Cloud kitchens: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. అందుబాటులోకి క్లౌడ్ కిచెన్లు
- రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల నుండి ఆహారం విషయంలో తరచుగా ఫిర్యాదులు.
- సుదూర రైళ్లలో ఆహారం నాణ్యతపై సందేహాలు.
- ఇప్పుడు భారతీయ రైల్వే ఒక పరిష్కారాన్ని కనుగొంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cloud kitchens In Indian Railways: రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల నుండి ఆహారం విషయంలో తరచుగా ఫిర్యాదులు వస్తూ వుంటాయి. ముఖ్యంగా సుదూర రైళ్లలో ఆహారం నాణ్యతపై సందేహాలు తలెత్తడం సర్వసాధారణం. అయితే, ఇప్పుడు భారతీయ రైల్వే ఒక పరిష్కారాన్ని కనుగొంది. IRCTC రైలు బేస్ కిచెన్ను ఇకపై క్లౌడ్ కిచెన్గా మార్చడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది ఇప్పటికే ముంబైలో ప్రారంభమైంది.
200 క్లౌడ్ కిచెన్లు నిర్మించనున్నారు:
Also Read
- శ్రావణంలో నాన్వెజ్ మిస్ అవుతున్నారా?.. చికెన్, మటన్కు మించిన టేస్ట్.. Soya Chunks Dry ట్రై చేయండి!
- HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
- India’s Richest Business Families: అదానీ నుంచి అంబానీ వరకు.. భారత బిజినెస్ ఫ్యామిలీల సంపద ఎంతో తెలుసా?
- India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మ్యాచ్పై బిగ్ అప్డెట్.. ఈ ఫైట్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుదంటే?
IRCTC గత నెల నుండి కొన్ని రైళ్లలో క్లౌడ్ వంటగదిని అమలు చేసింది. పశ్చిమ రైల్వే జోన్లో 200 క్లౌడ్ కిచెన్లను ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర తర్వాత మధ్యప్రదేశ్, గుజరాత్ లలో కూడా క్లౌడ్ కిచెన్ లను ప్రారంభించనున్నారు. ముంబైలోని పోవై, కుర్లా, పన్వెల్, థానే, చెంబూర్ వంటి ప్రాంతాల్లో క్లౌడ్ కిచెన్ లను నిర్మించనున్నట్లు IRCTC సీనియర్ అధికారి తెలిపారు. కుర్లా క్లౌడ్ వంటగది ఇప్పటికే ప్రారంభమైంది. మహారాష్ట్రలో 90 క్లౌడ్ కిచెన్లను రూపొందించడంపై IRCTC దృష్టి సారిస్తోంది. వీటిలో 50 క్లౌడ్ కిచెన్ల పనులు పూర్తయ్యాయని, వాటి నుంచి రైళ్లలో ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. ఇక ముంబైలోని LBS రోడ్లో ఉన్న కుర్లా క్లౌడ్ కిచెన్లో అతిపెద్ద వంటగది ఉంది. ఇందులో 4000 మందికి భోజనం, అల్పాహారం, రాత్రి భోజనం సిద్ధం చేయవచ్చు. కుర్లాలో ఆహారాన్ని తయారు చేసిన తర్వాత దానిని కోల్డ్ స్టోరేజీ వ్యాన్లలో ఉంచి సుదూర రైళ్లలో రవాణా చేస్తారు. ఈ ఆహారం రైలు ప్యాంట్రీ కారు నుండి ప్రయాణీకులకు చేరుతుంది.
7 సంవత్సరాల ఒప్పందం:
క్లౌడ్ కిచెన్ కాంట్రాక్ట్ 7 సంవత్సరాల పాటు వివిధ క్యాటరర్లకు కేటాయించబడుతుంది. ఈ క్లౌడ్ వంటగదిలో పరిశుభ్రత, ఆహార నాణ్యత ఖచ్చితంగా పర్యవేక్షించబడతాయి. ప్రస్తుతానికి ఆహార సంబంధిత వస్తువుల కోసం రైల్వే కొన్ని ఎంపిక చేసిన స్టేషన్లపై ఆధారపడి ఉంది. ఉదాహరణకు, ముంబై బేస్ కిచెన్ CSMT, ముంబై సెంట్రల్ స్టేషన్లో ఉంది. ఇక్కడ ప్రతిరోజూ 8000 నుండి 12000 మందికి ఆహారం తయారు చేయబడుతుంది. అయితే, క్లౌడ్ వంటగదిని సృష్టించిన తర్వాత బేస్ వంటగదిపై ఆధారపడటం ఆగిపోతుంది. ఇకపోతే రాజధాని, శతాబ్ది, తేజస్, వందే భారత్ ఎక్స్ప్రెస్ లకు కూడా రైల్వే స్టేషన్లలో ఉన్న బేస్ కిచెన్ల నుండి ఆహారం సరఫరా చేయబడుతుంది. సుదూర రైళ్లలో ఆహారం తరచుగా చెడిపోతుంది. కానీ., ఇప్పుడు క్లౌడ్ కిచెన్ ఆపరేషన్ ప్రారంభమైన తర్వాత రైళ్లలో వివిధ ప్రాంతాల నుండి ఆహారాన్ని పంపిణీ చేయవచ్చు. అయితే, ఆహారంలో నాణ్యత తక్కువగా ఉన్నట్లు తేలితే క్యాటరర్లకు రూ.5000 నుంచి రూ.50,000 వరకు జరిమానా పడే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Explainer: అమెరికా కుట్ర? ఏకమౌతున్న ముస్లిం దేశాలు..!
-
Annapurna Studios: ఏఎన్నార్ దార్శనికత.. నాగార్జున ఆధునికత.. అన్నపూర్ణ స్టూడియోస్కు 51 ఏళ్లు
-
South Stars Mumbai Homes : సౌత్ స్టార్స్కు సెకండ్ హోమ్గా ముంబై.. కోట్లాది రూపాయల విలువైన హౌసెస్ కొనుగోలు
-
శ్రావణంలో నాన్వెజ్ మిస్ అవుతున్నారా?.. చికెన్, మటన్కు మించిన టేస్ట్.. Soya Chunks Dry ట్రై చేయండి!
-
Psychology facts: అర్థరాత్రి.. నిద్రపోని మనసు.. సముద్రంలో అలల్లా ఎగసిపడుతున్న ఆలోచనలకు కారణం ఇదే!
ట్రెండింగ్
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!