Devineni Avinash: టీడీపీ నేతల మాటలు జోకర్ల మాటల్ని తలపిస్తాయి.. దేవినేని అవినాష్ విసుర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devineni Avinash Satires On TDP Leaders And Pawan Kalyan: తూర్పు నియోజకవర్గంలో టీడీపీ నేతలు చేపట్టిన బస్సు యాత్ర అట్టర్ ఫ్లాప్ అయ్యిందని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జీ దేవినేని అవినాష్ విమర్శించారు. అసలు ఆ యాత్రలో టీడీపీ నేతల్ని పట్టించుకునే వారే లేరని ఎద్దేవా చేశారు. యాత్ర ఫ్లాప్ అవ్వడంతో.. టీడీపీ నేతలు పిచ్చిపట్టినట్టుగా వ్యవహరించారని దుయ్యబట్టారు. వైసీపీ నేతలను రెచ్చగొట్టే విధంగా.. 5వ డివిజన్లోని వైసీపీ కార్యలయం ముందు నానా హంగామా చేశారని మండిపడ్డారు. ఆఫీస్ వద్ద మందు తాగి, వైసీపీ నేతల్ని రెచ్చగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రోత్సాహంతోనే.. టీడీపి నేతలు ఆ విధంగా ప్రవర్తించారని ఆరోపించారు.
Alla Nani: జగన్ని ఎదుర్కొనే ధైర్యం లేకనే.. పవన్ విషం చిమ్మారు
Also Read
- Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
- Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
- Road Accident: రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు-ఆటో ఢీ..
- ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
మంచి దళిత నేతగా పేరు తెచ్చుకొన్న కార్పొరేటర్ కలపాల అంబేద్కర్పై టీడీపీ నేతలు దాడి చేశారని దేవినేని అవినాష్ ఫైరయ్యారు. కులం పేరుతో దూషించి, అంబేద్కర్ పట్ల దుర్మార్గంగా వ్యవహరించారని అన్నారు. కులం పేరుతో తనని తిట్టారని అంబేద్కర్ ఫిర్యాదు చేస్తే.. ఎల్లో మీడియా అది తప్పుడు ఫిర్యాదు అంటూ రాతలు రాయడం నీచమైన పని అని విరుచుకుపడ్డారు. గతంలో గద్దె రామ్మోహన్ రోడ్డుపై దళిత నేతల్ని కొట్టించారని ఆరోపించారు. జనాలు లేక టీడీపీ నేతల కామినేని నగర్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారన్నారు. కానీ.. ఎల్లో మీడియా రాసిన రాతలు మాత్రం నీచంగా ఉన్నాయన్నారు. టీడీపీ నేతలపై దాడి చేస్తారన్న సమాచారం అందడంతోనే.. ఆ ప్రోగ్రామ్ రద్దు అయ్యిందని చెప్పడానికి సిగ్గుండాలని ధ్వజమెత్తారు. దళిత నేతలపై దాడి చేసి, దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలని తాము సీపీ ఆఫీస్లో ఫిర్యాదు చేస్తున్నామన్నారు.
Karnataka Assembly: కర్ణాటక అసెంబ్లీలోకి కత్తితో మహిళ.. అరెస్టు చేసిన పోలీసులు
ఎన్నికల సర్వేలు చూసి.. చంద్రబాబు నుంచి కింది స్థాయి టీడీపీ నేతల వరకు భయంతో వణికిపోతున్నారని దేవినేని అవినాష్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో.. వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యాల్ని ఆయన ఖండించారు. వాలంటీర్ల కష్టం తెలిస్తే, పవన్ ఆ విధంగా మాట్లాడరని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓవర్లేకే ఇలాంటి విమర్శలు చేస్తున్నారన్నారు. రిటైనింగ్ వాల్పై ఏ సవాల్ స్వీకరించేందుకైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. టీడీపీ నేతల మాటలు, జోకర్ల మాటల్ని తలపిస్తాయంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
తాజావార్తలు
-
Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Nepal Floods: “నువ్వు దేవుడు సామీ”.. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
-
Suryakumar Yadav: తప్పంతా నాదే.. వన్డే కెరీర్పై సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు!
-
IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!