Andhra Pradesh: ఏపీ కాంగ్రెస్కు నూతన సారథి.. పీసీసీ చీఫ్గా గిడుగు రుద్రరాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిలపడిపోయింది. ఆ పార్టీని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క సీటును కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేకపోయింది. 2024 ఎన్నికల్లోనూ ఆ పార్టీ పుంజుకుంటుందన్న ఆశలు లేవు. ఈ నేపథ్యంలో ఏపీలోని కాంగ్రెస్ పార్టీకి అధిష్టానం నూతన సారథిని నియమించింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (PCC) నూతన అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి కాంగ్రెస్ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also: విదేశాల్లో ఉన్న 10 దేవతామూర్తులు
Also Read
- Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
- TDP Mahanadu: అందుకే హైబ్రిడ్ మహానాడు.. నెల్లూరు సభ రద్దుపై పల్లా శ్రీనివాస్ వివరణ..
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
- International flights cancelled: విదేశీ ప్రయాణికులకు భారీ షాక్.. 95 శాతం టిక్కెట్లు రద్దు..!
అటు 18 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. 34 మందితో కో ఆర్డినేషన్ కమిటీని నియమించింది. అంతేకాకుండా నూతన వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. మస్తాన్ వలి, జంగా గౌతమ్, రాకేశ్, సుంకర పద్మశ్రీలను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించింది. మాజీ కేంద్రమంత్రి పల్లంరాజుకు ప్రోగ్రాంల కమిటీ ఛైర్మన్ బాధ్యతలను అప్పగించింది. తులసిరెడ్డిని మీడియా కమిటీ ఛైర్మన్గా నియమించింది. మాజీ ఎంపీ హర్షకుమార్ను ప్రచార కమిటీ ఛైర్మన్గా నియమిస్తున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం వెల్లడించింది. ఈ మేరకు పార్టీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
తాజావార్తలు
-
IBomma Piracy: ఐబొమ్మ కథ ముగిసిందనుకుంటే.. మళ్లీ మొదలైందా? బాంబ్ పేల్చిన రవి!
-
Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
-
West Bengal: టీఎంసీ ఆఫీస్లో వందలాది ఆధార్ కార్డులు.. బెంగాల్లో సంచలనం!
-
Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
-
KamalHaasan : నాకు రజనీకాంత్కు మధ్య పోటీ మాత్రమే ఉంది.. విజయ్ నుండి ఎక్కువ ఆశించకూడదు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..