణం అని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారని.. అయితే ఒక్కరే సరండర్ అయ్యారని మిగతా ఇద్దరిని అధికార పార్టీ నేతలు కాపాడుతున్నారని తమకు సమాచారం అందుతుందని ఆరోపించారు అంబటి రాంబాబు..
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!