AAP vs BJP: ఢిల్లీ ఎన్నికల పోలింగ్ లో ఉద్రిక్తత.. కొట్టుకున్న ఆప్- బీజేపీ పార్టీల కార్యకర్తలు
- ఢిల్లీలో కొనసాగుతున్న పోలింగ్.. పలు చోట్ల ఉద్రిక్తత!..
- పోలీసుల సహాయంతో ఓటింగ్ ప్రక్రియను బీజేపీ అడ్డుకుంటుంది: ఆప్
- ఆమ్ ఆద్మీ పార్టీ దొంగ ఓట్లు, డబ్బులు పంపిణీ చేస్తుంది: బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AAP vs BJP: ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. పోలింగ్ కేంద్రాలలో నగదు పంపిణీతో పాటు దొంగ ఓట్లు వేస్తున్నారని ఇర పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. సీలంపూర్ నియోజక వర్గంలో బురఖా ముసుగులో దొంగ ఓట్లు చేసేందుకు ప్రయతిస్తున్నారని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. పోలీసులు రోడ్డును దిగ్బంధించి, ఓటర్లు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తుంది. ఇప్పుడు బీజేపీకి మద్దతుగా పోలీసులు ఓటింగ్ను ఆపడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారని మండిపడింది. దీంతో ఆప్- బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
Read Also: Nani: జపాన్ లో రిలీజ్ కు రెడీ అవుతున్న నేచురల్ స్టార్ నాని మూవీ
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
ఇక, ఢిల్లీలో ప్రస్తుతం నెలకున్న పరిస్థితులపై ఆప్ తరపున గ్రేటర్ కైలాష్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ, చిరాగ్ పోలింగ్ బూత్లో ప్రజలు ఓటు వేయకుండా ఢిల్లీ పోలీసులు ఆపడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పోలింగ్ బూత్లలో బీజేపీ ప్రచార సామగ్రిని బహిరంగంగా ఉంచారని పేర్కొన్నారు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం ఇచ్చిన ఏమీ చేయడం లేదని వాపోయారు. ఇంత జరుగుతున్నా.. ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందని సౌరభ్ భరద్వాజ్ ప్రశ్నించారు.
Read Also: South Coastal Zone: విశాఖపట్నం కేంద్రంగా 410 కి.మీ పరిధితో కొత్త జోన్ ఏర్పాటు
అలాగే, అత్యంత సున్నితమైన ప్రాంతమైన రాష్ట్రపతి భవన్ సమీపంలోని బూత్ నంబర్ 27 N బ్లాక్లో బీజేపీ గూండాలు డబ్బులు పంచుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సంజయ్ సింగ్ ఆరోపించారు. నేను అక్కడికి చేరుకునేసరికి వారు అక్కడి నుంచి పారిపోయారని పేర్కొన్నాడు. ప్రతి ఒక్క ఓటరు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చి ప్రజాస్వామ్యంలో మనకు ఉన్న అత్యంత శక్తివంతమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మెరుగైన సౌకర్యాల కోసం.. గూండాయిజానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించే వారికి వ్యతిరేకంగా ఓటు వేయండి అంటూ సంజయ్ సింగ్ పిలుపునిచ్చారు.
VIDEO | Delhi Assembly Elections 2025: Uproar outside a polling booth in Seelampur as BJP alleges fake voting. Police jostle to maintain peace. #DelhiElections2025 #DelhiElectionsWithPTI pic.twitter.com/ldxATD8N4k
— Press Trust of India (@PTI_News) February 5, 2025
#WATCH | #DelhiElections2025 | AAP candidate from Greater Kailash Assembly seat, Saurabh Bharadwaj alleges Delhi Police is trying to stop people from casting their votes at a polling station in Chirag Delhi.
He says "You have been standing here since morning to influence… pic.twitter.com/FQvoVEYO8g
— ANI (@ANI) February 5, 2025
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?