Alla Nani: జగన్ని ఎదుర్కొనే ధైర్యం లేకనే.. పవన్ విషం చిమ్మారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alla Nani Counter To Pawan Kalyan Comments: ఏలూరు బహిరంగ సభలో జనసేనాధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీమంత్రి ఆళ్లనాని మండిపడ్డారు. అంబేద్కర్ సాక్షిగా.. జగన్పై వారాహి యాత్రలో పవన్ దుష్ర్పచారం చేశారని విమర్శించారు. జగన్ను ఎదుర్కొనే ధైర్యం లేకనే.. చంద్రబాబు మార్గదర్శంలో పవన్ విషం చిమ్మారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధిపై, సమస్యలపై పవన్కు కనీస అవగాహన లేదన్నారు. ఏలూరు నియోజకవర్గ జనసేన సభకు జిల్లా నలుమూలల నుండి జనాన్ని తరలించారన్నారు. ఏలూరులో సమస్యలపై తమ్మిలేరు రక్షణ గోడను రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మించామన్నారు. దశాబ్దన్నర కాలం పాటు సీఎంగా ఉన్న చంద్రబాబు.. ఏనాడూ తమ్మిలేరు ముంపుపై స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kaavaalaa Song: ‘కావాలా’ పాటలో తమన్నా అద్భుతమైన డ్యాన్స్.. ప్రియుడు విజయ్ వర్మ ప్రశంసల వర్షం
Also Read
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
- Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
- AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
- Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
ఏలూరు ఆసుపత్రికి జీవం పోసి, మెడికల్ కాలేజీ తీసుకొచ్చామని ఆళ్ల నాని తెలిపారు. వైసీపీ పాలనలో రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ నిర్మిస్తుంటే.. దానిపై అసత్య ప్రచారం చేయడం తగదని అన్నారు. కుట్రపూరితంగా అసత్యాలు చెప్పి, ఏలూరు ప్రజలను పవన్ మోసం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. శ్మశానంలో ఏసీ రూమ్లు, ఏసీ గదులు పెట్టారన్న ఫిర్యాదులపైనా చర్యలు తీసుకున్నామన్నారు. ఏలూరు అభివృద్ధిపై పవన్ ఎప్పుడు బహిరంగ చర్చకు రమ్మన్నా.. తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. వాలంటీర్లు ఎంతో కష్టపడి రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తుంటే.. వారిపై ఆరోపణలు చేయడం ఏమాత్రం సబబు కాదన్నారు. సీఎం జగన్పై వ్యక్తిగత చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్నే పవన్ ఏలూరులో చదివారని దుయ్యబట్టారు.
అటు.. వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ సైతం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. వాలంటీర్ వ్యవస్థపై పవన్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 29 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నాడన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు చూస్తే.. మద్యం, గంజాయి మత్తులో మాట్లాడినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ బేషరతుగా వాలంటీర్ వ్యవస్థకు, రాష్ట్ర మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
JD Vance Fourth Child: నాలుగోసారి తండ్రైన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. 150 ఏళ్ల అమెరికా చరిత్రలో అరుదైన ఘట్టం
-
Spain Wins FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్.. అర్జెంటీనాపై 1-0 తేడాతో చారిత్రాత్మక విజయం
-
Korean Kanakaraju: అనంతపురం నేలపై ‘కొరియన్ కనకరాజు’ సందడి.. చిరంజీవి స్టెప్పులే స్ఫూర్తి అన్న వరుణ్ తేజ్!
-
Astrology: జూలై 20 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!