Pakistan: పామును పెంచిన పాకిస్తాన్.. దాడికి సిద్ధమైన 15,000 మంది తాలిబన్ ఫైటర్స్..
- పెంచిన పాము పాకిస్తాన్కి కాటేస్తోంది..
- పాక్కి తలనొప్పిగా మారిన తాలిబన్లు..
- ఇటీవల ఆఫ్ఘనిస్తాన్పై పాక్ ఎయిర్ స్ట్రైక్స్..
- ప్రతీకారం తీర్చుకుంటామని ఆఫ్ఘన్ హెచ్చరిక..
- 15000 మంది తాలిబన్ ఫైటర్లు పాక్ సరిహద్దులకు..
Pakistan: 2011లో అమెరికా విదేశాంగమంత్రి హిల్లరీ క్లింటన్ మాట్లాడుతూ.. మన పెరట్లో పాముల్ని పెంచుకుని, అవి పొరుగువారిని మాత్రమే కాటేయాలని ఆశించడం అవివేకం అవుతుందని పాకిస్తాన్ని ఉద్దేశించి అన్నారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితిన పాకిస్తాన్ ఎదుర్కొంటోంది. తాను పెంచి పోషించిన తాలిబన్లు ఇప్పుడు ఆ దేశాన్ని వణికిస్తున్నారు. రెండు రోజుల క్రితం పాకిస్తాన్ వైమానిక దళం ‘‘తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP)’’ని టార్గెట్ చేస్తూ ఆఫ్ఘనిస్తాన్లోని పలు ప్రాంతాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 40కి పైగా ప్రజలు చనిపోయినట్లు తాలిబన్లు తెలిపారు. తప్పకుండా ప్రతీకారం ఉంటుందని పాక్ని హెచ్చరించారు.
ఈ దాడి నేపథ్యంలో ప్రతీకారం తీర్చుకునేందుకు ఆఫ్ఘనిస్తాన్ని పాలిస్తున్న తాలిబన్లు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నివేదిక ప్రకారం.. 15000 మంది తాలిబన్ ఫైటర్ల పాకిస్తాన్ సరిహద్దు వైపు మార్చ్ చేస్తున్నారు. ఆఫ్ఘన్లో అధికారాన్ని తాలిబన్లు చేజిక్కించుకున్న తర్వాత పాక్ తాలిబన్లు రెచ్చిపోతున్నారు. పాకిస్తాన్లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో పాక్ ఆర్మీ, పోలీసులు లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. పాకిస్తాన్ పెంచి పోషించిన తాలిబన్లకే ఇప్పుడు ఆ దేశం బలవుతోంది. గతంలో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ని చేజిక్కించుకున్న తరుణంలో అప్పటి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వారిని ‘‘వరం’’గా కొనియాడారు.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
Read Also: Masood Azhar: జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్కి గుండెపోటు..!
రెండు రోజుల క్రితం పాక్ ఎయిర్ స్ట్రైక్స్పై ఆఫ్ఘాన్ తాలిబన్ పాలకులు ఆగ్రహంగా ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా పాకిస్తాన్ రాయబారిని పిలిపించి దాడులపై తీవ్ర నిరసనను తెలియజేసింది. ప్రతీకారం కోసం దాదాపుగా 15,000 మంది తాలిబన్ యోధులు కాబూల్, కాందహార్, హెరాత్ నుంచి పాకిస్తాన్ ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుని అనుకుని ఉన్న మీర్ అలీ సరిహద్దు వైపు కవాతు చేస్తున్నట్లు సమచారం.
ఇస్లామాబాద్కు చెందిన సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ నివేదిక ప్రకారం 2022తో పోలిస్తే 2023లో పాకిస్తాన్లో జరిగిన ఉగ్రవాద దాడుల వల్ల 56% మరణాలు పెరిగాయి, 500 మంది భద్రతా సిబ్బందితో సహా 1,500 మంది మరణించారు. తాలిబన్ దాడుల్ని అరికట్టాలని పలు మార్లు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ని కోరింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని 5 లక్షల మంది పత్రాలు లేని ఆఫ్ఘన్ వలసదారుల్ని పాకిస్తాన్ బహిష్కరించడంతో వివాదం మరింత ముదిరింది.
తాజావార్తలు
-
Astrology: ఏప్రిల్ 28, మంగళవారం దినఫలాలు.. ఏ రాశివారు.. ఏ పరిహారం చెల్లించాలంటే..!
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!