Vijayawada Women Selfdestruction: ఫిల్మ్ రేటింగ్ పేరుతో మోసం.. కృష్ణానదిలో దూకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోసాలు, దారుణాలు పెరిగిపోతున్నాయి. డబ్బుల కోసం కొంతమంది కేటుగాళ్ళు ఏం చేయడానికైనా, ఎవరిని ఎంత మోసం చేయడానికైనా వెనుకాడడం లేదు. విజయవాడలో ఓ మహిళ లక్షలు మోసపోయింది. భర్తకి చెబితే ఏమవుతుందోనని, కుటుంబం గురించి కూడా ఆలోచించకుండా బలవన్మరణానికి పాల్పడింది. ఫిల్మ్ రేటింగ్ పేరుతో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ఆన్ లైన్ లో ఫిల్మ్ రేటింగ్ ద్వారా లక్షల రుపాయలు లాభలంటూ ప్రకటనలు.. అబద్దపు ప్రకటనలతో మోసపోతున్న బాధితులు.
Read Also: Threat to RSS Chief: ఆర్ఎస్ఎస్ చీఫ్కు మావోయిస్టుల నుంచి బెదిరింపు.. పోలీసులు అలర్ట్
Also Read
- Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
లక్షల రుపాయలు చెల్లించి మోసపోయిందా మహిళ. వాషింగ్టన్ ఫిల్మ్ స్క్వేర్ కంపెనీకి రెండు దఫాలుగా సుమారు 7 లక్షలు చెల్లించింది విజయవాడకు చెందిన హిమబిందు. భర్త నాగకృష్ణ ప్రసాద్ సాఫ్ట్వేర్ ఉద్యోగి కావడంతో తొలిసారి డబ్బులు చెల్లించినపుడు అడ్డుకున్నాడు భర్త. ఆయనకు తెలియకుండా మరో 7 లక్షల రుపాయలు చెల్లించింది హిమబిందు..డబ్బులు చెల్లించాక సదరు కంపెనీ నుండి స్పందన రాకపోవడంతో మోసపోయినట్లు నిర్దారణకు వచ్చింది హిమబిందు. డబ్బుల విషయంలో భార్య భర్తల మధ్య గొడవలు జరిగేవి.
తాను మోసపోయానని, భర్తకు, కుటుంబ సభ్యులకు మొహం చూపించలేక ఇంటి నుండి వెళ్లిపోయింది హిమబిందు. భర్త ఫిర్యాదు మేరకు ఎస్ఆర్ పేట పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కృష్ణ బ్యారేజ్ వరకు సిసిటివి లో హిమబిందు కదలికలు రికార్డయ్యాయి. అయితే ఆ తర్వాత ఫుటేజ్ లో ఆమె కనిపించలేదు. హిమబిందు కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య కు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
Read Also: Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం.. మరో కీలక వ్యక్తి అరెస్టు
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!