EX Maoist Death: మాజీ మావోయిస్టు అనామధేయుడి అనుమానాస్పద మృతి
మాజీ మావోయిస్టు , ప్రముఖ కవి అనామధేయుడు అనుమానాస్పద స్థితిలో మరణించారు. విగత జీవిగా వున్న ఆయన మృతదేహాన్ని రాజమండ్రిలో గుర్తించారు. అనామధేయుడు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు కుటుంబ సభ్యులు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనామధేయుడు అసలు పేరు జేఎన్వీ మూర్తి. కృష్ణా జిల్లా గొల్లపూడి గ్రామానికి చెందిన మూర్తి విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదివే సమయంలోనే విప్లవ రాజకీయాలకు పరిచయమయ్యాయి. రాడికల్ విద్యార్థి సంఘంలో ఎక్కువ కాలం పనిచేశారు. అనంతరం పీపుల్స్ వార్ పార్టీలో చేరి విప్లవోద్యమంలో కీలకపాత్ర పోషించారు.
అనంతరకాలంలో అనారోగ్య కారణాలతో బయటకు వచ్చారు. అప్ప టికే కవిత్వం, ,కథలు రాస్తున్న అనామధేయుడు విప్లవ రచయితల సంఘంలో చేరి చురుకుగా వ్యవహరించారు. ఈ సంఘం అధికార పత్రిక అరుణతార పత్రిక నిర్వహణలో కీలక బాధ్యత వహించారు. జర్నలిస్ట్ గా వివిధ పత్రికల్లో పనిచేశారు. 1996లో ఒంగోలుకు చెందిన ప్రభుత్వ టీచరు క్రాంతితో ఈయనకు వివాహం జరిగింది. అనామధేయుడు పేరుతో పలు పత్రికల్లో వ్యాసాలు, రచనలు చేశారు.
Also Read
- AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
- AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
- CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
Read Also: Sabitha Indra Reddy : సీఎం కేసీఆర్ విద్య, వైద్యానికి పెద్దపీట వేశారు
పలు పుస్తకాలు ప్రచురించారు. అనువాద కవిత్వం పట్ల మక్కువ చూపేవారని సన్నిహితులు గుర్తుచేసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న అనామధేయుడు ఇటీవల వైజాగ్ వెళ్లినట్టు కుటుంబసభ్యులు చెబుతున్నారు. తణుకులో చదువుతున్న కుమార్తె నది వద్దకు వెళ్ళడానికి రాజమండ్రి వచ్చారు. ఇలా వచ్చిన అనామధేయుడు ఇన్నీసుపేట కైలాస భూమిలో విగతజీవుడై పడిఉండడాన్ని స్థానికులు గమనించారు. అనామధేయుడి ఫోన్లోని నంబర్ల ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యుల సహకారంతో అనామధేయుడని ధ్రువీకరించుకున్నారు. మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Read Also: Dispute Over Missing Goats: తప్పిపోయిన మేకల విషయంలో వివాదం.. రైతును కాల్చిచంపేశాడు..
తాజావార్తలు
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
-
Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?
-
Sugarcane Juice Side Effects: వేసవిలో చెరకు రసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!
-
RCB vs DC: ఒక్క మ్యాచ్ కే ఇంత తేడానా.? అప్పుడేమో 264.. ఇప్పుడు 75కే ఖేల్ ఖతం..!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!