Somu Veerraju: కేంద్రం సహకారంతో ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతోంది..
- ఏపీలో కూటమి ప్రభుత్వం ఏమి కోరితే అది మంజూరు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది
- ఏపీలో అభివృద్ది పరుగులు పెడుతోంది- సోము వీర్రాజు
- విశాఖ ఉక్కుకు 11,440 కోట్ల ప్యాకేజీ కేంద్రం ప్రకటించడం రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుంది
- విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయమని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం- సోము వీర్రాజు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏమి కోరితే అది మంజూరు చేసేందుకు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం సిద్ధంగా ఉందని బీజేపీ కేంద్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీలో అభివృద్ది పరుగులు పెడుతోందని అన్నారు. రాజమండ్రిలో సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ ఉక్కుకు రూ.11,440 కోట్ల ప్యాకేజీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయమని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లు రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా పనిచేస్తున్నారని కితాబ్ ఇచ్చారు.
Read Also: Korukonda Temple: ప్రసిద్ధ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం ప్రాంగణంలో అపచారం..
Also Read
- Jakkampudi Raja Protest: పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన జక్కంపూడి..
- Anantha Babu Case: జైల్లో ఇంటి భోజనం కోరిన అనంతబాబు.. కోర్టు కీలక ఆదేశాలు
- Minister Nimmala Ramanaidu: జగన్ పాలనపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు.. మేనమామనని చెప్పి మోసం చేశారు..!
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై పవన్ కల్యాణ్.. రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు
ఇప్పటికే కేంద్రం రాజధాని అమరావతికి, పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేసిందని సోము వీర్రాజు తెలిపారు. రూ.75 వేల కోట్లతో జాతీయ రహదారులు అభివృద్ది చేస్తున్నామని అన్నారు. అమరావతి రాజధానికి 15 వేల కోట్లు కాకుండా.. రింగ్ రోడ్డుకు అదనంగా 18 వేల కోట్లు కేంద్రం మంజూరు చేసిందని వివరించారు. మరోవైపు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను రాష్ట్రానికి రావడానికి వీల్లేదు అనడానికి కాంగ్రెస్ అధ్యక్షరాలు షర్మిలకు హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ హయాంలోనే విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో కూరుకుపోయిందని సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా చెందుతుంటే.. సూపర్ సిక్స్ పథకాలు అమలు జరగడం లేదని వైసీపీ విమర్శలపై మండిపడ్డారు సోము వీర్రాజు. వైసీపీ ప్రభుత్వ హయంలో అన్నీ సంక్షేమ పథకాలు అమలు చేసినట్టు చెప్పుకుంటున్న వైసీపీకి.. 11 సీట్లే ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే ముందు 11 సీట్లే ఎందుకు ఇచ్చారో.. మాజీ సీఎం జగన్ ఒకసారి ఆలోచించుకోవాలని సలహా ఇచ్చారు. డబుల్ ఇంజన్ సర్కార్తో అనేక సమస్యలు పరిష్కారం అవుతున్నాయని సోము వీర్రాజు వెల్లడించారు
తాజావార్తలు
-
OG 2: ‘ఓజీ’ యూనివర్స్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్.. సుజీత్ ప్లాన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
-
PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
-
Donald Trump: ట్రంప్ మైండ్లో ఒబామా ‘రెంట్ ఫ్రీ’ సూట్.. వయసు తప్పులో కాలేసి బుక్కయిన అమెరికా ప్రెసిడెంట్!
-
Tilak Varma: వైస్ కెప్టెన్ అయితే స్థానం పదిలం అనుకుంటున్నావా..? తిలక్ వర్మపై ఘాటు వ్యాఖ్యలు..
-
HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!