జడ్జిలను జడ్జిలే నియమిస్తారనుకోవడం భ్రమ: సీజేఐ ఎన్వీ రమణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ పర్యటనలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్జిలను జడ్జిలే నియమిస్తారని భావించడం ఓ భ్రమ అని సీజేఐ వ్యాఖ్యానించారు. మిగతా వ్యవస్థల తరహాలో న్యాయవ్యవస్థ కూడా ఓ పావు లాంటిదేనన్నారు. జడ్జిల నియామకాల్లో చాలా మంది పాత్ర ఉంటుందని.. జడ్జిల నియామకాల్లో కేంద్ర న్యాయ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్లు, హైకోర్టు కొలీజియం, ఇంటెలిజెన్స్ బ్యూరో, అత్యున్నత స్థాయి అధికారుల పాత్ర కూడా ఉంటుందని సీజేఐ తేల్చి చెప్పారు. జడ్జిల నియామకాల్లో ఇంత జరుగుతున్నా.. అది తెలిసిన వాళ్లు కూడా జడ్జిలను జడ్జిలే నియమిస్తున్నారంటూ వ్యాఖ్యానించడం సరికాదన్నారు.
మరోవైపు బెజవాడ చట్టానికి పట్టం కట్టిన నగరమని సీజేఐ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. బెజవాడ గాలి పీల్చి.. కృష్ణా నీళ్లు తాగి.. బెజవాడ ఇచ్చిన ధైర్యంతో అనేక డక్కా మొక్కీలు తిని ఈ స్థాయికి చేరానన్నారు. బెజవాడ బార్ అసోసియేషన్లో సభ్యునిగా ఉన్న రోజుల్లో ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా నాటి బెజవాడ బార్ అసోసియేషనే స్పందించేదని గుర్తుచేశారు. నాడు బెజవాడ బార్ అసోసియేషన్కు ఉన్న చైతన్య స్పూర్తి ఇప్పుడు కొద్దిగా తగ్గిందనే చెప్పాలన్నారు. బెజవాడలో కోర్టుల బిల్డింగ్ కోసం తాను యాక్టింగ్ చీఫ్ జస్టిస్సుగా ఉన్నప్పుడు నిధులు కేటాయింపచేశానని.. కానీ ఇప్పటికీ బిల్డింగ్ నిర్మాణం పూర్తి కానందుకు చాలా బాధపడుతున్నానని పేర్కొన్నారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి.. పోయాయి.. కానీ బిల్డింగ్ పూర్తి కాలేదన్నారు.
Also Read
- YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
- YS Jagan: చంద్రబాబు చెప్పిన ప్రకారం పెట్రోల్, డీజిల్పై రూ.8 తగ్గించాలి కదా..? జగన్ డిమాండ్
- TDP Politburo Meeting: నేడు టీడీపీ పొలిట్బ్యూరో కీలక భేటీ.. మహానాడు ఏర్పాట్లపై ప్రధాన చర్చ
- Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకంలో స్వతంత్ర వ్యవస్థ ఉండాలని సీజేఐ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. పీపీల వ్యవస్థ ప్రభుత్వం ఆధీనంలో ఉందని.. అధర్మంగా ఎవరికైనా శిక్షలు పడకుండా ఉండాలంటే పీపీల వ్యవస్థ మారాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో నాలుగు కోట్లకు పైగా కేసులు పెండింగులో ఉన్నాయన్నారు. న్యాయమూర్తులను.. న్యాయ వ్యవస్థను బయట సమాజం నుంచి.. బయట ప్రపంచం నుంచి కాపాడాల్సింది న్యాయ వాదులే అన్నారు. న్యాయమూర్తులపై జరుగుతోన్న దాడుల గురించి.. వారికి జరుగుతోన్న అవమానాల గురించి న్యాయవాదులే నిలబడి ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందన్నారు. న్యాయవ్యవస్థకు రాజకీయాలతో సంబంధం లేదని.. ఇదొక వ్యవస్థ అని.. దీనిపై ప్రజలకు నమ్మకం పోకూడదని సీజేఐ అన్నారు. డబ్బు లేకపోవడం వల్ల న్యాయం లభించలేదనే పరిస్థితి రాకూడదని.. పేదలకు ఉచిత న్యాయ సేవలు అందించాలని సీజేఐ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Fire Accident : NH-44 పై భారీ ప్రమాదం.. 8 కొత్త కార్లు పూర్తిగా దగ్ధం..!
-
West Bengal: మదర్సాల్లో ‘వందేమాతరం’ తప్పనిసరి.. సువేందు సంచలన నిర్ణయం..
-
Bengaluru: ఎయిరిండియాకు తప్పిన పెను ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో ఏం జరిగిందంటే..!
-
RBI: రూపాయికి కొంత ఉపశమనం.. ఆర్బీఐ చర్యలతో భారీ ఊరట..
-
Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!