Cloud kitchens: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. అందుబాటులోకి క్లౌడ్ కిచెన్లు
- రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల నుండి ఆహారం విషయంలో తరచుగా ఫిర్యాదులు.
- సుదూర రైళ్లలో ఆహారం నాణ్యతపై సందేహాలు.
- ఇప్పుడు భారతీయ రైల్వే ఒక పరిష్కారాన్ని కనుగొంది.
Cloud kitchens In Indian Railways: రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల నుండి ఆహారం విషయంలో తరచుగా ఫిర్యాదులు వస్తూ వుంటాయి. ముఖ్యంగా సుదూర రైళ్లలో ఆహారం నాణ్యతపై సందేహాలు తలెత్తడం సర్వసాధారణం. అయితే, ఇప్పుడు భారతీయ రైల్వే ఒక పరిష్కారాన్ని కనుగొంది. IRCTC రైలు బేస్ కిచెన్ను ఇకపై క్లౌడ్ కిచెన్గా మార్చడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది ఇప్పటికే ముంబైలో ప్రారంభమైంది.
200 క్లౌడ్ కిచెన్లు నిర్మించనున్నారు:
Also Read
- MI Vs LSG: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ పటాపంచల్..
- Vijay Anil Army: ‘అనిల్’ నుంచి అసెంబ్లీ వరకు.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఆ ‘ఈల’ వేసిన మలుపులేంటి..?
- TPCC Mahesh Goud : కేరళలో యూడీఎఫ్ ఘనవిజయం.. తెలంగాణ మోడల్ పాలనే గెలిపించిందన్న మహేష్ గౌడ్.!
- Mamata Banerjee: మమతకు బిగ్ షాక్.. భవానీపూర్లో ఘోర పరాజయం
IRCTC గత నెల నుండి కొన్ని రైళ్లలో క్లౌడ్ వంటగదిని అమలు చేసింది. పశ్చిమ రైల్వే జోన్లో 200 క్లౌడ్ కిచెన్లను ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర తర్వాత మధ్యప్రదేశ్, గుజరాత్ లలో కూడా క్లౌడ్ కిచెన్ లను ప్రారంభించనున్నారు. ముంబైలోని పోవై, కుర్లా, పన్వెల్, థానే, చెంబూర్ వంటి ప్రాంతాల్లో క్లౌడ్ కిచెన్ లను నిర్మించనున్నట్లు IRCTC సీనియర్ అధికారి తెలిపారు. కుర్లా క్లౌడ్ వంటగది ఇప్పటికే ప్రారంభమైంది. మహారాష్ట్రలో 90 క్లౌడ్ కిచెన్లను రూపొందించడంపై IRCTC దృష్టి సారిస్తోంది. వీటిలో 50 క్లౌడ్ కిచెన్ల పనులు పూర్తయ్యాయని, వాటి నుంచి రైళ్లలో ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. ఇక ముంబైలోని LBS రోడ్లో ఉన్న కుర్లా క్లౌడ్ కిచెన్లో అతిపెద్ద వంటగది ఉంది. ఇందులో 4000 మందికి భోజనం, అల్పాహారం, రాత్రి భోజనం సిద్ధం చేయవచ్చు. కుర్లాలో ఆహారాన్ని తయారు చేసిన తర్వాత దానిని కోల్డ్ స్టోరేజీ వ్యాన్లలో ఉంచి సుదూర రైళ్లలో రవాణా చేస్తారు. ఈ ఆహారం రైలు ప్యాంట్రీ కారు నుండి ప్రయాణీకులకు చేరుతుంది.
7 సంవత్సరాల ఒప్పందం:
క్లౌడ్ కిచెన్ కాంట్రాక్ట్ 7 సంవత్సరాల పాటు వివిధ క్యాటరర్లకు కేటాయించబడుతుంది. ఈ క్లౌడ్ వంటగదిలో పరిశుభ్రత, ఆహార నాణ్యత ఖచ్చితంగా పర్యవేక్షించబడతాయి. ప్రస్తుతానికి ఆహార సంబంధిత వస్తువుల కోసం రైల్వే కొన్ని ఎంపిక చేసిన స్టేషన్లపై ఆధారపడి ఉంది. ఉదాహరణకు, ముంబై బేస్ కిచెన్ CSMT, ముంబై సెంట్రల్ స్టేషన్లో ఉంది. ఇక్కడ ప్రతిరోజూ 8000 నుండి 12000 మందికి ఆహారం తయారు చేయబడుతుంది. అయితే, క్లౌడ్ వంటగదిని సృష్టించిన తర్వాత బేస్ వంటగదిపై ఆధారపడటం ఆగిపోతుంది. ఇకపోతే రాజధాని, శతాబ్ది, తేజస్, వందే భారత్ ఎక్స్ప్రెస్ లకు కూడా రైల్వే స్టేషన్లలో ఉన్న బేస్ కిచెన్ల నుండి ఆహారం సరఫరా చేయబడుతుంది. సుదూర రైళ్లలో ఆహారం తరచుగా చెడిపోతుంది. కానీ., ఇప్పుడు క్లౌడ్ కిచెన్ ఆపరేషన్ ప్రారంభమైన తర్వాత రైళ్లలో వివిధ ప్రాంతాల నుండి ఆహారాన్ని పంపిణీ చేయవచ్చు. అయితే, ఆహారంలో నాణ్యత తక్కువగా ఉన్నట్లు తేలితే క్యాటరర్లకు రూ.5000 నుంచి రూ.50,000 వరకు జరిమానా పడే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
MI Vs LSG: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ పటాపంచల్..
-
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
Indigo: టేకాఫ్ తర్వాత షాక్.. ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
-
Vijay Anil Army: ‘అనిల్’ నుంచి అసెంబ్లీ వరకు.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఆ ‘ఈల’ వేసిన మలుపులేంటి..?
-
TPCC Mahesh Goud : కేరళలో యూడీఎఫ్ ఘనవిజయం.. తెలంగాణ మోడల్ పాలనే గెలిపించిందన్న మహేష్ గౌడ్.!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!