Ganesh Nimajjanam 2024: వరుసగా రెండో రోజూ నిలిచిన గణేష్ నిమజ్జనాలు.. విగ్రహాలు వెనక్కి పంపుతున్న పోలీసులు..
- గోదావరిలో వరద ఉధృతి..
- రెండో రోజూ నిలిచిపోయిన గణేష్ నిమజ్జనాలు..
- నిమజ్జనానికి ఊరేగింపులతో వస్తున్న కొందరు భక్తులు..
- గణేష్ విగ్రహాలు వెనక్కి పంపుతున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganesh Nimajjanam 2024: గోదావరి వరద ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా నదిలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు నిలిపివేశారు.. దీంతో వరుసగా రెండో రోజూ కూడా గణేష్ నిమజ్జనాలు గోదావరిలో చేయడాన్ని నిలుపు వేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా నిమజ్జనానికి ఊరేగింపులతో గణేష్ విగ్రహాలు తీసుకుని వస్తున్న వాటిని పోలీసులు వెనక్కి తిప్పి పంపిస్తున్నారు.. అయితే, గోదావరి ఉధృతి క్రమంగా తగ్గుతోన్న తరుణంలో.. ఈనెల 13వ తేదీ నుండి గణేష్ నిమజ్జనాలకు అనుమతి ఉన్నట్లు ప్రకటించారు అధికారులు… ప్రతీ ఏడాది గణేష్ నిమజ్జనాలు నిర్వహించే ఇసుక ర్యాంపు వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
Read Also: Cloud kitchens: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. అందుబాటులోకి క్లౌడ్ కిచెన్లు
Also Read
- Jakkampudi Raja Protest: పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన జక్కంపూడి..
- Anantha Babu Case: జైల్లో ఇంటి భోజనం కోరిన అనంతబాబు.. కోర్టు కీలక ఆదేశాలు
- Minister Nimmala Ramanaidu: జగన్ పాలనపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు.. మేనమామనని చెప్పి మోసం చేశారు..!
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై పవన్ కల్యాణ్.. రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు
నేడు కూడా వరద ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా గోదావరి నదిలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు నిలిపివేసినట్టు వెల్లడించారు.. వరుసగా రెండు రోజులు నిలిచిపోయాయి గణేష్ నిమజ్జనాలు.. గోదావరి ఉదృతంగా ప్రవహిస్తున్న కారణంగా ఎవరు గోదావరిలో స్నానం చేయడానికి గాని, బట్టలు ఉతకడానికి గానీ, గణేష్ నిమజ్జనాలు చేయడానికి గాని నదిలోకి వెళ్ళవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు.. నిలకడగా కొనసాగుతోంది గోదావరి వరద ఉధృతి.. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 15.30 అడుగుల వద్ద నిలకడగా గోదావరి వరద ప్రవాహం ఉంది.. బ్యారేజ్ నుండి 15 లక్షల 33 వేల 339 క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.. అయితే, రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.. భద్రాచలం వద్ద నిన్న సాయంత్రం నుండి గోదావరి వరద ప్రవాహం తగ్గుతూ వస్తుంది.. ఈ రోజు భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కూడా ఉపసంహరించనున్నారు.. భద్రాచలం వద్ద 44.60 అడుగుల గోదావరి నీటిమట్టం ఉండగా.. 43 అడుగులకు తగ్గితే మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ ప్రకటిస్తారు.. ఎగువ ప్రాంతాల్లో తగ్గుతున్న కారణంగా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కూడా తగ్గుముఖం పడుతుందని భావిస్తున్నారు ఇరిగేషన్ అధికారులు.
తాజావార్తలు
-
IMD Big Alert: దేశాన్ని కమ్ముకున్న మేఘాలు.. భారీ వర్షాలకు హెచ్చరిక.. ఇస్రో చిత్రాలు విడుదల
-
Fauji vs King: బాక్సాఫీస్ వార్.. ప్రభాస్ ‘ఫౌజీ’ vs షారుఖ్ ‘కింగ్’.. వెయ్యి కోట్ల వేటలో విజేత ఎవరు?
-
KVN : విజయ్ లెగసీకి అదిరిపోయే ట్రిబ్యూట్.. ‘జన నాయకుడు’
-
CJP Protest: ‘మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి రోజు’.. ప్రాణత్యాగాలకు సిద్ధంకండి.. సీక్రెట్ యాప్పై దర్యాప్తు
-
Murali Kishor: ‘లెనిన్’ డైరెక్టర్కు బిగ్ ఛాన్స్.. సితారలోనే నెక్స్ట్ మూవీ! ఆ స్టార్ హీరో సినిమా?
ట్రెండింగ్
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!