Somu Veerraju: కేంద్రం సహకారంతో ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతోంది..
- ఏపీలో కూటమి ప్రభుత్వం ఏమి కోరితే అది మంజూరు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది
- ఏపీలో అభివృద్ది పరుగులు పెడుతోంది- సోము వీర్రాజు
- విశాఖ ఉక్కుకు 11,440 కోట్ల ప్యాకేజీ కేంద్రం ప్రకటించడం రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుంది
- విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయమని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం- సోము వీర్రాజు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏమి కోరితే అది మంజూరు చేసేందుకు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం సిద్ధంగా ఉందని బీజేపీ కేంద్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీలో అభివృద్ది పరుగులు పెడుతోందని అన్నారు. రాజమండ్రిలో సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ ఉక్కుకు రూ.11,440 కోట్ల ప్యాకేజీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయమని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లు రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా పనిచేస్తున్నారని కితాబ్ ఇచ్చారు.
Read Also: Korukonda Temple: ప్రసిద్ధ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం ప్రాంగణంలో అపచారం..
Also Read
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై పవన్ కల్యాణ్.. రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు
- Deputy CM Pawan Kalyan: గోదావరి పుష్కరాలు ఏర్పాట్లపై సమీక్ష.. పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి
- MLC AnanthaBabu: ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ రద్దు చేసిన కోర్టు
- CM Chandrababu: మహిళా బిల్లును అడ్డుకోవడం పెద్ద విద్రోహం..
ఇప్పటికే కేంద్రం రాజధాని అమరావతికి, పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేసిందని సోము వీర్రాజు తెలిపారు. రూ.75 వేల కోట్లతో జాతీయ రహదారులు అభివృద్ది చేస్తున్నామని అన్నారు. అమరావతి రాజధానికి 15 వేల కోట్లు కాకుండా.. రింగ్ రోడ్డుకు అదనంగా 18 వేల కోట్లు కేంద్రం మంజూరు చేసిందని వివరించారు. మరోవైపు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను రాష్ట్రానికి రావడానికి వీల్లేదు అనడానికి కాంగ్రెస్ అధ్యక్షరాలు షర్మిలకు హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ హయాంలోనే విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో కూరుకుపోయిందని సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా చెందుతుంటే.. సూపర్ సిక్స్ పథకాలు అమలు జరగడం లేదని వైసీపీ విమర్శలపై మండిపడ్డారు సోము వీర్రాజు. వైసీపీ ప్రభుత్వ హయంలో అన్నీ సంక్షేమ పథకాలు అమలు చేసినట్టు చెప్పుకుంటున్న వైసీపీకి.. 11 సీట్లే ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే ముందు 11 సీట్లే ఎందుకు ఇచ్చారో.. మాజీ సీఎం జగన్ ఒకసారి ఆలోచించుకోవాలని సలహా ఇచ్చారు. డబుల్ ఇంజన్ సర్కార్తో అనేక సమస్యలు పరిష్కారం అవుతున్నాయని సోము వీర్రాజు వెల్లడించారు
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!