YS Sharmila: మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్లో చేరారు. ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్పై ఫోకస్ పెడుతోంది.. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో అధిష్టానంతో సమావేశం కానున్నారు ఏపీ నేతలు.. సుమారు 30 మంది ఏపీ కాంగ్రెస్ నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.. తెలంగాణలో విజయం తర్వాత ఏపీ కాంగ్రెస్ పై రాహుల్ గాంధీ దృష్టి పెట్టారు.
Andhra Pradesh: రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిలపడిపోయింది. ఆ పార్టీని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క సీటును కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేకపోయింది. 2024 ఎన్నికల్లోనూ ఆ పార్టీ పుంజుకుంటుందన్న ఆశలు లేవు. ఈ నేపథ్యంలో ఏపీలోని కాంగ్రెస్ పార్టీకి అధిష్టానం నూతన సారథిని నియమించింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (PCC) నూతన అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి కాంగ్రెస్…
కేంద్రంలో నరేంద్ర మోడీ తీరుపై మండిపడ్డారు ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాధ్. రాహుల్ గాంధీని విచారణ పేరుతో ఈడీ వేధిస్తోంది. రేపు గవర్నర్ బంగ్లా ముందు నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. బీజేపీకి అధికారమనే పిచ్చి పట్టింది. విచారించాల్సి వస్తే ముందు బీజేపీ నేతలను విచారించాలన్నారు శైలజానాథ్. భారత రాజ్యాంగం అంటే గౌరవం లేదు, ఏఐసీసీ కార్యాలయానికి పోలీసులను పంపిస్తున్నారు. ఏ రోజైన బీజేపీ కార్యాలయాల జోలికి వెళ్ళామా..? నాగపూర్లోని ఆరెస్సెస్ కార్యాలయానికి పోలీసులను పంపితే అన్నీ దొరుకుతాయి.…
ఆంధ్రప్రదేశ్పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం.. భారీ మార్పులకు పూనుకున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.. దానికి తగ్గట్టుగానే అధిష్టానం.. రాష్ట్రానికి చెందిన నేతలతో విడివిడిగా సమావేశం కూడా అయ్యింది.. ఈ నేపథ్యంలో కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక త్వరలోనే జరగనున్నట్టు తెలుస్తోంది.. ప్రస్తుతం పీసీసీ చీఫ్గా ఉన్న శైలజానాథ్ ను మార్చాలని అధిష్ఠానం నిర్ణయానికి రాగా.. కొత్త అధ్యక్షుడి వేటలో పడింది.. దీని కోసం పరిశీలనలో చింతామోహన్, జేడీ శీలం, హర్షకుమార్ పేర్లు…