Minister Ramprasad Reddy: కుప్పంలో ఆర్టీసీ బస్సులు ప్రారంభం.. అన్ని ప్రాంతాలకు సర్వీసులు
- కుప్పంలో ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి
- డీజిల్ రెట్లు తగ్గినా బస్సు చార్జీలు పెంచిన ఘనత జగన్ ది- మంత్రి
- శాఖల్లో ఏదైనా అవినీతి జరిగి ఉంటే.. తప్పకుండా చర్యలు తీసుకుంటాం
- రాజకీయ సభలకు ఫ్రీగా బస్సులు ఉపయోగించం
- కుప్పం బస్టాండ్ ఆధునీకరణకు చర్యలు తీసుకుంటాం- మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆర్టీసీ బస్సులను రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డీజిల్ రెట్లు తగ్గినా కూడా బస్సు చార్జీలు పెంచిన ఘనత జగన్ ది అని ఆరోపించారు. జగన్ మాటలు ప్రజలు వినే పరిస్థితి లేదని అన్నారు. మరోవైపు.. శాఖల్లో ఏదైనా అవినీతి జరిగి ఉంటే, తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా.. ఏ రాజకీయ సభలకు ఫ్రీగా బస్సులు ఉపయోగించమని అన్నారు. మరోవైపు.. కుప్పం బస్టాండ్ ఆధునీకరణకు చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. కుప్పం బస్ డిపోలో ఆధునీకరణ పనులు చేపడుతామని తెలిపారు. 5 కొత్త బస్సులను ప్రారంభించామని.. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనకు రావడంతో సుమారు 30 బస్సులు కుప్పం డిపోకు వచ్చాయన్నారు. 5 బస్సులను ఒకేసారి ప్రారంభించడం ఆనందంగా ఉందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
Read Also: Julian Assange: అస్సాంజేకి విముక్తి.. సుదీర్ఘ వివాదానికి ముగింపు..
Also Read
- CM Chandrababu: కుప్పంలో పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం.. రూ.9,322 కోట్ల పెట్టుబడులతో 27 పరిశ్రమలు.!
- CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
- Narayanaswamy: నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు.. ప్రజల విశ్వాసం పొందాలంటే సీబీఐ విచారణే మార్గం..!
- MLA Thomas: నన్ను గెలకొద్దు.. గెలికితే ఏ రాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి పోతావ్.. మాజీ డిప్యూటీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తామని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వం ఏ శాఖను వదల్లేదని.. 5 ఏళ్లలో ఎన్ని వీలైతే అన్ని విద్యుత్ బస్సులు తీసుకొస్తామని తెలిపారు. ఆడంబరం చేయకుండా ప్రజల కోసం పని చేయాలని పేర్కొన్నారు. కార్మికులు, ప్రయాణికులు కళ్ళు లాంటి వారని అన్నారు. మరోవైపు.. డిపోలో పని చేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి రాంప్రసాద్ తెలిపారు. ప్రభుత్వంతో ఏపీఏస్ ఆర్టీసీని 100 శాతం విలీనం చేసేందుకు కృషి చేస్తామన్నారు. అంతేకాకుండా.. కుప్పం నుండి అన్ని ప్రాంతాలకు బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
Read Also: IND Playing 11: స్టార్ ఆటగాడిపై వేటు.. సంజూకు చోటు! ఇంగ్లండ్తో ఆడే భారత్ తుది జట్టు ఇదే
తాజావార్తలు
-
StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
-
Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
-
YS Jagan: ముద్రగడకు జగన్ భావోద్వేగ నివాళి.. ‘పితృసమాన నేతను కోల్పోయాం’
-
Posani Krishna Murali: ‘మా నాన్న కూలీ.. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు’
-
IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!