YS Jagan Tirumala Visit: వైఎస్ జగన్ తిరుమల పర్యటన.. ఎన్డీఏ కూటమి నేతల కీలక నిర్ణయం..
- వైఎస్ జగన్ తిరుమల పర్యటన..
- ఎన్డీఏ కూటమి నేతల కీలక నిర్ణయం..
- జగన్ ను అడ్డుకోరాదని నిర్ణయం తీసుకున్న ఎన్డీఏ నేతలు..
- తిరుమలకు జగన్ వెళ్లే దారిలో ఎన్డీఏ కూటమి నేతల శాంతియుత నిరసనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan Tirumala Visit: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై వివాదం చెలరేగిన వేళ.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన ఉత్కంఠగా మారింది.. కూటమి పార్టీలతో పాటు హిందూ సంఘాలు జగన్ పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించడంతో.. ఏం జరగబోతోంది? అనేది ఆసక్తికరంగా మారింది.. అయితే, ఈ సమయంలో.. తిరుపతిలో సమావేశమైన ఎన్డీఏ కూమటి నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, నరసింహ యాదవ్, పసుపులేటి హరిప్రసాద్, అజయ్ కుమార్ తదితర నేతలు హాజరు అయ్యారు. ఇక, ఈ సమావేశంలో.. మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటనను అడ్డుకోరాదని నిర్ణయం తీసుకున్నారు.. తిరుమలకు జగన్ వెళ్లే దారిలో ఎన్డీఏ కూటమి నేతలు శాంతియుతంగా నిరసన తెలపాలని నిర్ణయించారు.. శ్రీవారి లడ్డూ ప్రసాదాల కల్తీకి జగన్ కారణమని ఎన్డీఎ కూటమి నిరసనకు ప్లాన్ చేసింది.. రాజకీయ బలప్రదర్శనకు వైసీపీ దిగితే దీటుగా సమాధానం ఇవ్వాలని సమావేశంలో నిర్ణయానికి వచ్చారు.
Read Also: iPhone 16: పది నిమిషాల్లో ఐఫోన్ 16 డెలివరీ.. ఎక్కడ ఆర్డర్ చేయాలంటే.?
Also Read
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ.. అక్టోబర్ 4వ తేదీ శ్రీవారికి సీఎం చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.. అక్టోబర్ 2వ తేదీ పవన్ కల్యాణ్ తిరుపతికి వస్తున్నారు.. ప్రాయచ్చిత్త దీక్షను పవన్ కల్యాణ్ తిరుమలలో ముగిస్తారు అని తెలిపారు.. 2వ తేదీన సాయంత్రం 5 గంటలకు అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు పవన్ బయలుదేరుతారు.. 3వ తేదీన ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు.. మూడో తేదీ సాయంత్రం తిరుపతిలో వారాహిసభలో పవన్ కల్యాణ్ పాల్గొంటారని వెల్లడించారు.. వారాహి సభ విజయవంతం చేస్తాం అన్నారు.. మరోవైపు.. శ్రీవారిని దర్శించుకునే అర్హత వైఎస్ జగన్ కు లేదని మండిపడ్డారు.. జగన్ ఐదేళ్లలో తన సతీమణితో కలిసి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించ లేదన్న ఆయన.. ఇందిరా గాంధీ, అబ్దుల్ కలామ్ లాంటి వాళ్లు డిక్లరేషన్ ఇచ్చి.. స్వామివారిని దర్శించుకున్నారు.. కానీ, జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకుండా స్వామిని దర్శించుకుంటున్నారు అంటూ దుయ్యబట్టారు.. ఇది ఆగమశాస్త్రానికి విరుద్ధం.. జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో సంక్షేమం పేరుతో దోచుకున్నారు.. దేవాలయాలను అపవిత్రం చేశారు అని మండిపడ్డారు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు.
తాజావార్తలు
-
Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
-
Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
-
Censor: సినిమా రీ-ఎడిటింగ్కు సెన్సార్ బోర్డు చెక్: నిబంధనల్లో కీలక మార్పులు?
-
AP Govt: రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కేవలం రూ.1.50కే.. జీవో జారీ..
-
Tollywood: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. ‘నో’ అంటున్న డైరెక్టర్!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..