Gudivada Amarnath: కేంద్రంతో కాకపోతే పుతిన్తో చెప్పుకో.. పవన్కి మంత్రి అమర్నాథ్ సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath Sensational Comments On Pawan Kalyan: జనసేనాధిపతి పవన్ కళ్యాణ్పై మంత్రి అమర్నాథ్ మరోసారి ధ్వజమెత్తారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పవన్ వారాహి యాత్రలో ముఖ్యమంత్రిపై విషం, విద్వేషం కనిపిస్తోందన్నారు. ప్రజలను తప్పు దారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రుషికొండ వరకు వెళ్లిన పవన్కు పక్కనే గీతం సంస్థ చేసిన అక్రమాలు కనిపించలేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం, ప్రభుత్వ భూమినే కబ్జా చేయడం అనే విమర్శ అవగహన రాహిత్యానికి నిదర్శనమ్నారు. యజమాని కోసం పవన్ కోతిలా గంతులు వేస్తున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Anand Mahindra: రోబోలా మారిన కారు…చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
Also Read
- YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
- YS Jagan: చంద్రబాబు చెప్పిన ప్రకారం పెట్రోల్, డీజిల్పై రూ.8 తగ్గించాలి కదా..? జగన్ డిమాండ్
- TDP Politburo Meeting: నేడు టీడీపీ పొలిట్బ్యూరో కీలక భేటీ.. మహానాడు ఏర్పాట్లపై ప్రధాన చర్చ
- Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
పవన్ కళ్యాణ్, చంద్రబాబు, వాళ్లకు సహకరిస్తున్న మీడియా.. అందరూ స్టువర్ట్పురం దొంగలని మంత్రి అమర్నాథ్ ఆరోపించారు. అటువంటి వాళ్ళు వాలెంటీర్లను దండు పాళ్యమని అవమానించడానికి నోరెలా వస్తోందని మండిపడ్డారు. పూర్తి అనుమతులతో రుషికొండ అభివృద్ధి జరుగుతుంటే.. వచ్చిన నష్టం, అభ్యంతరం ఎందుకో పవన్ కళ్యాణ్ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయాలనే ఆలోచన తప్ప పవన్ కళ్యాణ్కు ఒక విధానం లేదని దుయ్యబట్టారు. చిరంజీవి జూబ్లీహిల్స్లో కట్టిన ఇల్లు కొండ మీద కాదా? ఇందుకు పవన్ సమాధానం చెప్పాలన్నారు. భూమి లభ్యత తక్కువగా ఉన్న చోట కొండల మీద కాకపోతే నిర్మాణాలు ఎక్కడ చేయాలి? అని నిలదీశఆరు. కట్టుకథలు అల్లి ప్రజలను తప్పుదారి పట్టించడమే పనిగా పెట్టుకున్నాడని విమర్శించారు.
Yashasvi Jaiswal Fifty: అరుదైన రికార్డు నెలకొల్పిన యశస్వి జైస్వాల్.. శుభ్మన్ గిల్తో మరో రికార్డు!
గట్టిగా ప్రశ్నిస్తే కేంద్రంతో చెప్పి ఆటాడిస్తానని పవన్ బెదిరిస్తున్నాడని.. కేంద్రంతో కాకపోతే పుతిన్తో చెప్పుకో అని మంత్రి అమర్నాథ్ సవాల్ విసిరారు. డాడీ, దత్తపుత్రుడు విడతల వారీగా విశాఖకు వచ్చి అసత్యాలు ప్రచారం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 15కు పవన్ మంగళగిరి వెళితే.. చంద్రబాబు విశాఖ వస్తున్నారన్నారు. ఇద్దరు వేర్వేరుగా తిరగడం ఎందుకు.. కలిసి మెలిసి పర్యటించడం మంచిదని హితవు పలికారు. మోడీ అంటే భయం ఉండొచ్చు కానీ, డాడీని చూసి ఎందుకు భయపడుతున్నారో పవన్ చెప్పాలన్నారు. బానిసత్వంలో బ్రతుకుతూ.. వాలేంటీర్లు వ్యవస్థపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
-
RG Kar Case: ఆర్జీకర్ కేసులో ట్విస్ట్.. మళ్లీ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం
-
GT vs CSK: టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్.. గిల్ సేనకు మొదట బ్యాటింగ్ సవాల్..
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో అత్త గారికి ప్రభుత్వం షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
-
Summer Tips: ఎండ నుంచి వచ్చాక వెంటనే ఐస్ వాటర్ తాగుతున్నారా? ప్రమాదం ఇదే
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!