Constable Fake Notes: దొంగనోట్ల కేసులో కానిస్టేబుల్.. ఒకటికి మూడు చొప్పున నకిలీ నోట్లు ఇస్తానని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Constable Fake Notes Case Filed In Kurnool: ‘చెప్పేవి శ్రీరంగనీతులు, చేసేవన్ని పనికిమాలిన పనులు’ అన్నట్టు.. కొందరు పోలీసు అధికారులు తమ ఖాకీ దుస్తుల్ని అడ్డం పెట్టుకొని అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. ఇప్పుడు ఓ కానిస్టేబుల్ కూడా దొంగనోట్ల చలామణి కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. ఒక అసలు నోటుకి మూడు నకిలీ నోట్లు ఇస్తానంటూ.. రాజకీయ నేతల నుంచి ఏకంగా రూ.30 లక్షలు తీసుకున్నాడు. అయితే.. ఆ కానిస్టేబుల్ నకిలీ నోట్లను ఇవ్వడంలో విఫలం అవ్వడంతో, స్టోరీ మరో మలుపు తీసుకుంది. అతడ్ని కిడ్నాప్ చేయాలని నేతలు భావించారు. ఇంతలో ఈ వ్యవహారం పైఅధికారులకి తెలియడంతో.. కథ పోలీస్ స్టేషన్కి చేరింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Maharastra: ఆటోలో బాలింతపై అత్యాచారం.. కడుపులో తన్నడంతో చిరిగిన కుట్లు
Also Read
- AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ!.
- Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
- Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
- Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
కర్నూలు జిల్లాలోని ఆస్పరికి చెందిన ఓ కానిస్టేబుల్.. దోంగనోట్లను చెలామణీ చేస్తున్నారు. ఈ విషయం ఆస్పరి మండలానికి చెందిన ఇద్దరు రాజకీయ నేతలకు తెలిసింది. దీంతో.. ఆ కానిస్టేబుల్తో వాళ్లిద్దరు ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక అసలు నోటుకి మూడు నకిలీ నోట్లు చొప్పున ఇస్తానని ఆ కానిస్టేబుల్ చెప్పాడు. దీంతో.. వాళ్లు అతనికి రూ.30 లక్షలు ఇచ్చారు. అయితే.. ఒప్పందం ప్రకారం ఆ కానిస్టేబుల్ నకిలీ నోట్లు ఇవ్వలేదు. దాంతో కోపాద్రిక్తులైన ఆ నేతలు.. కానిస్టేబుల్ని కిడ్నాప్ చేసి, తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఓ హత్య కేసులో రెండు రోజుల క్రితమే బెయిల్పై బయటకు వచ్చిన కానిస్టేబుల్లో కిడ్నాప్ చేయాలని పక్కా స్కెచ్ వేసుకున్నారు. ఇంతలోనే ఈ విషయం బయటకు పొక్కడంతో.. అటు, ఇటు చక్కర్లు కొడుతూ చివరికి కర్నూలు అధికారులకు తెలిసింది.
Homeguard Forgery Case: హోంగార్డు చేతివాటం.. ఫోర్జరీ సంతకాలతో నిధులు స్వాహా
దీంతో.. అధికారులు వెంటనే ఆ కానిస్టేబుల్ని కర్నూలుకు పిలిపించి విచారించారు. అతడిచ్చిన సమాచారం మేరకు.. ఆ రాజకీయ నేతల్ని కూడా కర్నూలుకి పిలిపించి, విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే మరో కుండబద్దలయ్యే వాస్తవం వెలుగులోకి వచ్చింది. దొంగనోట్ల వ్యవహారంలో హైదరాబాద్కు చెందిన గ్యాంగ్తోనూ సంబంధాలు ఉన్నాయని తేలింది. ఈ నేపథ్యంలోనే అధికారులు మరింత కూపీ లాగేందుకు.. లోతుగా విచారణ చేపట్టారు. అయితే.. డిపార్ట్మెంట్ పరువు పోతుందని రహస్యంగా విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
VishnuPriya : ఏడ్చి ఏడ్చి విసిగిపోయా, ఇక నోరు మూసుకునేది లేదు: విష్ణుప్రియ ఫైర్!
-
Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
-
RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
ట్రెండింగ్
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!