Education Minister: ‘‘కొంతమంది విద్యార్థులు లవ్ ఎఫైర్స్ వల్ల మరణిస్తున్నారు’’.. కోట సూసైడ్పై వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Education Minister: కోచింగ్ సెంటర్లకు కేరాఫ్గా ఉన్న రాజస్థాన్ కోటా పట్టణంలో గత కొన్నేళ్లుగా విద్యార్థుల ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఒత్తిడికి లోనవుతున్న విద్యార్థులు తనువు చాలిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ ఆత్మహత్యలపై రాజస్థాన్ విద్యా శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. ఈ ఆత్మహత్యలకు విద్యాపరమైన ఒత్తిడి, కొన్ని సందర్భాల్లో ప్రేమ వ్యవహారాలు కూడా కారణమవుతున్నాయని అన్నారు.
రాష్ట్రంలోని బుండిలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి మదన్ దిలావర్ మాట్లాడారు. విద్యార్థుల ఆత్మహత్యల గురించి ప్రశ్నించగా..‘‘ తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలని, వారు చదువుల్లో రాణించడానికి వారిపై అధిక ఒత్తిడి పెట్టకుండా ఉండాలి’’ అని దిలావర్ అన్నారు.
Also Read
- IMD Yellow Alert: నిప్పుల కొలిమిలా ఉత్తర భారతం.. ఢిల్లీలో 45 డిగ్రీల దాకా చేరిన ఉష్ణోగ్రతలు.. ఐఎండి తీవ్ర హెచ్చరిక!
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Rishikesh Train Accident: రిషికేశ్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. దేవుడిలా కాపాడిన ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా?
- Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
Read Also: Mahakumbh Mela: సీఎం యోగితో ఇటలీ బృందం భేటీ.. ఎంత చక్కగా “రామభజన” పాడారో చూడండి..
‘‘నా మాటలు కొంతమందికి చికాకు కలిగించినప్పటికీ, తల్లిదండ్రులు శ్రద్ధగా, జాగ్రత్తగా ఉండాలని, తమ పిల్లపై ఎక్కువ ఒత్తిడి పెట్టొద్దని నేను నిజాయితీగా కోరుతున్నాను’’ అని మంత్రి కోరారు. కొన్ని సందర్భాల్లో ప్రేమ వ్యవహారాలు కూడా ఆత్మహత్యలకు కారణమవుతున్నాయని చెప్పారు. అలాంటి సంబంధాల్లో ఉండే విద్యార్థులు భావోద్వేగ సమస్యల్ని ఎదుర్కోవచ్చని, కొన్నిసార్లు ఆత్మహత్య వంటి తీవ్రమైన చర్యలకు దారి తీయొచ్చని చెప్పారు.
“కోచింగ్ సెంటర్లలోనే కాదు, ప్రతిచోటా ప్రజలు ఆత్మహత్య చేసుకోకుండా ఉండటానికి ప్రభుత్వం తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలోని సంఖ్యలతో పోలిస్తే ఆత్మహత్యల సంఖ్య అంత ఎక్కువగా లేదు. ఆత్మహత్యలకు కోచింగ్ సెంటర్లను నేను నిందించను,’’ అని అన్నారు.
విద్యార్థులకు పోటీ పరీక్షలకు సిద్ధం చేసే కోచింగ్ సెంటర్లకు కోటా ప్రసిద్ధి చెందింది. అయితే, విద్యార్థుల ఆత్మహత్యలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. నివేదికల ప్రకారం, 2025లో ఇప్పటికే నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని మరణించారు. 2024లో, కనీసం 20 ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి. 2023లో ఆత్మహత్యల సంఖ్య 27గా ఉంది.
తాజావార్తలు
-
Investment Tips: హోమ్ లోన్ తీర్చాలా? ఇన్వెస్ట్ చేయాలా? చేతికి బోనస్ వస్తే ఏది బెస్ట్ ఆప్షన్! నిపుణులు చెబుతున్నది ఇదే..
-
Ishan Kishan Celebration: స్టేడియం ఖాళీ చేయండి, ఇంటికి వెళ్లిపోండి.. సీఎస్కే అభిమానులను అవమానించిన ఇషాన్ ఇషాన్!
-
Chand Mera Dil: అనన్యా పాండే మూవీకి సెన్సార్ షాక్..10 సెకన్ల కిస్ సీన్ డిలీట్
-
Washing Machine Tips: వాషింగ్ మెషీన్లో ఈ 2 పదార్థాలు కలిపితే చాలు.. మీ బట్టలు కొత్తవాటిలా మెరిసిపోతాయి..!
-
IMD Yellow Alert: నిప్పుల కొలిమిలా ఉత్తర భారతం.. ఢిల్లీలో 45 డిగ్రీల దాకా చేరిన ఉష్ణోగ్రతలు.. ఐఎండి తీవ్ర హెచ్చరిక!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!