Nellore Barashahid Darga: నేటి నుంచి బారాషహీద్ రొట్టెల పండుగ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
festival rottela panduga starts august 9th: నేటి నుంచి నెల్లూరులో ప్రతిష్టాత్మకంగా జరిగే బారాషహీద్ రొట్టెల పండుగ ప్రారంభంకానుంది. ఈ దర్గాకు దేశ, విదేశాల్లో ఎంతో ప్రాశస్త్యం పొందిన నెల్లూరు బారాషహీద్ దర్గా రొట్టెల పండగ నేటి నుంచి 13 వరకు జరగనుంది. ఈ మేరకు జిల్లా వక్ఫ్బోర్డు, అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. అయితే.. రెండేళ్లుగా కరోనా వల్ల ఉత్సవం వైభవంగా నిర్వహించలేదు. ఇప్పుడిప్పుడే కోరానా కాస్తా తగ్గడంతో లక్షల్లో భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
బారాషహీద్ దర్గా రొట్టెల పండగ
9న షాహాదత్ రోజున సొందల్మాలీ,
10న రాత్రి గంధోత్సవం,
11న రొట్టెల పండుగ,
12న తహలీల్ ఫాతెహా,
13న ముగింపు ఉత్సవం ఉంటుందని రొట్టెల పండగ కమిటీ తెలిపింది.
Also Read
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
- CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
ఈ దర్గాకు చారిత్రక నేపథ్యం ఉన్న విశేషమైన ఆరోగ్య చరిత్ర కూడా ఉంది. ఈ మట్టి పవిత్రం, ఈ నీరు పవిత్రం అని చెబుతారు. ఇక్కడ 12 మంది యుద్ధ వీరుల మరణానికి చిహ్నంగా దర్గా ఏర్పాటు చేశారు. అయితే.. ఇప్పటికా 12 సమాధులు ఇక్కడ ఉండడమేకాదు..ఈ సమాధుల వద్ద ప్రార్థనలు చేస్తే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. బాహాషహీద్ దర్గా గంధ మహోత్సవం రోజున, దర్గా సమీపంలోని స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకుంటే కోరిన కోర్కెలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ ఆరోగ్య రొట్టె, ఐశ్వర్య రొట్టె, విదేశీ విద్యా రొట్టె, వివాహ రొట్టె, సంతాన రొట్టె.. ఇలా వివిధ రకాల పేర్లతో వీటిని పిలుస్తారు.
ఈనేపథ్యంలో.. ఒక ఏడాది రొట్టె తీసుకుని తమ కోర్కె నెరవేరితే, మరుసటి ఏడాది అదే పేరుతో రొట్టెను చేసుకుని తీసుకొచ్చి అక్కడ ఆయా ప్రతిఫలం కోసం ఎదురు చూస్తున్నవారికి ఇస్తుంటారు. ఇక్కడ ఆరోగ్య రొట్టెకు ఎక్కువ డిమాండ్ .. ఇక్కడి రొట్టెల కోసం దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. అయితే.. కరోనా వల్ల రెండేళ్లుగా రొట్టెల పండగను కేవలం ముజావర్ల సమక్షంలోనే రొట్టెల పండగ జరిగింది. కరోనా కారణంగా భక్తులను నెల్లూరుకి అనుమతించ లేదు. రెండేళ్ల తరువాత ఈ ఏడాది గతంకంటే రెట్టింపు సంఖ్యలో భక్తులు వస్తారని, అన్ని ఏర్పాట్లు చేశామని దర్గా కమిటీ నిర్వహకులు సయ్యద్ సమీ వెల్లడించారు. అయితే.. రాష్ట్ర స్థాయి గుర్తింపు తెచ్చుకున్న బారాషహీద్ దర్గా రొట్టెల పండుగలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానిస్తామని మంత్రి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
Vizag Railway Zone: విశాఖలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు అంతా రెడీ
తాజావార్తలు
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
-
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
-
Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..