CM Chandrababu: రోడ్ల మరమ్మతులకు సీఎం శ్రీకారం.. జనవరి కల్లా రోడ్లపై గుంతలన్నీ పూడ్చేయాలి..
- ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరమ్మతులకు శ్రీకారం చుట్టిన సీఎం..
- అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెం పరవాడ జంక్షన్ లో కార్యక్రమం..
- రాబోయే రోజుల్లో రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు ఏర్పాటు కావాలి..
- జనవరి కల్లా రోడ్లపై గుంతలన్నీ పూడ్చేయాలని ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరమ్మతులకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెం గ్రామం పరవాడ జంక్షన్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు ఏర్పాటు కావాలి.. 5 ఏళ్లు గుంతలు తవ్వాడు.. రాష్ట్రానికి ప్రమాదమైన గోతులు తవ్వాడు.. నరకానికి కేరాఫ్ అడ్రస్ గా రాష్ట్ర రోడ్లు మార్చారు అని దుయ్యబట్టారు.. వెయ్యి కోట్లు మాత్రమే ఈ 5 ఏళ్లలో ఖర్చు పెట్టాడు అంటే పరాకాష్ట.. రోడ్ల మీద డెలివరీలు అయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.. రోడ్లు బాగుంటే పరిశ్రమలు వస్తాయి.. ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.. గుంతలు పడ్డ రోడ్లు ప్రయాణం ప్రాణాలతో చెలగాటం.. రోడ్డు ప్రమాదాలతో నిత్యం సమస్యలే.. రోడ్లు బాగుంటే రైతు పండించే పంటకు గిట్టుబాటు వస్తుంది, దళారులు దోచుకొకుండా ఉండి వ్యాపారాలు బాగుంటాయి .. జనవరి కల్లా రోడ్లు గుంతలు పూడ్చి వేయాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు సీఎం చంద్రబాబు..
Read Also: CM Revanth Reddy: మీ ప్రకటనలో అపోహలు.. అవాస్తవాలు.. ప్రధాని మోడీ కి సీఎం రేవంత్ ట్వీట్..
Also Read
గుంతలు రోడ్లో చేపలు పట్టుకునేలా చేశారు అని సెటైర్లు వేశారు చంద్రబాబు.. రౌడీ రాజకీయాలు వద్దు అభివృద్ధి కావాలి.. బురద లేని రోడ్లు వేసే బాధ్యత మాది, మళ్ళీ ఆ రాక్షసుడిని రానివ్వకుండా చేసే బాధ్యత మీది.. రోడ్లు బాగోలేక RTC బస్సులను కూడా రద్దు చేసిన పరిస్థితి వచ్చింది.. మళ్ళీ మంచి రోజులు వచ్చాయి.. ఈ గ్రామం నుండి మొదలు.. ఈ రోజు విజయనగరంలో ప్రోగ్రామ్ ఉంది కానీ ఇక్కడకి వచ్చాను.. వచ్చినపుడు పరదాలు కట్టుకొచ్చానా, చెట్లు నరికించానా.. ప్రజలు గెలవాలంటే NDA ను గెలిపించాలని అడిగాను.. 90% మెజారిటీతో గెలిపించారు.. రాష్ట్రానికి ఎప్పుడు అయితే పన్నులు వస్తాయో అభివృద్ధికి ఖర్చు పెట్టడానికి తొడ్పడతాయి అన్నారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసేసాడు.. గత పాలకుల చేష్టలకు సమర్థవంతమైన అధికారులు నిర్వీర్యం అయిపోయారు.. గాడి తప్పిన అన్ని వ్యవస్థలను మళ్ళీ తిరిగి గాడిలో పెట్టడమే మా లక్ష్యం అన్నారు సీఎం.. 5 ఏళ్లలో అన్ని రోడ్లు ఎలా అభివృద్ధి చేయాలో స్పష్టమైన అవగాహనతో మీ ముందుకు వస్తాం.. 76 వేల కోట్ల రూపాయలు తో నేషనల్ హై వే పనులు అవుతున్నాయి.. రెండున్నారేళ్లులోనే పూర్తి చేయాలని ఆదేశించాం అన్నారు.
తాజావార్తలు
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
-
Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
-
Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
-
Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
-
Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..