పరిస్థితులను బట్టి భవిష్యత్తులో ఫ్యాక్టరీ తరలింపు నిర్ణయాలు ఉండచ్చు. చిత్తూరు జిల్లాకు సేవ చేయాలని అనుకున్న దానికంటే ఎక్కువే చేశాను అని అమరరాజా గ్రూప్ ఛైర్మన్ గల్లా రామచంద్ర నాయుడు అన్నారు. హైకోర్టులో ఉన్న కేసులపై మాట్లాడటం కరెక్ట్ కాదు. 36 ఏళ్ళుగా ఎంతో నిబద్ధతతో కంపెనీ అభివృద్ధి చేశాము. వేలాదిమందికి ఉద్యోగం అవకాశాలు కల్పించాము. నేను రాజకీయ నాయకుడ్ని కాదు… నేను వ్యాపార వేత్తను… సమాజసేవ కుడిని మాత్రమే అని తెలిపారు.
ఇక గల్లా జయదేవ్ మాట్లాడుతూ… అమరరాజా ఫ్యాక్టరీ వార్తల ఇప్పటి మేము స్పందించలేదు. మా కంపెనీపై కోన్ని ఛానల్ విష ప్రచారం చేశాయి. అయినా మేము వాటిపై స్పందించలేదు. కోర్టులో ఉన్న కేసులపై మాట్లాడటం కరెక్టు కాదు అని పేర్కొన్నారు..