Pakistan: పామును పెంచిన పాకిస్తాన్.. దాడికి సిద్ధమైన 15,000 మంది తాలిబన్ ఫైటర్స్..
- పెంచిన పాము పాకిస్తాన్కి కాటేస్తోంది..
- పాక్కి తలనొప్పిగా మారిన తాలిబన్లు..
- ఇటీవల ఆఫ్ఘనిస్తాన్పై పాక్ ఎయిర్ స్ట్రైక్స్..
- ప్రతీకారం తీర్చుకుంటామని ఆఫ్ఘన్ హెచ్చరిక..
- 15000 మంది తాలిబన్ ఫైటర్లు పాక్ సరిహద్దులకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: 2011లో అమెరికా విదేశాంగమంత్రి హిల్లరీ క్లింటన్ మాట్లాడుతూ.. మన పెరట్లో పాముల్ని పెంచుకుని, అవి పొరుగువారిని మాత్రమే కాటేయాలని ఆశించడం అవివేకం అవుతుందని పాకిస్తాన్ని ఉద్దేశించి అన్నారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితిన పాకిస్తాన్ ఎదుర్కొంటోంది. తాను పెంచి పోషించిన తాలిబన్లు ఇప్పుడు ఆ దేశాన్ని వణికిస్తున్నారు. రెండు రోజుల క్రితం పాకిస్తాన్ వైమానిక దళం ‘‘తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP)’’ని టార్గెట్ చేస్తూ ఆఫ్ఘనిస్తాన్లోని పలు ప్రాంతాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 40కి పైగా ప్రజలు చనిపోయినట్లు తాలిబన్లు తెలిపారు. తప్పకుండా ప్రతీకారం ఉంటుందని పాక్ని హెచ్చరించారు.
ఈ దాడి నేపథ్యంలో ప్రతీకారం తీర్చుకునేందుకు ఆఫ్ఘనిస్తాన్ని పాలిస్తున్న తాలిబన్లు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నివేదిక ప్రకారం.. 15000 మంది తాలిబన్ ఫైటర్ల పాకిస్తాన్ సరిహద్దు వైపు మార్చ్ చేస్తున్నారు. ఆఫ్ఘన్లో అధికారాన్ని తాలిబన్లు చేజిక్కించుకున్న తర్వాత పాక్ తాలిబన్లు రెచ్చిపోతున్నారు. పాకిస్తాన్లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో పాక్ ఆర్మీ, పోలీసులు లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. పాకిస్తాన్ పెంచి పోషించిన తాలిబన్లకే ఇప్పుడు ఆ దేశం బలవుతోంది. గతంలో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ని చేజిక్కించుకున్న తరుణంలో అప్పటి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వారిని ‘‘వరం’’గా కొనియాడారు.
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
Read Also: Masood Azhar: జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్కి గుండెపోటు..!
రెండు రోజుల క్రితం పాక్ ఎయిర్ స్ట్రైక్స్పై ఆఫ్ఘాన్ తాలిబన్ పాలకులు ఆగ్రహంగా ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా పాకిస్తాన్ రాయబారిని పిలిపించి దాడులపై తీవ్ర నిరసనను తెలియజేసింది. ప్రతీకారం కోసం దాదాపుగా 15,000 మంది తాలిబన్ యోధులు కాబూల్, కాందహార్, హెరాత్ నుంచి పాకిస్తాన్ ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుని అనుకుని ఉన్న మీర్ అలీ సరిహద్దు వైపు కవాతు చేస్తున్నట్లు సమచారం.
ఇస్లామాబాద్కు చెందిన సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ నివేదిక ప్రకారం 2022తో పోలిస్తే 2023లో పాకిస్తాన్లో జరిగిన ఉగ్రవాద దాడుల వల్ల 56% మరణాలు పెరిగాయి, 500 మంది భద్రతా సిబ్బందితో సహా 1,500 మంది మరణించారు. తాలిబన్ దాడుల్ని అరికట్టాలని పలు మార్లు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ని కోరింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని 5 లక్షల మంది పత్రాలు లేని ఆఫ్ఘన్ వలసదారుల్ని పాకిస్తాన్ బహిష్కరించడంతో వివాదం మరింత ముదిరింది.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!