Adireddy Vasu: రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా జగన్ కుట్ర..!
- ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు రాకుండా జగన్ కుట్ర.. పెట్టుబడి పెట్టేందుకు వస్తున్న పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను..
- భయభ్రాంతులకు గురి చేసేలా వైఎస జగన్ చర్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adireddy Vasu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను భయభ్రాంతులకు గురి చేసేలా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దురుద్దేశంతో, కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పరామర్శల పేరుతో వైఎస్ జగన్.. రాష్ట్ర ప్రజలను భయపెట్టేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి రాగానే రప్పా.. రప్పా.. తలలు నరుకుతామని అనడంలో వారి ఉద్దేశ్యం ఏమిటని ప్రశ్నించారు. పైగా ఆ వ్యాఖ్యలను జగన్ ఖండిం కుండా పుష్పా సినిమా డైలాగులు అని వెటకారంగా చెప్పడం తగదని హితవు పలికారు. అధికారంలో ఉన్న ఐదేళ్లు రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ, పెట్టుబడులు తీసుకురాని వైఎస్ జగన్.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో వస్తున్న పెట్టుబడిదారులను ఉద్దేశ పూర్వకంగా భయపెట్టాలని పర్యాటనల పేరుతో బలప్రదర్శనలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుదని ఆయన హెచ్చరించారు. జగన్ తన వాహనం కిందపడి నలిగిపోతున్న సింగయ్య అనే కార్యకర్తను పట్టించుకోకుండా వాహనం ముందుకు పోనిచ్చారంటే అతనికి మానవత్వం లేదని అర్థమవుతుందని మండిపడ్డారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు.
Read Also: TG High Court: స్థానిక సంస్థల ఎన్నికలపై తీర్పు రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు
Also Read
- MLC AnanthaBabu: ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ రద్దు చేసిన కోర్టు
- CM Chandrababu: మహిళా బిల్లును అడ్డుకోవడం పెద్ద విద్రోహం..
- Dead Body Door Delivery Case: ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు షాక్.. పిటిషన్ కొట్టివేసిన కోర్టు..
- Governor Abdul Nazeer: నేడు ఆదికవి నన్నయ్య వర్సిటీ స్నాతకోత్సవం.. ముఖ్య అతిథిగా గవర్నర్
తాజావార్తలు
-
Virat Kohli: ఈ ముగ్గురు బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం.. నా వల్ల కాదు: విరాట్ కోహ్లీ
-
Ebola outbreak: ఎబోలా వైరస్పై భారత్ అప్రమత్తం.. ఇండో-ఆఫ్రికా సదస్సు రద్దు..
-
Viral: వైద్యుడి నిర్లక్ష్యానికి ప్రాణం బలి.. కుడి కిడ్నీకి బదులు ఎడమ కిడ్నీ తొలగింపు.. రూ. 2 కోట్ల పరిహారం విధించిన NCDRC..
-
IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
-
New Railway Line: తెలంగాణకు కేంద్రం మరో బంపర్ గిఫ్ట్.. రూ.5,818 కోట్లతో కొత్త రైల్వే లైన్.!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!