Constable Fake Notes: దొంగనోట్ల కేసులో కానిస్టేబుల్.. ఒకటికి మూడు చొప్పున నకిలీ నోట్లు ఇస్తానని..
Constable Fake Notes Case Filed In Kurnool: ‘చెప్పేవి శ్రీరంగనీతులు, చేసేవన్ని పనికిమాలిన పనులు’ అన్నట్టు.. కొందరు పోలీసు అధికారులు తమ ఖాకీ దుస్తుల్ని అడ్డం పెట్టుకొని అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. ఇప్పుడు ఓ కానిస్టేబుల్ కూడా దొంగనోట్ల చలామణి కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. ఒక అసలు నోటుకి మూడు నకిలీ నోట్లు ఇస్తానంటూ.. రాజకీయ నేతల నుంచి ఏకంగా రూ.30 లక్షలు తీసుకున్నాడు. అయితే.. ఆ కానిస్టేబుల్ నకిలీ నోట్లను ఇవ్వడంలో విఫలం అవ్వడంతో, స్టోరీ మరో మలుపు తీసుకుంది. అతడ్ని కిడ్నాప్ చేయాలని నేతలు భావించారు. ఇంతలో ఈ వ్యవహారం పైఅధికారులకి తెలియడంతో.. కథ పోలీస్ స్టేషన్కి చేరింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Maharastra: ఆటోలో బాలింతపై అత్యాచారం.. కడుపులో తన్నడంతో చిరిగిన కుట్లు
Also Read
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
- Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
- TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
కర్నూలు జిల్లాలోని ఆస్పరికి చెందిన ఓ కానిస్టేబుల్.. దోంగనోట్లను చెలామణీ చేస్తున్నారు. ఈ విషయం ఆస్పరి మండలానికి చెందిన ఇద్దరు రాజకీయ నేతలకు తెలిసింది. దీంతో.. ఆ కానిస్టేబుల్తో వాళ్లిద్దరు ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక అసలు నోటుకి మూడు నకిలీ నోట్లు చొప్పున ఇస్తానని ఆ కానిస్టేబుల్ చెప్పాడు. దీంతో.. వాళ్లు అతనికి రూ.30 లక్షలు ఇచ్చారు. అయితే.. ఒప్పందం ప్రకారం ఆ కానిస్టేబుల్ నకిలీ నోట్లు ఇవ్వలేదు. దాంతో కోపాద్రిక్తులైన ఆ నేతలు.. కానిస్టేబుల్ని కిడ్నాప్ చేసి, తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఓ హత్య కేసులో రెండు రోజుల క్రితమే బెయిల్పై బయటకు వచ్చిన కానిస్టేబుల్లో కిడ్నాప్ చేయాలని పక్కా స్కెచ్ వేసుకున్నారు. ఇంతలోనే ఈ విషయం బయటకు పొక్కడంతో.. అటు, ఇటు చక్కర్లు కొడుతూ చివరికి కర్నూలు అధికారులకు తెలిసింది.
Homeguard Forgery Case: హోంగార్డు చేతివాటం.. ఫోర్జరీ సంతకాలతో నిధులు స్వాహా
దీంతో.. అధికారులు వెంటనే ఆ కానిస్టేబుల్ని కర్నూలుకు పిలిపించి విచారించారు. అతడిచ్చిన సమాచారం మేరకు.. ఆ రాజకీయ నేతల్ని కూడా కర్నూలుకి పిలిపించి, విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే మరో కుండబద్దలయ్యే వాస్తవం వెలుగులోకి వచ్చింది. దొంగనోట్ల వ్యవహారంలో హైదరాబాద్కు చెందిన గ్యాంగ్తోనూ సంబంధాలు ఉన్నాయని తేలింది. ఈ నేపథ్యంలోనే అధికారులు మరింత కూపీ లాగేందుకు.. లోతుగా విచారణ చేపట్టారు. అయితే.. డిపార్ట్మెంట్ పరువు పోతుందని రహస్యంగా విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
Tamilnadu Elections Exit Poll 2026: తమిళనాడులో స్టాలిన్ హవా.. చతికిలపడిన అన్నాడీఎంకే, టీవీకే..
-
Peddi: ‘టాక్సిక్’ అవుట్.. లైన్లోకి రామ్ చరణ్ ‘పెద్ది’!
-
Kerala Election Exit poll 2026: కేరళలో హస్తం హవా.. పినరయికి గుడ్ బై..
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Anand Deverakonda: ఈ కథ చెప్పినప్పుడు.. నా కథ నాకే చెప్పాడా అనిపించింది!
ట్రెండింగ్
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!