CPI Ramakrishna: దేశ ప్రజల మధ్య విభజన రేఖ గీయడానికి.. యూసీసీ తీసుకొస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Ramakrishna Comments On Uniform Civil Code: మరోసారి దేశ ప్రజల మధ్య విభజన రేఖ గీసేందుకు ‘యూనిఫామ్ సివిల్ కోడ్’ తీసుకురావాలని చూస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో యూసీసీనే ప్రధాన అజెండా అని తెలిపారు. మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే.. భారతదేశాన్ని పూర్తిగా హిందూ దేశంగా చేస్తారని అభిప్రాయపడ్డారు. కర్ణాటక ఎన్నికల్లో కూడా మతాన్ని ఎన్నికల అస్త్రంగా చేసుకొని ముందుకెళ్లారని గుర్తు చేశారు. చేసిందేమీ లేక, చెప్పుకోవడానికి ఏమీ లేక.. మత రాజకీయాలను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగ, రైతుల సమస్యలు అలానే ఉన్నాయని.. రైతులు ఎక్కడా సంతోషంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి పౌర స్మృతితో మరోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ ప్రయత్నం చేస్తోందని చెప్పారు. జాతీయ స్థాయిలో దీనిపై చర్చించి, దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమం చేపడతామని అన్నారు.
Kakani Govardhan Reddy: లోకేష్ పాదయాత్ర ఒక సర్కస్ కంపెనీ.. మీడియా కోసమే వివాదాస్పద వ్యాఖ్యలు
Also Read
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
ఇక ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలతో ఎన్నుకోబడిన సర్పంచులను గృహ నిర్బంధం చేస్తున్నారని రామకృష్ణ ఆరోపణలు చేశారు. పంచాయితీల డబ్బులు ఇవ్వకుండా ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారని పేర్కొన్నారు. సర్పంచులు అభివృద్ధి పనులు చేయాలంటే.. వారికి నిధులివ్వడం లేదన్నారు. వైసీపీ నాయకుడే సర్పంచ్ సంఘానికి నాయకుడు అని.. సమస్యలు చెప్పుకోవడానికి ఆయనకే అవకాశం ఇవ్వడం లేదని అన్నారు. రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థలకు వచ్చిన అధికారాలను నిర్బంధిస్తున్నారని.. ఇది రాజ్యాంగ వ్యతిరేకమని మండిపడ్డారు. ఛలో పంచాయితీ కార్యక్రమానికి సీపీఐ పూర్తి మద్దతు తెలుపుతుందన్నారు. అమ్మఒడికి డబ్బులు వేశామని చెప్తున్నారని.. కానీ నేటికీ డబ్బులు జమ కాలేదని వ్యాఖ్యానించారు. డబ్బులు పడనప్పుడు బటన్ నొక్కడమెందుకు? ఆర్భాటానికా? అని ప్రశ్నించారు.
Say No: ‘నో’ చెప్పడం నేర్చుకో! ఆటంకాలు తొలగిపోతాయి… లక్ష్యాలు నెరవేరుతాయి
స్మార్ట్ మీటర్ల పేరుతో రాష్ట్ర ప్రజలపై మరో భారం వేస్తున్నారని రామకృష్ణ విరుచుకుపడ్డారు. కమిషన్ కోసం కక్కుర్తి పడి, అత్యధిక ధరకు అదాని కంపెనీకి స్మార్ట్ మీటర్ కాంట్రాక్ట్ అప్పగిస్తున్నారని ఆరోపించారు. స్మార్ట్ మీటర్ కావాలని ఎవరైనా ఆడిగారా? అని నిలదీశారు. ప్రజలపై వేల కోట్ల భారం వేయడానికి స్మార్ట్ మీటర్లు తీసుకొస్తున్నారన్నారు. 4వ తేదీ దేశంపై వామపక్ష పార్టీల సమావేశం నిర్వహించి.. భవిష్యత్ కార్యాచరణ చేపడతామని వివరించారు.
తాజావార్తలు
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
-
Dil Raju: టాలీవుడ్కి కొండంత ధైర్యాన్నిచ్చిన ‘ఇరుముడి’.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
-
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
-
CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!