Gudivada Amarnath: కేంద్రంతో కాకపోతే పుతిన్తో చెప్పుకో.. పవన్కి మంత్రి అమర్నాథ్ సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath Sensational Comments On Pawan Kalyan: జనసేనాధిపతి పవన్ కళ్యాణ్పై మంత్రి అమర్నాథ్ మరోసారి ధ్వజమెత్తారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పవన్ వారాహి యాత్రలో ముఖ్యమంత్రిపై విషం, విద్వేషం కనిపిస్తోందన్నారు. ప్రజలను తప్పు దారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రుషికొండ వరకు వెళ్లిన పవన్కు పక్కనే గీతం సంస్థ చేసిన అక్రమాలు కనిపించలేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం, ప్రభుత్వ భూమినే కబ్జా చేయడం అనే విమర్శ అవగహన రాహిత్యానికి నిదర్శనమ్నారు. యజమాని కోసం పవన్ కోతిలా గంతులు వేస్తున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Anand Mahindra: రోబోలా మారిన కారు…చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
పవన్ కళ్యాణ్, చంద్రబాబు, వాళ్లకు సహకరిస్తున్న మీడియా.. అందరూ స్టువర్ట్పురం దొంగలని మంత్రి అమర్నాథ్ ఆరోపించారు. అటువంటి వాళ్ళు వాలెంటీర్లను దండు పాళ్యమని అవమానించడానికి నోరెలా వస్తోందని మండిపడ్డారు. పూర్తి అనుమతులతో రుషికొండ అభివృద్ధి జరుగుతుంటే.. వచ్చిన నష్టం, అభ్యంతరం ఎందుకో పవన్ కళ్యాణ్ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయాలనే ఆలోచన తప్ప పవన్ కళ్యాణ్కు ఒక విధానం లేదని దుయ్యబట్టారు. చిరంజీవి జూబ్లీహిల్స్లో కట్టిన ఇల్లు కొండ మీద కాదా? ఇందుకు పవన్ సమాధానం చెప్పాలన్నారు. భూమి లభ్యత తక్కువగా ఉన్న చోట కొండల మీద కాకపోతే నిర్మాణాలు ఎక్కడ చేయాలి? అని నిలదీశఆరు. కట్టుకథలు అల్లి ప్రజలను తప్పుదారి పట్టించడమే పనిగా పెట్టుకున్నాడని విమర్శించారు.
Yashasvi Jaiswal Fifty: అరుదైన రికార్డు నెలకొల్పిన యశస్వి జైస్వాల్.. శుభ్మన్ గిల్తో మరో రికార్డు!
గట్టిగా ప్రశ్నిస్తే కేంద్రంతో చెప్పి ఆటాడిస్తానని పవన్ బెదిరిస్తున్నాడని.. కేంద్రంతో కాకపోతే పుతిన్తో చెప్పుకో అని మంత్రి అమర్నాథ్ సవాల్ విసిరారు. డాడీ, దత్తపుత్రుడు విడతల వారీగా విశాఖకు వచ్చి అసత్యాలు ప్రచారం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 15కు పవన్ మంగళగిరి వెళితే.. చంద్రబాబు విశాఖ వస్తున్నారన్నారు. ఇద్దరు వేర్వేరుగా తిరగడం ఎందుకు.. కలిసి మెలిసి పర్యటించడం మంచిదని హితవు పలికారు. మోడీ అంటే భయం ఉండొచ్చు కానీ, డాడీని చూసి ఎందుకు భయపడుతున్నారో పవన్ చెప్పాలన్నారు. బానిసత్వంలో బ్రతుకుతూ.. వాలేంటీర్లు వ్యవస్థపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!