CM Jagan : తెలుగు జాతికి చిరస్మరణీయుడు అల్లూరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Jagan Speech at Alluri Sitarama Raju Jayanti Utsav.
తెలుగువారి పౌరుషానికి ప్రతీకైన అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి సందర్భంగా నేడు ఏపీలోని భీమవరంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల సీతారామ రాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ వేదికపై ప్రధాని మోడీ సహా 9మంది మాత్రమే కూర్చునే ఏర్పాట్లు చేశారు. ఈ సభలో ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవికి కూడా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో సీఎం జగన్ మాట్లాడుతూ… దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తికావొస్తున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమం సందర్భంగా అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకొని ఆ మహాయోధుడి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఇక్కడికి (మన భీమవరానికి) వచ్చిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులకు, సోదరుడు చిరంజీవికి, ఇతర పెద్దలకు, మిత్రులకు, అందరికీ సభాధ్యక్షుని హోదాలో సాదరంగా స్వాగతం పలికారు.
Also Read
- 'Thara' Mantra: సైబర్ దొంగల వేటలో ‘టాలీవుడ్ తారలు’.. వైజాగ్ పోలీసుల ‘తార’ మంత్రం మామూలుగా లేదుగా!
- AP Govt: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 1వ తేదీ ఉదయం నుంచే ప్రారంభం..
- CM Chandrababu: చిట్చాట్లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది అనివార్యం..!
- Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
సభకు వచ్చిన నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, అవ్వాతాతలకు, అందరికీ పేరుపేరునా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈరోజు ఇక్కడ మనమంతా ఏకమయ్యాం. ఒక దేశాన్ని ఇంకో దేశం, ఒక జాతిని ఇంకో జాతి, ఒక మనిషిని మరో మనిషి దోపిడీ చేయడానికి వీల్లేని సమాజాన్ని నిర్మించాలని మన స్వాతంత్ర్య యోధులందరూ కలలు కన్నారు. ఇది వారిని స్మరించుకుంటూ ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకుంటున్న సంవత్సరం. మన స్వాతంత్ర్యానికి ఈ ఏడాది 75 సంవత్సరాలు నిండుతాయి. అంటే దానర్థం మనల్ని మనం పాలించుకోవటం ప్రారంభమై ఇప్పటికి 75 సంవత్సరాలు అవుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
మన గడ్డ మీద మన పూర్వీకులు, మన స్వాతంత్ర్య సమరయోధులు వారి భవిష్యత్తుని, వారి జీవితాన్ని, వారి రక్తాన్ని ధారపోసి మన దేశానికి ఈ స్వాతంత్ర్యాన్ని ఇచ్చారు. అలాంటి స్వాతంత్ర్యం అంటే అమృతంతో సమానం. ఇది ఈ ఆజాదీ కా అమృత్ అనే పదానికి అర్థం. 75 ఏళ్ల క్రితం వరకూ జరిగిన మన దేశ స్వాతంత్ర్య సమరంలో, మన జాతీయ ఉద్యమంలో 1757 నుంచి 1947 సంవత్సరం వరకు అంటే దాదాపు 190 సంవత్సరాలను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే పరాయి దేశాలు, పరాయి పాలన మీద మన దేశం యుద్ధం చేస్తూనే అడుగులు ముందుకు వేసింది. లక్షల మంది తమ ప్రాణాలను పణంగా పెట్టారు. వారి త్యాగాల ఫలితమే నేటి మన భారతదేశం.
అటువంటి మహా త్యాగమూర్తుల్లో మన గడ్డ మీద ఈ రాష్ట్ర మట్టి నుంచి, ఇక్కడి ప్రజల నుంచి అనేక అగ్నికణాలు పుట్టాయి. వారు ఎంచుకున్న మార్గాలు వేరైనా కూడా లక్ష్యం మాత్రం ఒక్కటే. అటువంటి త్యాగధనులల్లో, అటువంటి పోరాటయోధులల్లో ఒక మహా అగ్నికణం ఈ రాష్ట్రంలో పుట్టిన అల్లూరి సీతారామరాజు. ఈ రాష్ట్రంలో పుట్టిన మీ బిడ్డలా ఈ విషయాన్ని చెప్పటానికి చాలా గర్విస్తున్నాను. అడవిలో కూడా అగ్గిపుట్టించిన ఆ యోధుడు, ఆ సంస్కర్త సామాజిక ఐకమత్య అవసరాన్ని తెలియజెప్పాడు. భావాలపరంగా ఎన్నటికీ మరణంలేని విప్లవ వీరుడు అల్లూరిని స్మరించుకునేందుకు మనమంతా మన ప్రధానమంత్రి నరేంద్రమోడీ సమక్షంలో సమావేశమయ్యా.
తెలుగు జాతికి, భారతదేశానికి కూడా గొప్ప స్ఫూర్తి ప్రదాత అయిన ఆ మహనీయుడు అడవి బిడ్డలకు ఆరాధ్య దేవుడు. ఆయన వ్యక్తిత్వానికి, ఆయన గొప్పతనానికి, ఆయన త్యాగానికి ఈరోజు ఇక్కడ గొప్పగా నివాళులర్పిస్తున్నాం. అల్లూరి సీతారామరాజు ఘనతను గుండెల్లో పెట్టుకున్నాను కాబట్టే ఆయన నడయాడిన నేలకు, ఆయన నేలకొరిగిన ప్రదేశమున్న గడ్డకు మనందరి ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అని పేరుపెట్టాం. ఈరోజు ఇక్కడ ఏవిధంగా అయితే విగ్రహావిష్కరణ జరుగుతోందో ఆ జిల్లాలో కూడా ఆ మహానుభావుడి కాంస్య విగ్రహావిష్కరణ నిర్వహిస్తున్నాం.
తన మరణాన్ని, తాను జీవించిన జీవితాన్ని తరతరాలకు సందేశమిచ్చేలా బతికి చిన్న వయసులోనే తన ప్రాణాన్ని త్యాగం చేసిన ఆ మహా మనిషిని తెలుగు జాతి ఎప్పటికీ మరిచిపోదు. దేశం కోసం, అడవి బిడ్డల కోసం తననుతానే త్యాగం చేసుకున్న ఆ మహా వీరుడికి నా వందనం. ఎప్పటికీ కూడా ఆ మహావీరుడు చరితార్థుడు. అతని త్యాగం ప్రతి పాపా, ప్రతి బాబూ, ప్రతి మనిషి గుండెల్లో చిరకాలంగా నిలిచిపోతుందని తెలియజేస్తున్నాను. అమర్ రహే అల్లూరి సీతారామరాజు. అమర్ రహే అల్లూరి సీతారామరాజు. జైహింద్’ అని సీఎం వైఎస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..