Kurasala Kannababu: మీ భాగస్వామ్య పక్షాలే మిమ్మల్ని కడిగేస్తున్నారు..! సమాధానం చెప్పగలిగారా ..?
- మీ భాగస్వామి పక్షాలే మిమ్మల్ని కడిగేస్తున్నారు..
- కనీసం దానికైనా సమాధానం చెప్పగలిగారా ..?..
- సీఎం చంద్రబాబును నిలదీసిన కురసాల కన్నబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kurasala Kannababu: మీ భాగస్వామి పక్షాలే మిమ్మల్ని కడిగేస్తున్నారు.. కనీసం దానికైనా సమాధానం చెప్పగలిగారా ..? అంటూ సీఎం చంద్రబాబును నిలదీశారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖత్ లో కలిసిశారు మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు, మేరుగు నాగార్జున.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కురసాల కన్నబాబు.. చంద్రబాబు అధికారంలోకి వస్తే కక్ష సాధించాలనుకునే కుటుంబాల్లో మేం ఉన్నామని గతంలోనే మిథున్ రెడ్డి చెప్పారని అన్నారు. వైసీపీ నాయకులపై కక్ష సాధిస్తామని గతంలోనే లోకేష్ ఊరువాడ తిరిగి చెప్పాడని గుర్తు చేశారు. దీనికి అనుగుణంగానే అరెస్టులు జరుగుతున్నాయని తెలిపారు. వైఎస్ జగన్ ఇచ్చిన పథకాలకంటే అధికంగా ఇస్తానని చంద్రబాబు చెప్పిన తప్పుడు మాటలు ప్రజలు నమ్మారని అన్నారు. వీటిని అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు అమలు చేస్తున్నారని ఆరోపించారు.. అయితే, వైసీపీలో అరెస్టులకు భయపడేవారు ఎవరూ లేరన్నారు. వైఎస్ జగన్ ఎప్పటికే డిజిటల్ బుక్ గురించి చెప్పారని తెలిపారు. వైసీపీ నేతలకు కాదు బాధితులు ఎవరైనా సరే తమ ఆవేదనను డిజిటల్ బుక్ లో నమోదు చేసుకోవచ్చునని అన్నారు. అసలు మీ గురించి, నీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏమంటున్నారో రహస్యంగా తెలుసుకోండని విజ్ఞప్తి చేశారు. మీ భాగస్వామి పక్షాలే మిమ్మల్ని కడిగేస్తున్నారని విమర్శించారు.. కనీసం దానికైనా సమాధానం చెప్పగలిగారా ..? ఇది కాదు పరిపాలన… తప్పుదారిలో వెళుతున్నామని మీ నేతలే మాట్లాడుకుంటున్నారని అన్నారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు..
Read Also: Devendra Fadnavis: బీజేపీ అధ్యక్షుడు ఎంపికపై ఫడ్నవిస్ కీలక వ్యాఖ్యలు
Also Read
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Jakkampudi Raja Protest: పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన జక్కంపూడి..
- Anantha Babu Case: జైల్లో ఇంటి భోజనం కోరిన అనంతబాబు.. కోర్టు కీలక ఆదేశాలు
- Minister Nimmala Ramanaidu: జగన్ పాలనపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు.. మేనమామనని చెప్పి మోసం చేశారు..!
ఇక, మాజీ మంత్రి మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం గురించి తెలిసిన ప్రతి వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూసి బాధపడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వెర్రితలలు వేస్తుందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా పాలన జరుగుతుందని విమర్శించారు. కుట్రలు, కుతంత్రాలతో రాష్ట్రాన్ని పాలిస్తున్నారని.. రాష్ట్ర పగ్గాలను కొడుకు చేతిలో పెట్టి నడిపిస్తున్నారని అన్నారు. లేని లిక్కర్ కేసులు పెట్టి మా నాయకుల్ని అరెస్టు చేశారని మండిపడ్డారు.. సాధారణంగా కొండను తవ్వి ఎలుకను పట్టారు అంటారు.. కానీ, ఈ కేసులో ఎలుక కూడా లేదని అన్నారు. ఏపీలో గత ప్రభుత్వంలో లిక్కర్ స్కాం జరగలేదని వివరణ ఇచ్చారు. మద్యం విషయంలో ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అక్రమాలు చేసుకుంటున్నాయని ఆరోపించారు. గత ప్రభుత్వంలో వచ్చిన ఆదాయంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వంలో చాలా తక్కువ ఆదాయం వస్తుందని అన్నారు.. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజాస్వామ్యబద్ధంగా నడిచిందని అన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం ఏ ఒక్క రంగంలో కూడా అభివృద్ధి కనిపించడం లేదన్నారు. మెడికల్ కళాశాల ప్రైవేటుపరం చేయడానికి తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు.. మా నాయకుడు ధైర్యంగా ఉన్నాడని, రానున్న రోజుల్లో మద్యం కేసు కూటమి నాయకులకు చెంపపెట్టు కానుందని అన్నారు. మేం ఎకౌంటబులిటీతో పని చేసాం… అదే మాకు శ్రీరామరక్ష అంటున్నారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున.
తాజావార్తలు
-
PAKISTAN: పెట్రోల్ ధరల మంట.. పాకిస్థాన్లో రోడ్డెక్కిన వేలాది మంది
-
IRCTC: తత్కాల్ టికెట్ దొరకలేదని బాధపడొద్దు.. మీకు ఈ ఆప్షన్ ఉందని తెలుసా!
-
Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
-
Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!