Pawan Kalyan: జనసేన గూటికి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు..! రేపు పవన్ సమక్షంలో చేరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan:ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ పెరుగుతుంది.. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. పార్టీలు మారే నేతల సంఖ్య కూడా పెరుగుతోంది.. జనసేన పార్టీలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు చేరేందుకు సిద్ధం అవుతున్నారు.. జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆదివారం రోజు పార్టీ కండువా కప్పుకోబోతున్నారు మాజీ ఎమ్మెల్యేలు ఈదర హరిబాబు, టీవీ రామారావు.. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు.. అనుచరులతో చర్చించిన తర్వాత జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధం అయ్యారు.. దానికి అనుగుణంగా రేపు.. జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు..
Read Also: Somu Veerraju: కీలక నేతలు బీజేపీలోకి.. పవన్-కిరణ్ కాంబినేషన్పై అధిష్టానానిదే నిర్ణయం..!
Also Read
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
- Machilipatnam: కామర్స్ లెక్చరర్ 'కామ లీలలు'.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
- AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ!.
- Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
ఇక, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు కూడా ఆదివారం రోజు జనసేన కండువా కప్పుకోబోతున్నారు.. రేపు మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు.. 1994లో తొలిసారి ఒంగోలు నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన ఈదర హరిబాబు.. ఎన్టీఆర్ హయాంలో ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఆయనకు ఎమ్మెల్యే అయ్యే అవకాశం రాలేదు. అయితే, 2014లో ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు. ఇక, 2019లో తన తనయుడితో కలిసి ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ గూటికి చేరారు. ఇప్పుడు జనసేన పార్టీలో చేరడం ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!