CM Chandrababu: అభివృద్ధి జరిగితేనే భూముల ధరలకు రెక్కలు.. కోకాపేటలో అప్పుడు రూ.10 వేలు.. ఇప్పుడు రూ.170 కోట్లు..
- అభివృద్ధి జరిగితేనే భూముల ధరలకు రెక్కలు..
- ఒకప్పుడు కోకాపేటలో రూ.10,000 విలువ చేసే ఎకరం భూమి...
- ఇప్పుడు రూ.170 కోట్లకు చేరిందని గుర్తు చేసిన సీఎం చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: అభివృద్ధి జరిగితేనే భూముల ధరలకు రెక్కలు వస్తాయి అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఒకప్పుడు హైదరాబాద్లోని కోకాపేటలో రూ.10,000 విలువ చేసే ఎకరం భూమి… ఇప్పుడు రూ.170 కోట్లకు చేరిందని గుర్తు చేశారు.. జూబ్లీహిల్స్లో ఒక్కప్పుడు రాళ్లు, రప్పలు ఉండేవి.. కానీ, ఒక హైటెక్ సిటీ కట్టి.. ముందు అడుగు వేశాం.. మౌలిక సదుపాయాలు కల్పించాం.. ఈ రోజు ఆ ప్రాంతానికి వెళ్లి చూస్తే.. ఎంత అభివృద్ధి జరిగిందో తెలుస్తుందన్నారు.. అభివృద్ధి జరిగితే భూముల ధరలకు రెక్కలు వస్తాయి.. వ్యవసాయంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది అన్నారు.. పోలవరం పూర్తి చేస్తే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు నీళ్లు వస్తాయి.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి రీజియన్ ఏర్పాటు చేస్తున్నాం.. అమరావతి, విశాఖ, తిరుపతితో పాటు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు..
Read Also: WhatsApp 6-hour Logout: వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్.. ఇకపై ప్రతి 6 గంటలకోసారి..
Also Read
- Alla Nani No More: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత..
- Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
- CM Chandrababu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్.. గంజాయి, రౌడీయిజంపై సంచలన వ్యాఖ్యలు
- Nuzvid Love Marriage Twist: ప్రేమ వివాహం తర్వాత ట్విస్ట్.. భార్యను అప్పగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్?
ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా గోపీనాథపట్నంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. నల్లమాడులో నిర్వహించిన ప్రజావేదికలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఏలూరు జిల్లా పర్యటనలో మాట్లాడుతూ రాబోయే 15 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్లో NDA ప్రభుత్వం కొనసాగాలని అభిప్రాయపడ్డారు. “నాది, పవన్ కళ్యాణ్ ది అదే ఆకాంక్ష. అభివృద్ధి జరగాలంటే స్థిరమైన ప్రభుత్వం కొనసాగాలి,” అని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుతామని వెల్లడించారు. గత పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని పునఃనిర్మాణం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. గ్రామసభలు కేవలం రూపకల్పనలుగా కాకుండా నిజమైన మార్పు తీసుకురావాలని ఆయన అన్నారు. ముఖ్యంగా, సూపర్ సిక్స్ హామీలను సూపర్ సక్సెస్గా అమలు చేసిన ఘనత NDA ప్రభుత్వానికి చెందినదని అన్నారు. పెన్షన్ల కోసం రాష్ట్రం ఖర్చు చేసే మొత్తం ఏ దేశంలో మరే రాష్ట్రం చేయడం లేదని తెలిపారు. ఏపీ రాష్ట్రం ప్రతి ఏడాది 33,000 కోట్ల రూపాయల పెన్షన్లు అందిస్తోంది. వీటిలో 59% లాభాలు మహిళలకు లభిస్తున్నాయి. రైతుల సంక్షేమాన్ని కాపాడేందుకు, నీరు, విద్యుత్, ఎరువులు సమృద్ధిగా అందించే ఏర్పాట్లను చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ నుంచి వచ్చే నీటిని సమృద్ధిగా ఉపయోగించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ త్వరలో పూర్తి చేస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!