Mysterious Disease: కోళ్లకు అంతుచిక్కని వ్యాధి..! రైతుల్లో ఆందోళన.. చికెన్ తినొచ్చా..?
- కోళ్లకు అంతుచిక్కని వ్యాధి..
- ఆందోళనలో గోదావరి జిల్లాల పౌల్ట్రీ రైతులు..
- కోళ్లను బతికించడానికి భారీగా ఖర్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mysterious Disease: కోళ్లకు అంతుచిక్కని వ్యాధిపై గోదావరి జిల్లాల పౌల్ట్రీ రైతులు ఆందోళన చెందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని పౌల్ట్రీలకు ఈ వ్యాధి లేకపోయినా కొన్నిచోట్ల జాడ కనిపిస్తుంది. అంతుచిక్కని వైరస్ కోళ్లకు వ్యాపించడంతో పౌల్ట్రీ రైతులు ఆందోళనలో ఉన్నారు. ఒక్కో కోడి 300 రూపాయలు వరకు ధర ఉండగా.. అవి మృత్యు వాత పడకుండా రక్షించుకునేందుకు టీకాలు వేయిస్తున్నారు. లక్ష కోళ్లు పెంచేందుకు 3 కోట్ల రూపాయలు వరకు పెట్టు బడి అవుతుండగా అధికశాతం రైతులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారే.. మాంసం కోసం 45 రోజులపాటు పెంచే బ్రాయిలర్ కోళ్లు ఉమ్మడి గోదావరి జిల్లాలో కోటి వరకు ఉంటాయి. ఒక బ్రాయిలర్ కోడి రెండు కిలోల వరకు తయారయ్యేందుకు 200 రూపాయలు వరకు ఖర్చ వుతుంది. నిన్నమొన్నటి వరకు కిలో చికెన్ ధర 140 రూపాయలు వరకు ఉండడంతో లాభాలపై ఆశలు పెట్టుకున్నారు.
Read Also: AAP vs BJP: ఢిల్లీ ఎన్నికల పోలింగ్ లో ఉద్రిక్తత.. కొట్టుకున్న ఆప్- బీజేపీ పార్టీల కార్యకర్తలు
Also Read
- Jakkampudi Raja Protest: పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన జక్కంపూడి..
- Anantha Babu Case: జైల్లో ఇంటి భోజనం కోరిన అనంతబాబు.. కోర్టు కీలక ఆదేశాలు
- Minister Nimmala Ramanaidu: జగన్ పాలనపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు.. మేనమామనని చెప్పి మోసం చేశారు..!
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై పవన్ కల్యాణ్.. రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు
అయితే, కొత్త వైరస్ తో ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు పౌల్ట్రీ రైులు.. కోళ్ల మృత్యువాతతో నష్టపోతున్న రైతులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అనపర్తి, కొవ్వూరు ప్రాంతాల్లో కొన్నిచోట్ల కోళ్లలో వైరస్ జాడలు కనిపించాయి. ప్రస్తుతం వైరస్ ప్రభావం వల్ల గుడ్లు, మాంసం తినే ప్రజల ఆరో గ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రజలంతా నిశ్చింతగా తినవచ్చు. మన దేశంలో ఉడక బెట్టినవి తినడం అలవాటు. ఇప్పటివరకు ఎవరికీ కోళ్ల వల్ల ఇబ్బందికలిగిన దాఖలాలు లేవు అంటున్నారు పశుసంవర్ధకశాఖ అధికారులు. పెరవలి మండలం కానూరు అగ్రహారంలో 80 కోళ్ల నుంచి నమూనాలు సేకరించి మధ్యప్రదేశ్ లోని భోపాల్ కేంద్రీయ ప్రయో గశాలకు పంపడం జరిగిందని చెబుతున్నారు తూర్పుగోదావరి జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి శ్రీనివాసరావు..
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!