Honor Killing: ఏపీలో పరువుహత్య.. కూతుర్ని దారుణంగా చంపిన తండ్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Father Killed His Daughter In Nandyal District Because Of Extramarital Affair: ఏపీలోని నంద్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన కన్న కూతురినే ఓ తండ్రి అత్యంత కిరాతకంగా చంపేశాడు. వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతోనే ఆ తండ్రి ఈ ఘోరానికి పాల్పడ్డాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. పాణ్యం మండలం ఆలమూరుకు చెందిన దేవేందర్ రెడ్డికి ప్రసన్న అనే కుమార్తె ఉంది. ఈమెకు 18 నెలల క్రితం గోస్పాడు మండలం జిల్లెల్లకు చెందిన ఓ యువకుడితో వివాహం జరిగింది. తన భర్తతో కలిసి హైదరాబాద్కి వచ్చిన ప్రసన్న.. నగరంలో కాపురం పెట్టింది. అయితే.. భర్తతో మనస్పర్థలు ఏర్పడటంతో ప్రసన్న పుట్టింటికి తిరిగొచ్చింది.
China Bumper Offer: కొత్త జంటలకు చైనా బంపరాఫర్.. నెల రోజులు ఫ్రీ
Also Read
- Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
- Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
- Off The Record : సైలెంట్ మోడ్ లో కాకినాడ జిల్లా వైసీపీ సీనియర్స్
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
రోజులు గడుస్తున్నా ప్రసన్న తిరిగి భర్త వద్దకు వెళ్లకపోవడంతో.. కాపురానికి వెళ్లాల్సిందిగా దేవేందర్ రెడ్డి చాలాసార్లు నచ్చజెప్పాడు. ఎన్ని గొడవలు జరిగినా, సర్దుబాటు చేసుకోవాలని చెప్పేందుకు ప్రయత్నించాడు. అయినా పట్టించుకోకుండా ప్రసన్న పుట్టింట్లోనే ఉండిపోయింది. దీంతో తండ్రికి అనుమానం వచ్చింది. మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందేమోనని, అందుకే భర్త వద్దకు వెళ్లకుండా పుట్టింట్లోనే ఉందని అనుమానం కలిగింది. దీంతో.. కూతురిని చంపేయాలని దేవేందర్ రెడ్డి నిర్ణయించుకున్నాడు. ఈ నెల 10వ తేదీన రాత్రి అందరూ నిద్రపోయినప్పుడు.. ప్రసన్న గొంతు నులిమి చంపేశాడు. కొందరి సహాయంతో ప్రసన్న మృతదేహాన్ని నంద్యాల-గిద్దలూరు నల్లమల ఘాట్ రోడ్డులోని పచ్చర్ల ప్రాంతానికి తీసుకెళ్లాడు. మృతదేహాన్ని ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు.. తల, మొండెను వేరు చేశాడు. వాటిని వేర్వేరు ప్రాంతాల్లో విసిరేశాడు.
Bandi Sanjay: బీఆర్ఎస్ను తరిమికొడదాం.. రామరాజ్యం స్థాపించుకుందాం
ఈ ఘటనపై స్థానికులు సమాచారం అందించడంతో.. పాణ్యం పోలీసులు రంగంలోకి దిగారు. కుళ్లి కంపు కొడుతున్న మృతదేహం, శిథిలాలను సేకరించి.. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తండ్రి దేవేందర్ రెడ్డినే కూతుర్ని హత్య చేశాడని దర్యాప్తులో తేలింది. దీంతో.. దేవేందర్తో పాటు అతనికి సహకరించిన మరికొందరిపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. మరొకరితో తన కూతురు వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతోనే తాను చంపేశానని విచారణలో దేవేందర్ ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!