Ganesh Nimajjanam 2024: వరుసగా రెండో రోజూ నిలిచిన గణేష్ నిమజ్జనాలు.. విగ్రహాలు వెనక్కి పంపుతున్న పోలీసులు..
- గోదావరిలో వరద ఉధృతి..
- రెండో రోజూ నిలిచిపోయిన గణేష్ నిమజ్జనాలు..
- నిమజ్జనానికి ఊరేగింపులతో వస్తున్న కొందరు భక్తులు..
- గణేష్ విగ్రహాలు వెనక్కి పంపుతున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganesh Nimajjanam 2024: గోదావరి వరద ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా నదిలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు నిలిపివేశారు.. దీంతో వరుసగా రెండో రోజూ కూడా గణేష్ నిమజ్జనాలు గోదావరిలో చేయడాన్ని నిలుపు వేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా నిమజ్జనానికి ఊరేగింపులతో గణేష్ విగ్రహాలు తీసుకుని వస్తున్న వాటిని పోలీసులు వెనక్కి తిప్పి పంపిస్తున్నారు.. అయితే, గోదావరి ఉధృతి క్రమంగా తగ్గుతోన్న తరుణంలో.. ఈనెల 13వ తేదీ నుండి గణేష్ నిమజ్జనాలకు అనుమతి ఉన్నట్లు ప్రకటించారు అధికారులు… ప్రతీ ఏడాది గణేష్ నిమజ్జనాలు నిర్వహించే ఇసుక ర్యాంపు వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
Read Also: Cloud kitchens: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. అందుబాటులోకి క్లౌడ్ కిచెన్లు
Also Read
- MLC AnanthaBabu: ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ రద్దు చేసిన కోర్టు
- CM Chandrababu: మహిళా బిల్లును అడ్డుకోవడం పెద్ద విద్రోహం..
- Dead Body Door Delivery Case: ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు షాక్.. పిటిషన్ కొట్టివేసిన కోర్టు..
- Governor Abdul Nazeer: నేడు ఆదికవి నన్నయ్య వర్సిటీ స్నాతకోత్సవం.. ముఖ్య అతిథిగా గవర్నర్
నేడు కూడా వరద ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా గోదావరి నదిలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు నిలిపివేసినట్టు వెల్లడించారు.. వరుసగా రెండు రోజులు నిలిచిపోయాయి గణేష్ నిమజ్జనాలు.. గోదావరి ఉదృతంగా ప్రవహిస్తున్న కారణంగా ఎవరు గోదావరిలో స్నానం చేయడానికి గాని, బట్టలు ఉతకడానికి గానీ, గణేష్ నిమజ్జనాలు చేయడానికి గాని నదిలోకి వెళ్ళవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు.. నిలకడగా కొనసాగుతోంది గోదావరి వరద ఉధృతి.. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 15.30 అడుగుల వద్ద నిలకడగా గోదావరి వరద ప్రవాహం ఉంది.. బ్యారేజ్ నుండి 15 లక్షల 33 వేల 339 క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.. అయితే, రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.. భద్రాచలం వద్ద నిన్న సాయంత్రం నుండి గోదావరి వరద ప్రవాహం తగ్గుతూ వస్తుంది.. ఈ రోజు భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కూడా ఉపసంహరించనున్నారు.. భద్రాచలం వద్ద 44.60 అడుగుల గోదావరి నీటిమట్టం ఉండగా.. 43 అడుగులకు తగ్గితే మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ ప్రకటిస్తారు.. ఎగువ ప్రాంతాల్లో తగ్గుతున్న కారణంగా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కూడా తగ్గుముఖం పడుతుందని భావిస్తున్నారు ఇరిగేషన్ అధికారులు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!