Baby Dead Body on Scooty: స్కూటీపై పసిబిడ్డ మృతదేహం.. తల్లిదండ్రుల 120 కిలోమీటర్ల ప్రయాణం..
Baby Dead Body on Scooty: పండంటి కూతుర్ని కాపాడుకోవాలన్న ఆ దంపతులు ఆశ తీరలేదు. కంటిపాప కన్నుమూసిందని దుఃఖంలో ఉంటే , ఆసుపత్రి సిబ్బంది దుర్మార్గంగా ప్రవర్తించారు. పసిగుడ్డు మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ అడిగితే మానవత్వం లేకుండా తిరస్కరించారు. మరోదారి లేక ద్విచక్ర వాహనంపై బిడ్డ శవాన్ని మధ్యలో కూర్చో బెట్టుకుని, ఒకట్రెండు కాదు ఏకంగా 120 కిలోమీటర్లు ప్రయాణించారు. ఈ అమానవీయ ఘటన ఉమ్మడి విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది. అల్లారు ముద్దుగా పెంచుకుందామని అనుకున్న తల్లిదండ్రులకు, తాము అనుభవిస్తున్న కష్టం కంటే.. కేజీహెచ్లో ఎదురైన నిర్లక్ష్యం తీరని వేదనను మిగిలించింది. అల్లూరి జిల్లా కేంద్రమైన పాడేరుకు చేరుకున్న బాధితులు, జరిగిన ఘోరం గురించి కుటుంబ సభ్యులకు చెప్పడంతో వెలుగులోకి వచ్చింది.
Read Also: Astrology : ఫిబ్రవరి 17, శుక్రవారం దినఫలాలు
Also Read
- Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!
- Nadendla Manohar : డీజిల్ కొరతకు కారణం ఇదే.. రేపు ఉదయం కల్లా బంకులకు స్టాక్.. మంత్రి కీలక ప్రకటన..!
- Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
- CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
అల్లూరి సీతారామరాజు జిల్లా, కుమడ గ్రామానికి చెందిన మహేశ్వరి, మత్య కొండబాబు దంపతులకు ఈనెల 2న నవజాత శిశువు జన్మించింది. బిడ్డకు శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నట్టు గుర్తించిన పాడేరు ఆ సుపత్రి వైద్యులు మెరుగైన సేవలు కోసం కేజీహెచ్కు తరలించారు. అప్పటి నుంచి ఎన్ఐసీయూ వార్డులో చికిత్స పొందుతూ గురువారం ఉదయం 7 గంటల సమయంలో ప్రాణాలు కోల్పోయింది. డెత్ నిర్ధారించిన వైద్యులు ఆ మేరకు నిర్ధారణ పత్రం తల్లిదండ్రులకు అప్పగించారు. విశాఖకు సుమారు 200 కిలో మీటర్ల దూరంలో ఉన్న కుముడ గ్రామానికి, చిన్నారి మృతదేహాన్ని తీసుకుని వెళ్ళేందుకు అంబులెన్స్ కోసం ప్రయత్నించగా తీవ్ర నిర్లక్ష్యం ఎదురైంది. గిరిజనుల కోసమే ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఒకవైపు బిడ్డను పోగొట్టుకున్న దుఃఖం, సుదూరం వెళ్లాలనే తొందరపాటుతో తల్లిదండ్రులు ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకున్నారు. తాము బిడ్డను తీసుకుని వచ్చిన టూవీలర్ పైనే, మధ్యలో మృతదేహం పెట్టుకుని ప్రయాణం ప్రారంభించారు. చిన్నారి మృత దేహంతో కేజీహెచ్ కాంపౌండ్ దాటుకుని.. తల్లిదండ్రులు మోసుకునిపోతున్నా పట్టించుకునే దిక్కు లేకపోయింది.
అయితే, ఈ అమానవీయ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అదే సమయంలో ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాయని కేజీహెచ్ లో చోటు చేసుకుంటున్న దారుణాలను కళ్ళకు కట్టింది. బాధ్యత వహించాల్సిన యంత్రాంగం ఒకరినినొకరు నిందించుకుని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంబులెన్సులు, మహాప్రస్థానం వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం, కార్పొరేట్ కంపెనీలు నిధులు ఖర్చు చేస్తున్నాయి. కానీ, సిబ్బంది నిర్లక్ష్యం, అడ్మినిస్ట్రేషన్ ఉదాసీన వైఖరి దారుణాలకు కారణంగా నిలుస్తోంది. అంబులెన్స్ కూడా సమకూర్చకుండా తీరని వేదనకు గురిచేసిన తీరుపై రాజకీయ పక్షాలు తీవ్రంగా స్పందించాయి. వైద్యశాఖ సిబ్బంది దుర్మార్గంపై మండిపడుతున్నాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!