KTR : హామీల ఊసే లేదు.. రాష్ట్రాన్ని మాఫియా నడుపుతోంది
- హామీలపై కేటీఆర్ ఫైర్
- హైడ్రాపై తీవ్ర విమర్శలు
- రైతుబంధు నిలిచిపోయిందన్న ఆరోపణ
- కాంగ్రెస్పై మాఫియా కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : మల్కాజ్గిరి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ కొద్ది రోజుల్లోనే ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ, ప్రభుత్వాన్ని ఒక మాఫియాతో పోల్చారు. రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పి, మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చారని కేటీఆర్ మండిపడ్డారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. “ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులవుతున్నా ఇచ్చిన గ్యారంటీల ఊసే లేదు. దీనిపై ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే అడ్డమైన తిట్లు తిడుతున్నారు. వంద రోజుల్లో పిల్లలు పుడతారా అంటూ వింత మాటలు మాట్లాడుతున్నారు” అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ను తిట్టుకుంటూ తిరిగితే చాలు, పాలన చేయనక్కర్లేదు అనే చందాన సీఎం వ్యవహార శైలి ఉందని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన పనులకు రిబ్బన్లు కట్ చేయడానికి సీఎం తన జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
Also Read
- Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
- Cyber Crime: ఖమ్మంలో సైబర్ మోసాలకు చెక్.. రంగంలోకి టీజీసీఎస్బీ..
- Jagadish Reddy: కొండా సురేఖను బీఆర్ఎస్లోకి రానివ్వం.. తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం..
- Raids: మాదాపూర్లో నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్స్ దందాపై దాడులు.. రెండు ఔట్లెట్లపై జాయింట్ రైడ్స్..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి శూన్యమైందని, కేవలం అప్పులే పెరిగిపోయాయని కేటీఆర్ ఆరోపించారు. ఈ కొద్ది కాలంలోనే ప్రభుత్వం దాదాపు 4 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని పేర్కొన్నారు. “హైదరాబాద్ నగరంలో పేదలకు ఒక్క ఇల్లు కూడా కట్టి ఇవ్వలేదు గాని, ‘హైడ్రా’ పేరుతో ఉన్న ఇళ్లను మాత్రం నిర్దాక్షิญ్యంగా కూల్చుతున్నారు” అని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులను ‘దండుపాళ్యం ముఠా’తో పోల్చిన ఆయన, ఈ ప్రభుత్వాన్ని ఒక మాఫియా నడుపుతోందని, ఆ మాఫియాలో రేవంత్ రెడ్డి ఒక పిల్ల నాయకుడు అని تీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం దగ్గర గోణి సంచులు కూడా లేవని, ఆ సంచులన్నీ ఢిల్లీకి పోతున్నాయని విమర్శించారు. రైతులకు ఇవ్వాల్సిన ‘రైతుబంధు’ డబ్బు బంద్ అయిపోయిందని, ఆ పైసలన్నీ రాహుల్ గాంధీ ఖాతాలో ‘టింగ్ టింగ్’ అని పడుతున్నాయని ఆరోపించారు. ప్రస్తుతం పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, రైతులు ధాన్యం కుప్పలపైనే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజలకు మంచి, చెడు ఏంటో పూర్తిగా అర్థమైందన్న కేటీఆర్, కేసీఆర్ను మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలంతా కథానాయకులు కావాలని పిలుపునిచ్చారు. మల్కాజ్గిరి ప్రజలు , బిఆర్ఎస్ కార్యకర్తలు ఎటువంటి రౌడీలు, గుండాలకు భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పరంగా నిలబడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
-
Jasprit Bumrah: 2027 ప్రపంచకప్పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
-
RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
-
Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
-
AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!