YS Jagan Tirumala Visit: వైఎస్ జగన్ తిరుమల పర్యటన.. ఎన్డీఏ కూటమి నేతల కీలక నిర్ణయం..
- వైఎస్ జగన్ తిరుమల పర్యటన..
- ఎన్డీఏ కూటమి నేతల కీలక నిర్ణయం..
- జగన్ ను అడ్డుకోరాదని నిర్ణయం తీసుకున్న ఎన్డీఏ నేతలు..
- తిరుమలకు జగన్ వెళ్లే దారిలో ఎన్డీఏ కూటమి నేతల శాంతియుత నిరసనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan Tirumala Visit: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై వివాదం చెలరేగిన వేళ.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన ఉత్కంఠగా మారింది.. కూటమి పార్టీలతో పాటు హిందూ సంఘాలు జగన్ పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించడంతో.. ఏం జరగబోతోంది? అనేది ఆసక్తికరంగా మారింది.. అయితే, ఈ సమయంలో.. తిరుపతిలో సమావేశమైన ఎన్డీఏ కూమటి నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, నరసింహ యాదవ్, పసుపులేటి హరిప్రసాద్, అజయ్ కుమార్ తదితర నేతలు హాజరు అయ్యారు. ఇక, ఈ సమావేశంలో.. మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటనను అడ్డుకోరాదని నిర్ణయం తీసుకున్నారు.. తిరుమలకు జగన్ వెళ్లే దారిలో ఎన్డీఏ కూటమి నేతలు శాంతియుతంగా నిరసన తెలపాలని నిర్ణయించారు.. శ్రీవారి లడ్డూ ప్రసాదాల కల్తీకి జగన్ కారణమని ఎన్డీఎ కూటమి నిరసనకు ప్లాన్ చేసింది.. రాజకీయ బలప్రదర్శనకు వైసీపీ దిగితే దీటుగా సమాధానం ఇవ్వాలని సమావేశంలో నిర్ణయానికి వచ్చారు.
Read Also: iPhone 16: పది నిమిషాల్లో ఐఫోన్ 16 డెలివరీ.. ఎక్కడ ఆర్డర్ చేయాలంటే.?
Also Read
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ.. అక్టోబర్ 4వ తేదీ శ్రీవారికి సీఎం చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.. అక్టోబర్ 2వ తేదీ పవన్ కల్యాణ్ తిరుపతికి వస్తున్నారు.. ప్రాయచ్చిత్త దీక్షను పవన్ కల్యాణ్ తిరుమలలో ముగిస్తారు అని తెలిపారు.. 2వ తేదీన సాయంత్రం 5 గంటలకు అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు పవన్ బయలుదేరుతారు.. 3వ తేదీన ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు.. మూడో తేదీ సాయంత్రం తిరుపతిలో వారాహిసభలో పవన్ కల్యాణ్ పాల్గొంటారని వెల్లడించారు.. వారాహి సభ విజయవంతం చేస్తాం అన్నారు.. మరోవైపు.. శ్రీవారిని దర్శించుకునే అర్హత వైఎస్ జగన్ కు లేదని మండిపడ్డారు.. జగన్ ఐదేళ్లలో తన సతీమణితో కలిసి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించ లేదన్న ఆయన.. ఇందిరా గాంధీ, అబ్దుల్ కలామ్ లాంటి వాళ్లు డిక్లరేషన్ ఇచ్చి.. స్వామివారిని దర్శించుకున్నారు.. కానీ, జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకుండా స్వామిని దర్శించుకుంటున్నారు అంటూ దుయ్యబట్టారు.. ఇది ఆగమశాస్త్రానికి విరుద్ధం.. జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో సంక్షేమం పేరుతో దోచుకున్నారు.. దేవాలయాలను అపవిత్రం చేశారు అని మండిపడ్డారు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు.
తాజావార్తలు
-
IND vs AFG Test: షాకింగ్.. మూఢనమ్మకంతో స్టేడియం నుంచి వెళ్లిపోయిన టీమిండియా క్రికెటర్ ఫ్యామిలీ!
-
Janhvi Kapoor : బాలీవుడ్లో అందాల ఆరబోస్తే నీతులు.. సౌత్లో స్కిన్ షో చేస్తే బూతులు?
-
MS Subbulakshmi Biopic : లెజెండరీ సింగర్ బయోపిక్ లో రష్మిక… సాయి పల్లవి చేజారినట్టే ?
-
Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
-
Iran-Israel Tensions: మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!