Education Minister: ‘‘కొంతమంది విద్యార్థులు లవ్ ఎఫైర్స్ వల్ల మరణిస్తున్నారు’’.. కోట సూసైడ్పై వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Education Minister: కోచింగ్ సెంటర్లకు కేరాఫ్గా ఉన్న రాజస్థాన్ కోటా పట్టణంలో గత కొన్నేళ్లుగా విద్యార్థుల ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఒత్తిడికి లోనవుతున్న విద్యార్థులు తనువు చాలిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ ఆత్మహత్యలపై రాజస్థాన్ విద్యా శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. ఈ ఆత్మహత్యలకు విద్యాపరమైన ఒత్తిడి, కొన్ని సందర్భాల్లో ప్రేమ వ్యవహారాలు కూడా కారణమవుతున్నాయని అన్నారు.
రాష్ట్రంలోని బుండిలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి మదన్ దిలావర్ మాట్లాడారు. విద్యార్థుల ఆత్మహత్యల గురించి ప్రశ్నించగా..‘‘ తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలని, వారు చదువుల్లో రాణించడానికి వారిపై అధిక ఒత్తిడి పెట్టకుండా ఉండాలి’’ అని దిలావర్ అన్నారు.
Also Read
- Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
- Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
- Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
- Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
Read Also: Mahakumbh Mela: సీఎం యోగితో ఇటలీ బృందం భేటీ.. ఎంత చక్కగా “రామభజన” పాడారో చూడండి..
‘‘నా మాటలు కొంతమందికి చికాకు కలిగించినప్పటికీ, తల్లిదండ్రులు శ్రద్ధగా, జాగ్రత్తగా ఉండాలని, తమ పిల్లపై ఎక్కువ ఒత్తిడి పెట్టొద్దని నేను నిజాయితీగా కోరుతున్నాను’’ అని మంత్రి కోరారు. కొన్ని సందర్భాల్లో ప్రేమ వ్యవహారాలు కూడా ఆత్మహత్యలకు కారణమవుతున్నాయని చెప్పారు. అలాంటి సంబంధాల్లో ఉండే విద్యార్థులు భావోద్వేగ సమస్యల్ని ఎదుర్కోవచ్చని, కొన్నిసార్లు ఆత్మహత్య వంటి తీవ్రమైన చర్యలకు దారి తీయొచ్చని చెప్పారు.
“కోచింగ్ సెంటర్లలోనే కాదు, ప్రతిచోటా ప్రజలు ఆత్మహత్య చేసుకోకుండా ఉండటానికి ప్రభుత్వం తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలోని సంఖ్యలతో పోలిస్తే ఆత్మహత్యల సంఖ్య అంత ఎక్కువగా లేదు. ఆత్మహత్యలకు కోచింగ్ సెంటర్లను నేను నిందించను,’’ అని అన్నారు.
విద్యార్థులకు పోటీ పరీక్షలకు సిద్ధం చేసే కోచింగ్ సెంటర్లకు కోటా ప్రసిద్ధి చెందింది. అయితే, విద్యార్థుల ఆత్మహత్యలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. నివేదికల ప్రకారం, 2025లో ఇప్పటికే నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని మరణించారు. 2024లో, కనీసం 20 ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి. 2023లో ఆత్మహత్యల సంఖ్య 27గా ఉంది.
తాజావార్తలు
-
Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
-
Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
-
Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
-
Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!