Devineni Avinash: టీడీపీ నేతల మాటలు జోకర్ల మాటల్ని తలపిస్తాయి.. దేవినేని అవినాష్ విసుర్లు
Devineni Avinash Satires On TDP Leaders And Pawan Kalyan: తూర్పు నియోజకవర్గంలో టీడీపీ నేతలు చేపట్టిన బస్సు యాత్ర అట్టర్ ఫ్లాప్ అయ్యిందని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జీ దేవినేని అవినాష్ విమర్శించారు. అసలు ఆ యాత్రలో టీడీపీ నేతల్ని పట్టించుకునే వారే లేరని ఎద్దేవా చేశారు. యాత్ర ఫ్లాప్ అవ్వడంతో.. టీడీపీ నేతలు పిచ్చిపట్టినట్టుగా వ్యవహరించారని దుయ్యబట్టారు. వైసీపీ నేతలను రెచ్చగొట్టే విధంగా.. 5వ డివిజన్లోని వైసీపీ కార్యలయం ముందు నానా హంగామా చేశారని మండిపడ్డారు. ఆఫీస్ వద్ద మందు తాగి, వైసీపీ నేతల్ని రెచ్చగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రోత్సాహంతోనే.. టీడీపి నేతలు ఆ విధంగా ప్రవర్తించారని ఆరోపించారు.
Alla Nani: జగన్ని ఎదుర్కొనే ధైర్యం లేకనే.. పవన్ విషం చిమ్మారు
Also Read
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- AP SSC Results 2026: టెన్త్ ఫలితాల్లో సత్తా చాటిన ఎంజేపీ బీసీ గురుకులాలు.. 96.02 శాతం ఉత్తీర్ణత..
- AP SSC Supplementary Exams 2026: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల..
- Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
మంచి దళిత నేతగా పేరు తెచ్చుకొన్న కార్పొరేటర్ కలపాల అంబేద్కర్పై టీడీపీ నేతలు దాడి చేశారని దేవినేని అవినాష్ ఫైరయ్యారు. కులం పేరుతో దూషించి, అంబేద్కర్ పట్ల దుర్మార్గంగా వ్యవహరించారని అన్నారు. కులం పేరుతో తనని తిట్టారని అంబేద్కర్ ఫిర్యాదు చేస్తే.. ఎల్లో మీడియా అది తప్పుడు ఫిర్యాదు అంటూ రాతలు రాయడం నీచమైన పని అని విరుచుకుపడ్డారు. గతంలో గద్దె రామ్మోహన్ రోడ్డుపై దళిత నేతల్ని కొట్టించారని ఆరోపించారు. జనాలు లేక టీడీపీ నేతల కామినేని నగర్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారన్నారు. కానీ.. ఎల్లో మీడియా రాసిన రాతలు మాత్రం నీచంగా ఉన్నాయన్నారు. టీడీపీ నేతలపై దాడి చేస్తారన్న సమాచారం అందడంతోనే.. ఆ ప్రోగ్రామ్ రద్దు అయ్యిందని చెప్పడానికి సిగ్గుండాలని ధ్వజమెత్తారు. దళిత నేతలపై దాడి చేసి, దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలని తాము సీపీ ఆఫీస్లో ఫిర్యాదు చేస్తున్నామన్నారు.
Karnataka Assembly: కర్ణాటక అసెంబ్లీలోకి కత్తితో మహిళ.. అరెస్టు చేసిన పోలీసులు
ఎన్నికల సర్వేలు చూసి.. చంద్రబాబు నుంచి కింది స్థాయి టీడీపీ నేతల వరకు భయంతో వణికిపోతున్నారని దేవినేని అవినాష్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో.. వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యాల్ని ఆయన ఖండించారు. వాలంటీర్ల కష్టం తెలిస్తే, పవన్ ఆ విధంగా మాట్లాడరని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓవర్లేకే ఇలాంటి విమర్శలు చేస్తున్నారన్నారు. రిటైనింగ్ వాల్పై ఏ సవాల్ స్వీకరించేందుకైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. టీడీపీ నేతల మాటలు, జోకర్ల మాటల్ని తలపిస్తాయంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
తాజావార్తలు
-
Motorola Moto G87: 200MP కెమెరా, 5200mAh బ్యాటరీతో మోటో G87 విడుదల
-
Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ajit Doval: ఢిల్లీలో ఇటలీ రక్షణ మంత్రి పర్యటన.. అజిత్ దోవల్తో సమావేశం
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
ట్రెండింగ్
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!