CM Chandrababu: జగన్ సర్కార్ నిర్లక్ష్యంతో వందల కోట్ల ప్రజాధానం వృథా అయింది..
- పోలవరం నిర్వాసితులను గత ప్రభుత్వం పట్టించుకోలేదు..
- రూ. 10 లక్షలు ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చి మాట తప్పింది..
- జగన్ సర్కార్ నిర్లక్ష్యంతో వందల కోట్ల ప్రజాధానం వృథా అయింది: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంకి ఏపీ సీఎం చంద్రబాబు చేరుకుని ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అనంతరం పోలవరం నిర్వాసితులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్లలో 33సార్లు పోలవరం వచ్చి ప్రాజెక్టు పూర్తి చేయడం, పునరావాస కల్పనపై దృష్టి పెట్టామని పేర్కొన్నారు. కానీ, పోలవరం నిర్వాసితులను గత ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. నిర్వాసితులకు రూ. 10 లక్షలు ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చి మాట తప్పింది.. టీడీపీ ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే 2020 కంతా పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం కూడా పెరిగింది.. పోలవరం కోసం తెలంగాణలో ఉన్న 7 మండలాలను ఏపీలో విలీనం చేశామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: Devadula Project: ఎట్టకేలకు ప్రారంభమైన దేవాదుల మూడోదశ మోటార్లు.. ఆనందం వ్యక్తం చేసిన రైతులు!
Also Read
- MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
- Lemon Prices: అమాంతం పెరిగిన నిమ్మకాయల ధరలు.. రూ.30 నుంచి రూ.130కి..!
- Home Minister Anitha: 'మావిగన్' పేరు ఎత్తితే జనం నవ్వుకుంటున్నారు.. అనిత సెటైర్లు
- Nimmala Ramanaidu: కేంద్ర జలశక్తి కార్యదర్శికి మంత్రి నిమ్మల కీలక సూచనలు..
అయితే, జగన్ పాలనలో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది.. జగన్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల వందల కోట్ల ప్రజాధానం వృధా అయిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. అలాగే, గత ప్రభుత్వంలో పోలవరానికి వచ్చిన డబ్బులు దారి మళ్లించారు.. దాని వల్ల నిర్వాసితులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఇక, ప్రాజెక్ట్ కోసం భూములు ఇచ్చి అనేక ఇబ్బందులు పడ్డారు.. 2027నాటికి పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.. పునరావాసం పూర్తయ్యాకనే.. ప్రాజెక్టు నీళ్లు వదిలి పెడతాం.. నిర్వాసితుల ఆదాయం పెరిగే మార్గాలను కూడా కల్పిస్తామన్నారు. నిర్వాసితులు ఇతరుల మాటలు విని మోసపోవద్దు అని సూచించారు. అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటేనే కేంద్రం పునరావాసం నిధులు ఇస్తుంది.. దళారులు, మధ్యవర్తులు, దొంగలు లేకుండా నిర్వాసితుల ఖాతాల్లో డబ్బులు వేసిన ఘనత ఎన్డీయే ప్రభుత్వానికి దక్కుతుందని చంద్రబాబు వెల్లడించారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!