జడ్జిలను జడ్జిలే నియమిస్తారనుకోవడం భ్రమ: సీజేఐ ఎన్వీ రమణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ పర్యటనలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్జిలను జడ్జిలే నియమిస్తారని భావించడం ఓ భ్రమ అని సీజేఐ వ్యాఖ్యానించారు. మిగతా వ్యవస్థల తరహాలో న్యాయవ్యవస్థ కూడా ఓ పావు లాంటిదేనన్నారు. జడ్జిల నియామకాల్లో చాలా మంది పాత్ర ఉంటుందని.. జడ్జిల నియామకాల్లో కేంద్ర న్యాయ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్లు, హైకోర్టు కొలీజియం, ఇంటెలిజెన్స్ బ్యూరో, అత్యున్నత స్థాయి అధికారుల పాత్ర కూడా ఉంటుందని సీజేఐ తేల్చి చెప్పారు. జడ్జిల నియామకాల్లో ఇంత జరుగుతున్నా.. అది తెలిసిన వాళ్లు కూడా జడ్జిలను జడ్జిలే నియమిస్తున్నారంటూ వ్యాఖ్యానించడం సరికాదన్నారు.
మరోవైపు బెజవాడ చట్టానికి పట్టం కట్టిన నగరమని సీజేఐ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. బెజవాడ గాలి పీల్చి.. కృష్ణా నీళ్లు తాగి.. బెజవాడ ఇచ్చిన ధైర్యంతో అనేక డక్కా మొక్కీలు తిని ఈ స్థాయికి చేరానన్నారు. బెజవాడ బార్ అసోసియేషన్లో సభ్యునిగా ఉన్న రోజుల్లో ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా నాటి బెజవాడ బార్ అసోసియేషనే స్పందించేదని గుర్తుచేశారు. నాడు బెజవాడ బార్ అసోసియేషన్కు ఉన్న చైతన్య స్పూర్తి ఇప్పుడు కొద్దిగా తగ్గిందనే చెప్పాలన్నారు. బెజవాడలో కోర్టుల బిల్డింగ్ కోసం తాను యాక్టింగ్ చీఫ్ జస్టిస్సుగా ఉన్నప్పుడు నిధులు కేటాయింపచేశానని.. కానీ ఇప్పటికీ బిల్డింగ్ నిర్మాణం పూర్తి కానందుకు చాలా బాధపడుతున్నానని పేర్కొన్నారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి.. పోయాయి.. కానీ బిల్డింగ్ పూర్తి కాలేదన్నారు.
Also Read
- OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Nara Lokesh: బాధిత కుటుంబాలకు భరోసా.. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం: మంత్రి నారా లోకేష్
- CGST Superintendent: రూ.50 వేలు లంచం.. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ సీజీఎస్టీ (CGST) సూపరింటెండెంట్..
పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకంలో స్వతంత్ర వ్యవస్థ ఉండాలని సీజేఐ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. పీపీల వ్యవస్థ ప్రభుత్వం ఆధీనంలో ఉందని.. అధర్మంగా ఎవరికైనా శిక్షలు పడకుండా ఉండాలంటే పీపీల వ్యవస్థ మారాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో నాలుగు కోట్లకు పైగా కేసులు పెండింగులో ఉన్నాయన్నారు. న్యాయమూర్తులను.. న్యాయ వ్యవస్థను బయట సమాజం నుంచి.. బయట ప్రపంచం నుంచి కాపాడాల్సింది న్యాయ వాదులే అన్నారు. న్యాయమూర్తులపై జరుగుతోన్న దాడుల గురించి.. వారికి జరుగుతోన్న అవమానాల గురించి న్యాయవాదులే నిలబడి ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందన్నారు. న్యాయవ్యవస్థకు రాజకీయాలతో సంబంధం లేదని.. ఇదొక వ్యవస్థ అని.. దీనిపై ప్రజలకు నమ్మకం పోకూడదని సీజేఐ అన్నారు. డబ్బు లేకపోవడం వల్ల న్యాయం లభించలేదనే పరిస్థితి రాకూడదని.. పేదలకు ఉచిత న్యాయ సేవలు అందించాలని సీజేఐ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!