Deputy CM Pawan Kalyan: గోదావరి పుష్కరాలు ఏర్పాట్లపై సమీక్ష.. పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: రాజమండ్రిలో గోదావరి పుష్కరాల సన్నద్ధతపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో 2027 గోదావరి పుష్కరాలు ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు, కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సమీక్ష అనంతరం నిర్వహించిన ప్రెస్మీట్లో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, గోదావరి పుష్కరాల వంటి మహత్తర ఆధ్యాత్మిక వేడుకకు ఇప్పటి వరకు సరైన స్థాయిలో సన్నద్ధత కనిపించడం లేదన్నారు. “అధికారులు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడుకి వాస్తవ పరిస్థితులు తెలియజేయాలి. కాగితాలపై ప్రణాళికలు చూపించడం కాదు, నేలమీద పనులు కనిపించాలి” అని స్పష్టం చేశారు.
పుష్కరాలకు సుమారు 10 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశముందని పేర్కొన్న పవన్ కల్యాణ్.. రూ.8,600 కోట్ల వ్యయంతో చేపట్టాల్సిన పనులకు ఇప్పటికీ డీపీఆర్లు సిద్ధం కాకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. “ఒకే ఏడాదిలో 7 వేల పనులు ఎలా పూర్తి చేస్తారు? సరైన ప్రణాళిక లేకుండా పనులు ప్రారంభిస్తే నాణ్యత దెబ్బతింటుంది” అని వ్యాఖ్యానించారు. పర్యాటక శాఖ నుంచి ఆశించిన స్థాయిలో సన్నద్ధత కనిపించడం లేదని పేర్కొన్న పవన్.. కేంద్ర నిధులు పొందాలంటే పూర్తి స్థాయి ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. “ప్రణాళిక లేకుండా అడిగితే ప్రధాని నరేంద్ర మోడీ నిధులు ఇవ్వరు. ప్రతి ప్రాజెక్టుకు స్పష్టమైన డేటా, డీపీఆర్, ఖర్చుల అంచనాలు సిద్ధంగా ఉండాలి” అని అన్నారు. అలాగే, హడావుడిగా నాసిరకం పనులు చేస్తే అవి కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. “పాచిపోయిన సిమెంట్తో పనులు చేసి తర్వాత ప్రమాదాలు జరిగితే ఎన్డీఏ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది” అని స్పష్టం చేశారు.
Also Read
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై పవన్ కల్యాణ్.. రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు
- MLC AnanthaBabu: ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ రద్దు చేసిన కోర్టు
- CM Chandrababu: మహిళా బిల్లును అడ్డుకోవడం పెద్ద విద్రోహం..
- Dead Body Door Delivery Case: ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు షాక్.. పిటిషన్ కొట్టివేసిన కోర్టు..
ఇక, గత పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట ఘటనలు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు పవన్ కల్యాణ్.. పుష్కరాల ఏర్పాట్లు కేవలం రాజమండ్రికే పరిమితం కాకుండా ఆరు జిల్లాల్లోని 274 పంచాయతీల వరకు విస్తరించాలని సూచించారు. భక్తులు పరిశుభ్రమైన వాతావరణంలో స్నానం చేసేలా చర్యలు తీసుకోవాలని, గోదావరి నది కాలుష్య నివారణ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పుష్కరాల సన్నద్ధత అంశాన్ని త్వరలో కేబినెట్ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు 2027 గోదావరి పుష్కరాలకు అవసరమైన నిధుల సమీకరణలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆశాకిరణంలా నిలుస్తారని అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
100% Ethanol: 100% ఇథనాల్పై ప్రభుత్వ కీలక నిర్ణయం.. E100 ఇంధనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం
-
Ramchander Rao: మా మంత్రులు, ఎంపీలే అన్ని చేస్తే.. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు?
-
Sing Geetham : ‘సింగ్ గీతం’ హీరో అయాన్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా ?
-
Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ సోదరి ఎమోషనల్ పోస్ట్.. రాముడి రూపంలో సోదరుడి చిత్రాన్ని పంచుకుంటూ నివాళి
ట్రెండింగ్
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!