CPI Ramakrishna: దేశ ప్రజల మధ్య విభజన రేఖ గీయడానికి.. యూసీసీ తీసుకొస్తున్నారు
CPI Ramakrishna Comments On Uniform Civil Code: మరోసారి దేశ ప్రజల మధ్య విభజన రేఖ గీసేందుకు ‘యూనిఫామ్ సివిల్ కోడ్’ తీసుకురావాలని చూస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో యూసీసీనే ప్రధాన అజెండా అని తెలిపారు. మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే.. భారతదేశాన్ని పూర్తిగా హిందూ దేశంగా చేస్తారని అభిప్రాయపడ్డారు. కర్ణాటక ఎన్నికల్లో కూడా మతాన్ని ఎన్నికల అస్త్రంగా చేసుకొని ముందుకెళ్లారని గుర్తు చేశారు. చేసిందేమీ లేక, చెప్పుకోవడానికి ఏమీ లేక.. మత రాజకీయాలను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగ, రైతుల సమస్యలు అలానే ఉన్నాయని.. రైతులు ఎక్కడా సంతోషంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి పౌర స్మృతితో మరోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ ప్రయత్నం చేస్తోందని చెప్పారు. జాతీయ స్థాయిలో దీనిపై చర్చించి, దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమం చేపడతామని అన్నారు.
Kakani Govardhan Reddy: లోకేష్ పాదయాత్ర ఒక సర్కస్ కంపెనీ.. మీడియా కోసమే వివాదాస్పద వ్యాఖ్యలు
Also Read
- Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
- Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
- AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ
- Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!
ఇక ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలతో ఎన్నుకోబడిన సర్పంచులను గృహ నిర్బంధం చేస్తున్నారని రామకృష్ణ ఆరోపణలు చేశారు. పంచాయితీల డబ్బులు ఇవ్వకుండా ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారని పేర్కొన్నారు. సర్పంచులు అభివృద్ధి పనులు చేయాలంటే.. వారికి నిధులివ్వడం లేదన్నారు. వైసీపీ నాయకుడే సర్పంచ్ సంఘానికి నాయకుడు అని.. సమస్యలు చెప్పుకోవడానికి ఆయనకే అవకాశం ఇవ్వడం లేదని అన్నారు. రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థలకు వచ్చిన అధికారాలను నిర్బంధిస్తున్నారని.. ఇది రాజ్యాంగ వ్యతిరేకమని మండిపడ్డారు. ఛలో పంచాయితీ కార్యక్రమానికి సీపీఐ పూర్తి మద్దతు తెలుపుతుందన్నారు. అమ్మఒడికి డబ్బులు వేశామని చెప్తున్నారని.. కానీ నేటికీ డబ్బులు జమ కాలేదని వ్యాఖ్యానించారు. డబ్బులు పడనప్పుడు బటన్ నొక్కడమెందుకు? ఆర్భాటానికా? అని ప్రశ్నించారు.
Say No: ‘నో’ చెప్పడం నేర్చుకో! ఆటంకాలు తొలగిపోతాయి… లక్ష్యాలు నెరవేరుతాయి
స్మార్ట్ మీటర్ల పేరుతో రాష్ట్ర ప్రజలపై మరో భారం వేస్తున్నారని రామకృష్ణ విరుచుకుపడ్డారు. కమిషన్ కోసం కక్కుర్తి పడి, అత్యధిక ధరకు అదాని కంపెనీకి స్మార్ట్ మీటర్ కాంట్రాక్ట్ అప్పగిస్తున్నారని ఆరోపించారు. స్మార్ట్ మీటర్ కావాలని ఎవరైనా ఆడిగారా? అని నిలదీశారు. ప్రజలపై వేల కోట్ల భారం వేయడానికి స్మార్ట్ మీటర్లు తీసుకొస్తున్నారన్నారు. 4వ తేదీ దేశంపై వామపక్ష పార్టీల సమావేశం నిర్వహించి.. భవిష్యత్ కార్యాచరణ చేపడతామని వివరించారు.
తాజావార్తలు
-
Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
-
Ola Electric Share: ఒక్కప్పుడు రారాజు.. ఇప్పుడు బికారి! ఓలా ఎలక్ట్రిక్ రూ.157 నుంచి రూ.20 కి?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
-
NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!