Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Godavari Water Wastage Experts Advice

Godavari Water Wastage: గోదావరి వరద నీరు వచ్చింది కొండంత.. వాడుకున్నది గోరంత

Published Date :September 25, 2022 , 10:46 am
By NTV WebDesk
Godavari Water Wastage: గోదావరి వరద నీరు వచ్చింది కొండంత.. వాడుకున్నది గోరంత
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఎక్కడో మహారాష్ట్రలో పుట్టిన జీవనది గోదావరి… రాష్ట్రాలు దాటుకుని సముద్రం వైపు దూసుకుపోతుంది గోదారమ్మ. అయితే, ఎక్కువ భాగం వరద నీరు సముద్రం పాలు కావడంతో రైతులు, పర్యావరణ వేత్తలు, గోదావరి జిల్లా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఎగువ ప్రాంతాల్లో నుండి వచ్చిన గోదావరి వరద నీరు వచ్చింది కొండంత. అయితే వినియోగించుకున్నది గోరంత…ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 3 టీఎంసీల నీరు మాత్రమే స్టోరేజ్ కెపాసిటీ ఉండటంతో 5,397 టిఎంసిలు వరదనీరు వృధాగా సముద్రంలోకి వదిలారు.వినియోగించుకున్నది మాత్రం 81 టీఎంసీలే.వృధాగా పోతున్న గోదావరి జలాలపై స్పెషల్ రిపోర్ట్.

Read Also: Karnataka: గంజాయి స్మగ్లర్ల దాడి.. చావుబతుకుల మధ్య పోలీస్ ఇన్‌స్పెక్టర్

ఈ ఏడాది వరద గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. మూడుసార్లు వరదలు వచ్చి ఉప్పొంగి ప్రవహించింది. రోజులు తరబడి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగింది. జూలై ఆరంభం నుంచి ఈ వరద నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. బ్యారేజి గేట్లను దించడానికి ఏ రోజూ అవకాశం ఇవ్వలేదు. ఈ పరిస్థితులలో సముద్రంలోకి ఎంత నీరు వృధాగా వెళ్ళిందో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. జలవనరులు శాఖ అధికారులు లెక్కల ప్రకారం జులై 1 నుంచి ఇప్పటివరకు ఐదువేల 397 టీఎంసీలు వరదనీరు వృధాగా సముద్రంలో కలిసిపోయింది.

ఇది నదీ జలాలను వినియోగించుకోవాలనే ఆశయాన్ని వెక్కిరిస్తుంది. ఇంత నీరు సముద్రంలోకి వెళ్ళిపోయింది కదా మరి మనం ఎంత నీటిని వాడుకున్నాం అన్నది లెక్క చూసుకుంటే తూర్పు, పశ్చిమ, మధ్యమ డెల్టాల పంట కాలువల ద్వారా వాడుకున్నది కేవలం 81 టీఎంసీలు మాత్రమే. ఇప్పుడు కూడా ధవళేశ్వరం బ్యారేజి వద్ద పది అడుగుల నీటిమట్టం ఉంది. ప్రస్తుతం కాలువలకు రోజుకు 12వేల 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుంటే సముద్రంలోకి 5 లక్షల 40 వేల 191 క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వెంటనే పూర్తి కావాల్సి ఉంది.

Read Also: CM KCR: పట్టణ ప్రగతి కార్యక్రమాలు సత్ఫలితాలనిచ్చాయి.. అవార్డులు రావడంపై సీఎం హర్షం

పోలవరం ప్రాజెక్టు ద్వారా వరదనీటి కెనాల్స్ ద్వారా దారి మళ్ళించి వృధా పోతున్న గోదావరి వరద నీటిని ఒడిసి పట్టుకుని వినియోగించుకునే అవకాశం ఉంటుందని ఇరిగేషన్ శాఖ అధికారులు అభిప్రాయ పడుతున్నారు. ఆ దిశగా మన పాలకులు కార్యాచరణ వేగవంతం చేయాల్సిన అవసరం వుంది. ఈ వృధానీటిని వాడుకుంటే మన పొలాలు సస్యశ్యామలం అయి విలువైన పంటలు పండుతాయంటున్నారు. (రాజమండ్రి ప్రతినిధి శ్రీనివాస్ సౌజన్యంతో….)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 5397 TMCs Water
  • dowleswaram
  • Godavari water
  • irrigation experts
  • Polavaram project

తాజావార్తలు

  • Iran Missile Attack: సౌదీ ‘జీవనాడి’పై క్షిపణి దాడి.. చమురు పైప్‌లైన్‌ను దెబ్బతీసిన ఇరాన్!

  • Illicit Relationship: టాక్సీ డ్రైవర్‌ ను ప్రేమించిన భార్య.. బ్యాంకర్ భర్త హత్యకు కుట్ర.. చివరకు ఏమైందంటే?

  • Governor Abdul Nazeer: నేడు ఆదికవి నన్నయ్య వర్సిటీ స్నాతకోత్సవం.. ముఖ్య అతిథిగా గవర్నర్‌

  • AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక అజెండాతో సమావేశం..

  • Male Contraception: పురుషులకు కొత్త జనన నియంత్రణ వచ్చేస్తోంది.. కార్నెల్ యూనివర్సిటీ గేమ్ చేంజర్

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions