KTR : హామీల ఊసే లేదు.. రాష్ట్రాన్ని మాఫియా నడుపుతోంది
- హామీలపై కేటీఆర్ ఫైర్
- హైడ్రాపై తీవ్ర విమర్శలు
- రైతుబంధు నిలిచిపోయిందన్న ఆరోపణ
- కాంగ్రెస్పై మాఫియా కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : మల్కాజ్గిరి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ కొద్ది రోజుల్లోనే ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ, ప్రభుత్వాన్ని ఒక మాఫియాతో పోల్చారు. రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పి, మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చారని కేటీఆర్ మండిపడ్డారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. “ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులవుతున్నా ఇచ్చిన గ్యారంటీల ఊసే లేదు. దీనిపై ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే అడ్డమైన తిట్లు తిడుతున్నారు. వంద రోజుల్లో పిల్లలు పుడతారా అంటూ వింత మాటలు మాట్లాడుతున్నారు” అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ను తిట్టుకుంటూ తిరిగితే చాలు, పాలన చేయనక్కర్లేదు అనే చందాన సీఎం వ్యవహార శైలి ఉందని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన పనులకు రిబ్బన్లు కట్ చేయడానికి సీఎం తన జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
Also Read
- Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
- Grain Storage Silos: తెలంగాణలో ధాన్యం నిల్వకు అత్యాధునిక సైలోలు.. రూ.4,450 కోట్లతో భారీ ప్రణాళిక.!
- Bhadradri Kothagudem: దారుణం.. గర్భిణి కడుపులోనే కత్తెర మర్చిపోయిన నర్సు.. తల్లీబిడ్డల మృతి!
- Instagram Love: ఇన్స్టాగ్రామ్లో ప్రేమ పేరుతో మోసం.. ఇద్దరు యువతుల నుంచి రూ.12 లక్షలకు పైగా కాజేసిన కేటుగాడు.!
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి శూన్యమైందని, కేవలం అప్పులే పెరిగిపోయాయని కేటీఆర్ ఆరోపించారు. ఈ కొద్ది కాలంలోనే ప్రభుత్వం దాదాపు 4 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని పేర్కొన్నారు. “హైదరాబాద్ నగరంలో పేదలకు ఒక్క ఇల్లు కూడా కట్టి ఇవ్వలేదు గాని, ‘హైడ్రా’ పేరుతో ఉన్న ఇళ్లను మాత్రం నిర్దాక్షิญ్యంగా కూల్చుతున్నారు” అని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులను ‘దండుపాళ్యం ముఠా’తో పోల్చిన ఆయన, ఈ ప్రభుత్వాన్ని ఒక మాఫియా నడుపుతోందని, ఆ మాఫియాలో రేవంత్ రెడ్డి ఒక పిల్ల నాయకుడు అని تీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం దగ్గర గోణి సంచులు కూడా లేవని, ఆ సంచులన్నీ ఢిల్లీకి పోతున్నాయని విమర్శించారు. రైతులకు ఇవ్వాల్సిన ‘రైతుబంధు’ డబ్బు బంద్ అయిపోయిందని, ఆ పైసలన్నీ రాహుల్ గాంధీ ఖాతాలో ‘టింగ్ టింగ్’ అని పడుతున్నాయని ఆరోపించారు. ప్రస్తుతం పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, రైతులు ధాన్యం కుప్పలపైనే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజలకు మంచి, చెడు ఏంటో పూర్తిగా అర్థమైందన్న కేటీఆర్, కేసీఆర్ను మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలంతా కథానాయకులు కావాలని పిలుపునిచ్చారు. మల్కాజ్గిరి ప్రజలు , బిఆర్ఎస్ కార్యకర్తలు ఎటువంటి రౌడీలు, గుండాలకు భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పరంగా నిలబడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
KTR : హామీల ఊసే లేదు.. రాష్ట్రాన్ని మాఫియా నడుపుతోంది
-
Thaman S: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తమన్.. ఆ పిల్లల స్కూల్ ఫీజులు కట్టేసిన మ్యూజిక్ డైరెక్టర్!
-
IPL 2027: గంగూలీ మాస్టర్ ప్లాన్.. ఐపీఎల్ 2027లో ఆ జట్టుకు కోచ్గా యువరాజ్ సింగ్..
-
Supreme Court: ఫుట్పాత్పై నడవడం ప్రాథమిక హక్కు.. ప్రత్యేక చట్టం తేవాలని కేంద్రానికి సూచన
-
Annadata Sukhibhava: అన్నదాతలకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్.. ఖాతాల్లోకి సుఖీభవ నిధులు
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?