CM Chandrababu: మహిళా బిల్లును అడ్డుకోవడం పెద్ద విద్రోహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో సీఎం చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు.. నిడదవోలులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళా రిజర్వేషన్ బిల్లుపై మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం దేశానికి, మహిళలకు చేసిన పెద్ద విద్రోహమని వ్యాఖ్యానించారు.. కాంగ్రెస్ పార్టీతో పాటు వారి మిత్రపక్షాలు మహిళల ఆశలను ద్రోహం చేశాయని విమర్శించారు. ఇది క్షమించరాని నేరమని ఆయన అన్నారు. “మహిళల ఓట్లు అడగాలంటే ముందుగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలి. దానికి అడ్డుపడిన వారు రేపు ఏ మొఖంతో మహిళల దగ్గరకు వెళ్తారు?” అని ఆయన ప్రశ్నించారు. ప్రధానమంత్రి 2029 నాటికి మహిళలకు రిజర్వేషన్ అమలు చేయాలనే సంకల్పం ప్రకటించారని, కానీ కాంగ్రెస్ పార్టీ దీనిని వక్రీకరించి ప్రజల్లో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
Read Also: Regina: కోల్పోయాకే దాని విలువ తెలిసింది.. రెజీనా కాసాండ్రా ఎమోషనల్ పోస్ట్ వైరల్!
Also Read
- Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Jakkampudi Raja Protest: పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన జక్కంపూడి..
- Anantha Babu Case: జైల్లో ఇంటి భోజనం కోరిన అనంతబాబు.. కోర్టు కీలక ఆదేశాలు
దక్షిణ భారత రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పడం సరైంది కాదని, మహిళలందరూ ఈ బిల్లుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని అన్నారు చంద్రబాబు.. ఈ బిల్లును అడ్డుకోవడం తీరని ద్రోహమని మరోసారి స్పష్టం చేశారు. అలాగే, ఈ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కూడా చర్చించినట్లు తెలిపారు. 2017లో టీడీపీ అసెంబ్లీలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా తీర్మానం ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశంపై ప్రచారం చేపడతామని చెప్పారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలకు వివరిస్తామని, కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాకుండా చేస్తామని హెచ్చరించారు సీఎం చంద్రబాబు..
మహిళా రిజర్వేషన్ బిల్లుపై అనూహ్యంగా స్పందించిన చంద్రబాబు.. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నిరసన ర్యాలీ నిర్వహించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాల వైఖరికి నిరసనగా ఈ ర్యాలీ చేపట్టారు. హెలిప్యాడ్ నుంచి ‘స్వచ్ఛ్ ఆంధ్ర’ సభ వేదిక వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో టీడీపీ మరియు కూటమి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని, “మహిళా బిల్లు అడ్డుకోవడం ద్రోహం” అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు తో పాటు ఈ ర్యాలీలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు డగ్గుబాటి పురందేశ్వరి (మాధవ్), మంత్రి కందుల దుర్గేష్, సోము వీర్రాజు, నిమ్మల రామానాయుడు తదితర కూటమి నేతలు పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు, మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం మహిళలపై ద్రోహమని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Gautam Gambhir: లైక్స్, వ్యూస్ కాదు.. ట్రోఫీలే ముఖ్యం.. విమర్శకులకు గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్
-
Punjab: చిక్కుల్లో పంజాబ్ సీఎం మాన్ భార్య.. అత్యాచార కేసు లంచంపై ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశం
-
Mythri Movie Makers: మైత్రీ రిస్క్కు అదిరిపోయే రిజల్ట్.. ‘ఇరుముడి’ బ్లాక్బస్టర్ వెనుక ఆసక్తికర కథ!
-
Kollywood: సినిమా ఇండస్ట్రీకి సెప్టెంబర్ షాక్.. కొత్త రిలీజ్లకు బ్రేక్.. అసలు కారణం ఇదే!
-
Spirit Controversy: వంగా బ్రదర్స్ ఆరోపణలపై దీపికా పదుకొణె పరోక్ష కౌంటర్.. ఆ ఒక్క లైక్తో సంచలనం!
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!