Nellore Rotten Meat Seize: నెల్లూరులో నాన్ వెజ్ కొంటున్నారా? బాబోయ్ ఇది తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాన్ వెజ్ ప్రియులకు ఇది షాకింగ్ న్యూస్.. నెల్లూరు నగరంలో భారీగా కల్తీ మాంసం పట్టుబడింది. తమిళనాడు నుంచి లివర్, కందనకాయల వ్యర్థాలను తక్కువ ధరకు తెచ్చి ఇక్కడ అమ్మేస్తున్నారు. నెల్లూరులో చికెన్ ధరకే విక్రయాలు సాగిస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఐస్క్రీమ్ వాహనాల్లో తరలిస్తూ భారీగా చికెన్, మటన్ పట్టుబడింది. ఆరోగ్యశాఖ అధికారులు 400 కేజీలు పట్టుకున్నారంటే ఈ చికెన్ దందా ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు.. ఇదంతా మూడునాలుగురోజుల క్రితం మాంసంగా గుర్తించారు.
కొంత కాలం క్రితం నిరంతరం నిఘాతో మున్సిపల్ హెల్త్ అధికారుల దాడులతో ఇలాంటి అమ్మకాలు సద్దుమణిగాయి. మళ్ళీ పుంజుకున్నాయి. మున్సిపల్ హెల్త్ అధికారుల దాడుల్లో నిల్వ ఉంచిన చికెన్తో పాటు లివర్, కందనకాయలు చెన్నై నుంచి తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి విక్రయాలు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఓ ముఠా చెన్నై నుంచి నెల్లూరుకు భారీగా చికెన్ లివర్, కందనకాయలను దిగుమతి చేయడం వెలుగులోకి వచ్చింది. నెల్లూరులోని చికెన్ స్టాల్స్, హోటల్స్, రెస్టారెంట్లకు వీటిని విక్రయిస్తుంటారు. కేవలం రూ.30 నుంచి రూ.40లకే అక్కడ దొరికే లివర్, కందనకాయలు తీసుకొచ్చి చికెన్ ధరలకు విక్రయిస్తారు.
Also Read
- CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
- CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో 'బుల్లెట్ మోటార్ సైకిల్' ప్రాజెక్టు ఏర్పాటు..!
- Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
- Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
Read Also: Extramarital Affair: సోదరుడితో భార్య ఎఫైర్.. వింత పని చేసిన భర్త
తమిళనాడులో నిల్వ ఉంచిన ఆహారాన్ని నెల్లూరుకు గుట్టుచప్పుడు కాకుండా వివిధ వాహనాల్లో దిగుమతి చేసుకుంటున్నారు. నెల్లూరుతో పాటు ఒంగోలు, గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు సైతం ఈ మాంసం తరలివెళుతుంది. విస్తృత తనిఖీలు అవసరం అనీ, ఇలాంటి మాంసం, మటన్ తింటే ఆరోగ్యం పాడవడం ఖాయం అంటున్నారు. మైపాడుగేటు వేణుగోపాల్నగర్లో ఉన్న ఓ చికెన్ స్టాల్లో గుట్టుచప్పుడు కాకుండా నిల్వ ఉంచిన చికెన్ లివర్, కందనకాయలను ఆరిఫ్ అనే వ్యక్తి ఓ ఐస్క్రీమ్ వాహనం నుంచి దిగుమతి చేసుకుంటుండగా మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వెంటకరమణ తనిఖీలు చేశారు. గతంలో వెంకటరమణ బృందం తనిఖీలు చేసింది.
మళ్లీ ఇప్పుడు తనిఖీలు ముమ్మరం కావడంతో వ్యాపారుల వెన్నులో వణుకు ప్రారంభం అయింది. ఆదివారం, ఇతర సెలవు రోజుల్లో ముక్కలేనిదే ముద్ద దిగనివారికి ఈ తనిఖీలు షాకిచ్చాయి. తాము ఇలాంటి ఆహారం తింటున్నామా అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు అనారోగ్యం కలిగించే ఆహారాన్ని ఎవరైనా విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు హెచ్చరించారు. చికెన్ స్టాల్కు నోటీసులు జారీ చేసి, రూ.25 వేలు జరిమానా విధించారు. చికెన్, మటన్ కొనేముందు అన్నీ ఆలోచించి కొనుగోలు చేయాలని, అనుమానం వస్తే తమకు ఫిర్యాదు చేయాలని హెల్త్ అధికారులు కోరుతున్నారు.
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!